breaking news
Terror module
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
శ్రీనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్గఢ్ ప్రాంతంలో సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్డీఎక్స్, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలతో పాటు కోడ్ లాంగ్వేజ్లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బసంత్గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు.. అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు! -
దాడులకు ప్లాన్.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
హరిద్వార్: ఉత్తరాఖండ్లో ఉగ్రవాదుల కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం నలుగురు అనుమానితులను హరిద్వార్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్, ఐబీ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో వీరిని పట్టుకున్నారు. వీరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. హరిద్వారాలో జరుగుతున్న అర్ధ్ కుంభ మేళాలో దాడులకు కుట్రపన్నుతున్నట్టు సమాచారం. పఠాన్ కోట్ దాడులకు పాల్పడిన వారితో ఈ నలుగురికి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీలోని షాపింగ్ మాల్స్లలో కూడా దాడులు చేయడం కోసం వీరు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. పోలీసులు వీరిని ఢిల్లీలోని కోర్టు ముందు హాజరు పరిచారు.