breaking news
team india Former captain
-
టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!
నారీ కాంట్రాక్టర్.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు. కాలంలో కొంచెం వెనక్కి వెళితే మాత్రం నారీ కాంట్రాక్టర్ పేరు సుపరిచితమే. 1950-60ల మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్గా గుర్తింపు పొందాడు. అంతేకాదు నారీ కాంట్రాక్టర్ టీమిండియాకు కెప్టెన్గానూ పని చేయడం విశేషం. ఇదంతా సరే.. ఇప్పుడెందుకు ఈ క్రికెటర్ ప్రస్తావన అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. బౌన్సర్ దాటికి నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడంతో క్రికెట్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత అతని తలలో ఒక మెటల్ ప్లేట్ అమర్చారు. ఇదంతా 1962 నాటి మాట.. కట్చేస్తే 60 ఏళ్ల తర్వాత వైద్యులు నారీ కాంట్రాక్టర్ తలలో నుంచి మెటల్ ప్లేట్ను విజయవంతగా తొలగించారు. ప్రస్తుతం నారీ కాంట్రాక్టర్ వయసు 80 ఏళ్లు. మెటల్ ప్లేట్ తొలగింపు తర్వాత ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు నారీ కాంట్రాక్టర్ కుమారుడు హెషెడర్ పేర్కొన్నాడు. అసలేం జరిగింది..? 1962లో టీమిండియా వెస్టిండీస్లో పర్యటించింది. ఆ పర్యటనే నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కెరీర్కు ముగింపు పలుకుంతుందని బహుశా ఊహించి ఉండడు. విండీస్తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బౌలర్ వేసిన బౌన్సర్ నారీ కాంట్రాక్టర్ తలకు బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే నారీ కాంట్రాక్టర్ కుప్పకూలాడు. అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆ తర్వాత భారతదేశానికి పంపించారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ చండీ ఆధ్వర్యంలో నారీ కాంట్రాక్టర్ తలకు తగిలిన దెబ్బను పరిశీలించి మెటల్ ప్లేట్ను అమర్చారు. అప్పటినుంచి బాగానే ఉన్నప్పటికి ఇటీవలే స్కానింగ్ చేయగా.. మెటల్ ప్లేట్ వల్ల చర్మం ఉడిపోతూ వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ నిర్వహించి తలలోని మెటల్ ప్లేట్ను తొలగించారు. కాగా నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడానికి ముందే ఔటయ్యే అవకాశం వచ్చింది. నారీ ఇచ్చిన క్యాచ్ విండీస్ ఫీల్డర్ జారవిడవడంతో.. బౌన్సర్ ఆడి శాశ్వతంగా క్రికెట్కు దూరమయ్యాడు నారీ కాంట్రాక్టర్. టీమిండియా తరపున 1955-62 మధ్య కాలంలో 31 టెస్టుల్లో 1611 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1955-62 మధ్య కొంతకాలం టీమిండియా కెప్టెన్గానూ పని చేశాడు. చదవండి: Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్చేస్తే మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే -
40 రోజుల్లో రూ. 10 కోట్లు సంపాదిస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువకులకు క్రికెట్ ఓ కెరీర్ ఆప్షన్ అని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. యువత క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించాడు. ఓ క్రికెటర్ 40 రోజుల్లోనే 10 కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నాడని పరోక్షంగా ఐపీఎల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. సోమవారం ఓ కార్యక్రమంలో కపిల్ మాట్లాడుతూ.. క్రికెట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం రావడం శుభపరిణామనని అన్నాడు. కాలంతో పాటు ప్రపంచ క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయని కపిల్ చెప్పాడు. 'పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే కనీసం క్రికెట్ ఆడాలి. సచిన్ టెండూల్కర్ లేదా రాహుల్ ద్రావిడ్ వంటి గొప్ప క్రికెటర్ కావాలి' అని కపిల్ అన్నాడు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని, క్రీడలకు సంబంధించిన వస్తువులపై పన్ను తగ్గించాలని కోరాడు. పాఠశాలల్లో తగిన క్రీడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించాడు.