-
టీపాడ్ ఆధ్వర్యంలో మరింత ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు
విదేశాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారి దృష్టిని ఆకర్షించిన అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) తాజాగా బతుకమ్మ పండుగను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. అదే స్థాయిలో దసరా వేడుకలకూ సన్నాహకాలు ప్రారంభించింది. గతంలో దాదాపు పన్నెండు వేల మందితో బతుకమ్మ పండుగను నిర్వహించగా ఈసారి సుమారు 16వేల మందితో మరింత ఘనంగా, మహా సంబరంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నది. డాలస్లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టాలని నిశ్చయించింది. అక్టోబర్ 1న కొమెరికా ఈవెంట్ సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా) వేదికగా నిర్వహించే ఈ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నది. పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, అర్కన్సాస్లో ఉంటున్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు ఈ సందర్భంగా టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. ఫ్రిస్కో పట్టణంలోని శుభమ్ ఈవెంట్ సెంటర్లో ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాండు పాల్వాయి పాల్గొన్నారు. కాలిఫోర్నియాలో నివాసముంటున్న హెల్త్కేర్ మొఘల్ డాక్టర్ ప్రేమ్రెడ్డి.. పెద్దఎత్తున నిర్వహించబోయే ఈ వేడుకలకు తన మద్దతు ప్రకటించారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి కొర్సపాటి తమవంతు సహాయసహకారాలందిస్తామని ప్రకటించారు. స్థానిక నాయకులు, వ్యాపారులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములమవుతామని తెలిపారు. కాగా, ఇటీవలే టీపాడ్ డాలస్లో తిరుమల వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని టీటీడీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. -
డాలస్లో బతుకమ్మ, దసరా పండుగలను మళ్లీ ఘనంగా నిర్వహిస్తాం: టీపాడ్
బతుకమ్మ, దసరా పండుగలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ గర్వించేలా నిర్వహిస్తామని అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి(టీపాడ్) నూతన కమిటీ ప్రకటించింది. కొవిడ్ మహమ్మారి క్రమంగా కనుమరుగవుతున్నందున ఈ ఏడాది పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకర్షించిన అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి(టీపాడ్)కి 2022 సంవత్సరానికి గాను కొత్తపాలకవర్గం ఎన్నికయింది. నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు పాలకమండలి సభ్యులందరూ ఫిబ్రవరి 12వ తేదీన ఫ్రిస్కో నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక నేతలు, టీపాడ్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమెరికా, భారత జాతీయ గీతాలను ఆలపించారు. రూప కన్నయ్యగారి, అనురాధ మేకల నిర్వహణలో స్థానిక గాయకులు స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రావణ్కుమార్ శ్రావ్యమైన గీతాలతో ఆహుతులను అలరించారు. గతేడాది బాధ్యతలు నిర్వర్తించిన కమిటీ సభ్యులు కొత్త పాలకవర్గానికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రమాణస్వీకారం చేయించారు. లతా మంగేష్కర్కు ఘన నివాళి కార్యక్రమంలో భాగంగా పద్మవిభూషణ్, బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ఇటీవలే పరమపదించిన లెజెండరీ సింగర్ లతామంగేష్కర్కు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వేలాది మందితో పండుగల నిర్వహణ అనంతరం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్పర్సన్ ఇంద్రాణి పంచెర్పుల, అధ్యక్షుడుగా ఎన్నికైన రమణ లష్కర్, సమన్వయకర్త పాండురంగారెడ్డి పాల్వాయి, కార్యదర్శి లక్ష్మీ పోరెడ్డి, ఉపాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నందున.. ఎప్పటి మాదిరే ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, తెలుగు ప్రజలు గర్వించేలా బతుకమ్మ, దసరా పండుగలను వేలాది మందితో భారీఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను, భోజన వితరణను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను సుసంపన్నం చేస్తూ.. ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అజయ్రెడ్డి, వైస్చైర్మన్ జానకీరాం మందాడి, రావు కల్వల, రఘువీర్ బండారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రేపటితరానికి అందించడంతో పాటు తాము నివసిస్తున్న ప్రాంతాల సంస్కృతిని సుసంపన్నం చేయడమే టీపాడ్ లక్ష్యమని వివరించారు. నరేష్ సుంకిరెడ్డి, కరణ్ పోరెడ్డి, చంద్ర పోలీస్ మరియు సతీష్ నాగిళ్ల మాట్లాడుతూ కొత్త ఎన్నికైన పాలకమండలి సభ్యులను అభినందించారు. మహిళల భాగస్వామ్యంతోనే టీపాడ్ విజయవంతం ఫ్రిస్కో పార్క్స్ అండ్ రిక్రియేషన్ బోర్డ్ సభ్యుడు, టీపాడ్ సలహాదారు అయిన వేణు భాగ్యనగర్ మాట్లాడుతూ.. డాలస్ తెలంగాణ ప్రజాసమితి విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి కారణం మహిళల భాగస్వామ్యమేనని కొనియాడారు. చివరగా.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టీఏఎన్టీఈఎక్స్) మరియు ఇండియన్ అసోసియేషన్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ)లో పలు పదవులను అలంకరించడంతో పాటు ప్రస్తుతం నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షుడుగా పనిచేస్తున్న శ్రీధర్రెడ్డి కొర్సపాటిని టీపాడ్ నాయకత్వం సత్కరించింది. కొత్త కమిటీలో ఎవరెవరంటే... 2022 సంవత్సరానికి గాను ఎగ్జిక్యూటివ్ కమిటీలో రమణ లష్కర్, మాధవి లోకిరెడ్డి, లక్ష్మీపోరెడ్డి, రత్న ఉప్పల, రవికాంత్ మామిడి, లింగారెడ్డి అల్వా, అనురాధ మేకల, మధుమతి వైశ్యరాజు, మంజుల తొడుపునూరి, శ్రీధర్ వేముల, శ్రీనివాస్ అన్నమనేని, శంకర్ పరిమల్, గాయత్రి బుషిగంపల, స్వప్న తుమ్మపాల, రేణుక చనమోలు ఉంటారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా ఇంద్రాణి పంచెర్పుల, సుధాకర్ కలసాని, పాండురంగారెడ్డి పాల్వాయి, గోలి బుచ్చిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండల, పవన్ గంగాధర, రావు కల్వల, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు, రాం అన్నాడి వ్యవహరిస్తారు. -
ఇందిరమ్మ మూటలిచ్చింది: కాకా
సాక్షి, హైదరాబాద్: 1969లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) తరఫున ఎంపీలుగా గెలిచిన వారంతా ఆ తరువాత కాంగ్రెస్లో ఎందుకు చేరారనే దానిపై కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి సోమవారం ఇక్కడ గుట్టువిప్పారు. నాటి ఎన్నికల్లో పోటీచేసి గెలిచేందుకు ఇందిరాగాంధే తమకు ఆర్థిక సాయం చేశారని చెప్పారు. ‘‘తెలంగాణ కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదని చాలా మంది అంటున్నా రు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నా. 1969లో తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా ఉంది. నేను, చెన్నారెడ్డిసహా 25 మందిమి బయటకొచ్చి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) పార్టీ పెట్టినం. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫునే పోటీ చేసినం. కానీ మా దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు నేను ఇందిరాగాంధీ వద్దకు పోయిన. ‘పోటీ చేస్తున్న వాళ్లమంతా కాంగ్రెస్ వాళ్లమేనమ్మా.. ఎన్నికలయ్యాక వాళ్లందరినీ మీ దగ్గరకు తీసుకొస్తా. తెలంగాణలో విప్లవాన్ని ఆపాలంటే మాకు డబ్బులు కావాలి. ఎన్నికల్లో గెలిచినంక మళ్లీ కాంగ్రెస్లోకి వస్తం’అని చెప్పిన. వెంటనే ఇందిరమ్మ ‘నిజంగా తెస్తావా’అని అడిగి నిర్ధారించుకుని నన్ను ఉమాశంకర్ దీక్షిత్ (గవర్నర్ షిలాదీక్షిత్ మామ) వద్దకు పంపింది. చెన్నారెడ్డి డబ్బుల విషయంలో నన్ను నమ్మలేదు. నాతోపాటు మెల్కొటేను కూడా పంపిండు. మేమిద్దం వెళ్లగా అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నడు. అప్పుడే ఆయనకు దీక్షిత్ డబ్బుల సూట్కేసు ఇచ్చి పంపిండు. ఆ తరువాత మాకు సూట్కేసు ఇచ్చిండు. ఆ డబ్బును చెన్నారెడ్డికి ఇచ్చినం. ఆ డబ్బుతోనే ఎన్నికల్లో కొట్లాడి గెలిచినం’’ అని నాడు జరిగిన విషయాలన్నీ వెల్లడించారు. ఆనాడు తాము తెలంగాణకు ద్రోహం చేశామని చెబుతూ ప్రజలను క్షమాపణ కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement