breaking news
teaching mathematics
-
బ్రిటన్ విద్యార్థులు 18 ఏళ్లొచ్చేదాకా... గణితం నేర్వాల్సిందే: రిషి
లండన్: బ్రిటన్ విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చేదాకా గణిత బోధన ఖచ్చితంగా ఉండాలని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. ‘ 18 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏటా గణితం చదవాల్సిందేననే నిబంధన బ్రిటన్లో ఇన్నాళ్లూ లేదు. ఇకపై అలా కుదరదు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రపంచంలో ఏ ఉద్యోగం చూసినా డేటా, గణాంకాలతో ముడిపడి ఉంది. విద్యా వ్యవస్థకు గణితమే ప్రధాన భూమిక. అలాంటి విభాగంలో బ్రిటన్ విద్యార్థులు వెనుకంజ వేయొద్దు. గణితం నేర్వాల్సిందే’ అని కొత్త ఏడాదిలో చేసిన తొలి ప్రసంగంలో సునాక్ స్పష్టంచేశారు. గణితం బోధనను తప్పనిసరి చేసేలా నిబంధనలను మార్చుతామని ప్రధాని చెప్పారని ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, బ్రిటన్లో చాన్నాళ్లుగా గణిత బోధకుల తీవ్ర కొరత ఉందని ది అసోసియేషన్ ఆఫ్ స్కూల్, కాలేజ్ లీడర్స్ తెలిపింది. -
‘ఎంపికైతే ఇతర పోస్టులను వదులుకోండి’
సాక్షి, హైదరాబాద్: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) మేథమెటిక్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ ఇతర సబ్జెక్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా, టీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా, వాటిని వదులుకోవాలని టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. తద్వారా ఆయా పోస్టుల్లో ఆ తరువాత మెరిట్లో ఉండే వారిని ఎంపిక చేయవచ్చని పేర్కొంది. టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు ఎంపికైన వారు తమ వెబ్సైట్లోని లింకు ద్వారా 30వ తేదీన మిగతా పోస్టులను వదులుకునేందుకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది. -
‘లెక్క’ చెప్పేదెవరు?
సర్కారు బడి లెక్కతప్పింది. 6, 7 తరగతులకు గణితం బోధన విషయంలో చిక్కుముడి ఏర్పడింది. ఫిజిక్స్ టీచర్లే గణిత పాఠాలు చెప్పాలని లెక్కల మాస్టార్లు.. అది మా బాధ్యత కాదని ఫిజిక్స్ టీచర్లు చేతులు దులుపుకుంటుండడంతో వార్షిక క్యాలెండర్ సైతం తయారు చేయలేకపోయారు. లెక్కల పాఠాల విషయంలో ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ల మధ్య వివాదంతో విద్యార్థులు నష్టపోతున్నారు. సాక్షి, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7 తరగతుల విద్యార్థులకు గణితం బోధించడంపై గందరగోళం నెలకొంది. ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ల మధ్య రగులుతున్న సమస్య విద్యార్థులకు శాపంగా మారింది. ఉన్నత పాఠశాలల్లో íఫిజిక్స్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ రెం డు సబ్జెక్టులు కీలకమైనవి కూడా. అయితే మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు 8, 9, 10 తరగతుల వారికి గణి తం బోధిస్తున్నారు. కానీ 6, 7 తరగతుల వారికి మా త్రం చెప్పడం లేదు. ఇదేమంటే ఆ తరగతులకు ఫిజి కల్ సైన్స్ టీచర్లు లెక్కలు బోధించాల్సి ఉంటుందంటున్నారు. ఆ తరగతులు మావి కావంటే, మావికా వ ంటూ ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్లు చేతులెత్తేస్తుండడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచోరంగా మారింది. గతేడాది వివాదం కారణంగా విద్యార్థులు నష్టపోయారు. వివాదం ఇలా.. ఉన్నత పాఠశాలల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ స్కూల్ అసిస్టెంట్ల మధ్య బోధనకు సంబంధించి కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. అయితే గతేడాది ఫిజికల్ సైన్స్ టీచర్లు 6, 7 తరగýతుల బోధన బాధ్యతను మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లకే అప్పగించాలని ప్రభుత్వానికి విన్నవించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆర్సీ 77 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏడో తరగతికి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు, ఆరో తరగతికి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు గణితం బోధించాలని పేర్కొన్నారు. దీనిపై మ్యాథ్స్ టీచర్లు విద్యాశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ డైరెక్టర్ తన ఆదేశాలను పక్కన పెట్టాలని డీఈవోలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే 6, 7 తరగతులకు గణితం ఎవరు బోధించాలన్న పంచాయతీ మాత్రం తేల్చలేదు. గతేడాది కొన్నిచోట్ల గణిత పాఠాలు ఎవరూ చెప్పకపోవడంతో విద్యార్థులు నష్టపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. చాలా పాఠశాలల్లో 6, 7 తరగతులకు గణితం బోధన మాది కాదంటే మాది కాదంటూ అటు మ్యాథ్స్ టీచర్లు, ఇటు ఫిజికల్ సైన్స్ టీచర్లు చేతులెత్తేస్తుండడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. వార్షిక క్యాలెండర్ ఏదీ? విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యాశాఖ ముందుగానే వార్షిక క్యాలెండర్ను రూపొందించాల్సి ఉంటుంది. ఈసారి విద్యాసంవత్సరం మార్చి 21నే ప్రారంభమైంది. వేసవి సెలవుల వరకు పాఠశాలలు కొనసాగాయి. అయితే కనీసం బడులు పునఃప్రారంభమయ్యేలోపైనా వార్షిక క్యాలెండర్ను విడుదల చేయలేదు. పాఠశాలలు తెరిచి నెల గడిచినా వార్షిక క్యాలెం డర్ మాత్రం వెలువడలేదు. 6, 7 తరగతులకు సం బంధించిన గణిత బోధన విషయంలో క్యాలెండర్ వె లువడి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు 6, 7 తరగతులకు సం బంధించిన గణిత బోధన విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం వార్షిక క్యాలెండర్ను రూ పొందిస్తే.. ఉపాధ్యాయులు ఆయా తరగతులకు గణిత పాఠాలు బోధిస్తారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.