breaking news
t.baburao naidu
-
ఆలకిస్తూ.. అన్నీ చూస్తూ
VIP రిపోర్టర్ టి బాబూరావు నాయుడు, ఐఏఎస్ ఉదయం ఎనిమిది గంటలైంది. ఏలూరు నగరం చిరు జల్లులతో ముసురుకుంది. పత్తేబాద రైతుబజార్లో కూరగాయల ధరలు మాత్రం మంటెక్కిపోతున్నాయి. ధరలు వింటేనే వినియోగదారుల గుండెలు గుభేల్మంటున్నాయి. బయటి మార్కెట్లో ధరలకు రైతు బజార్లో ధరలకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న కూర‘గాయాల’ కష్టాలను తెలుసుకునేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు ‘సాక్షి’ రిపోర్టర్గా మారారు. రైతుబజార్కు వచ్చి ప్రతి దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ విక్రరుుస్తున్న కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా ఉన్నాయో వినియోగదారులు, దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ధరలు ఎందుకు పైపైకి వెళ్తున్నాయి.. అక్కడ దళారులు ఎంతమంది ఉన్నారు.. నిజమైన రైతులు ఎంతమంది.. వారి కష్టాలేమిటి.. వినియోగదారుల సమస్యలేమిటనే విషయూలను స్వయంగా తెలుసుకున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులు నష్టపోకుండా పరిష్కార మార్గాలేమిటో కనుక్కునేందుకు ‘వీఐపీ రిపోర్టర్’ ద్వారా చక్కటి అవకాశం దక్కిందని బాబూరావునాయుడు వ్యాఖ్యానించారు. బాబూరావునాయుడు : ఏమండీ.. రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయ్ ? పీపీ రాజు : చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. గతంలో ఇంత ఎక్కువ ధరలు ఎప్పుడూ చూడలేదు. జారుుంట్ కలెక్టర్ బాబూరావునాయుడు ఎస్టేట్ అధికారి నందినీ దేవితో మాట్లాడుతూ రైతు బజార్ ఉద్దేశమేమిటో తెలుసా అని ప్రశ్నించారు. అనంతరం పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్లారు. కూరగాయలు కొనేందుకు వచ్చిన బత్తిన సత్యవతితో మాట్లాడారు. చిక్కుడుకాయలు ఎంతకు కొంటున్నారని అడిగారు. సత్యవతి : రేటు చాలా ఎక్కువగా ఉంది సార్. కిలో 46 రూపాయలంట. చిక్కుడు కాయలు అమ్ముతున్న వ్యక్తితో జేసీ మాట్లాడుతూ ‘పంట మీరు పండిస్తున్నారా.. కొని తీసుకు వస్తున్నారా’ అని ప్రశ్నించారు. వ్యాపారి : చిక్కుడు కాయలు మా బంధువు తోటలో పెంచుతున్నారు. అతని వద్ద తీసుకు వస్తున్నాం సార్. బాబూరావునాయుడు : మరీ ఇంత ఎక్కువ రేటయితే ఎలా? వ్యాపారి : లేదు సార్.. గత వారంతో పోలిస్తే ఇప్పుడు ధర తగ్గిందని చెప్పగా, అక్కడి నుంచి జేసీ పక్కనే ఉన్న బియ్యం దుకాణం వద్దకు వెళ్లి బియ్యం ధరలపై ఆరా తీశారు. బాబూరావునాయుడు : ఇక్కడ బియ్యం ధరలు ఎలా ఉంటున్నాయ్ శేఖర్ : సంతృప్తికరంగానే ఉంటున్నాయి సార్. బయటకన్నా సుమారు 6 రూపాయలు తక్కువ ధరకే బియ్యం ఇస్తున్నారు. బాబూరావునాయుడు : మీరు చెప్పండి. నాణ్యత ఎలా ఉంటోంది. కె.శ్రీనివాసరావు : బయటి మార్కెట్లో మాదిరిగానే ఉంటున్నాయ్ సార్ బాబూరావునాయుడు : ధరలు తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది. యల్లపు దుర్గారావు : రైతులే డెరైక్టుగా అమ్మేలా చేస్తే ధరలు మరికాస్త తగ్గించే అవకాశముంది సార్. బాబూరావునాయుడు : ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయ్ ప్రభుకుమార్ : సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయ్. బజారును మరికాస్త విశాలంగా చేస్తే బాగుం టుంది. వర్షం వస్తే బురదమయంగా మారిపోతోంది. బాబూరావునాయుడు : డ్రెరుునేజీ వ్యవస్థ ఎలా ఉంది. బెజవాడ సరమ్మ : చాలా దారుణంగా ఉంది సార్. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. ఎంతోమంది అధికారులు తనిఖీలు అంటూ వస్తున్నారు, వెళుతున్నారు కానీ.. ఇక్కడ ఏమీ చేయడం లేదు. బాబూరావునాయుడు : ‘మరుగుదొడ్లు పురుషులకు, మహిళలకు విడివిడిగా ఉన్నాయా లేదా’ అని అడిగిన ప్రశ్నకు అక్కడి వ్యాపారం చేసుకునే మహిళ లేదు సార్.. అందరికీ కలిపి అవే మరుగుదొడ్లు అని చెప్పింది. ‘అలా ఎలా పెడతారు’ అని జేసీ అని అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుండి పక్కనే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లారు. బాబూరావునాయుడు : ఇక్కడ పారిశుధ్యం ఎలా ఉంది. బత్తిన సత్యవతి : అస్సలు బాగోడం లేదు సార్. చెత్త ట్రాక్టర్ రెండు రోజులకు ఒకసారి వస్తోంది. కూరగాయ వ్యర్థాలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయ్ సార్. బాబూరావునాయుడు : మంచినీళ్లు అందుతున్నాయా మేకల తిరుపతమ్మ : అందడంలేదు సార్. కనీసం వాడకం నీరు కూడా ఉండటం లేదు. 24 గంటలూ నీరు అందే ఏర్పాటు చేయండి సార్. బాబూరావునాయుడు : ఇంకా ఎవరైనా.. ఏమైనా చెబుతారా శ్రీధర్రాజు : సంచార రైతు బజార్ ఏర్పాటు చేస్తే చాలా మందికి అనుకూలంగా ఉంటుంది సార్. సత్రంపాడు, శాంతినగర్ ప్రాంతాల్లో కూడా ఒక రైతు బజార్ పెడితే ఆప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేసినట్లవుతుంది సార్. బాబూరావునాయుడు : షెడ్లు సౌకర్యంగానే ఉంటున్నాయా సుంకర మురళీకృష్ణ : లేదు సార్. అటువైపు షెడ్లు మరీ కిందకు ఉండటంతో వినియోగదారుల తలలకు తగులుతున్నాయి. చాలా అసౌకర్యానికి గురౌతున్నారు సార్. అక్కడి నుండి మరుగుదొడ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లిన జేసీ పరిస్థితుల్ని గమనించారు. నీళ్ల నిల్వ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుపై మూత లేకపోవడంతో చెట్టు ఆకులు అందులో పడి అపరిశుభ్రమౌతున్నాయని, ట్యాంకుపై మూత ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్ నందినీ దేవి జేసీకి విజ్ఞప్తి చేశారు. కూరగాయలు కొనుగోలు చేస్తున్న వి.రాఘవ అనే మహిళ వద్దకు వెళ్లిన జేసీ ‘కూరగాయల ధరలు ఎలా ఉన్నాయమ్మా’ అని అడిగారు. వి.రాఘవ : అరటి కాయలు, మునగ కాయలు కొనలేకపోతున్నాం సార్. క్యాబేజీకి ఒకే దుకాణం ఉండటంతో ధర అధికంగా ఉంటోంది. పక్కనే ఉన్న వ్యాపారి కల్పించుకుని ‘క్యాబేజీ ఒక్క రైతే తీసుకు వస్తున్నారు సార్. పైగా క్యాబేజీ వల్ల చెత్త అధికంగా ఉంటోందని ఎస్టేట్ ఆఫీసర్ ఒక్క దుకాణానికే అనుమతిచ్చారు. ధర మాత్రం బయటకన్నా తక్కువగానే ఉంటోంది’ అని చెప్పాడు. ఈవని భాస్కర్ అనే వినియోగదారుడు జేసీతో మాట్లాడుతూ ‘సార్ ఒకే రకం కూరగాయలకు బోర్డులో రెండు ధరలు రాస్తున్నారు. దీంతో వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నార’ని ఫిర్యాదు చేశారు. బాబూరావునాయుడు : రైతులూ.. సంతృప్తిగా ఉన్నారా కుమార్బాబు : కూరగాయలు తక్కువ ధరకే కావాలని అందరూ ఆశిస్తున్నారే తప్ప రైతుకు ఏమి మిగులుతోందనేది ఎవరూ పట్టించుకోవడం లేదు సార్. ఎరువులు, పురుగు మందులు వాడి పంటను పెంచి.. కాపు కాసిన తరువాత కోత కోయడానికి కూలీలను పెట్టుకోవడంతో నిర్వహణ భారం పెరిగిపోయి ఏమీ మిగలడం లేదు. రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని ధరలు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలి సార్. బాబూరావునాయుడు : రాత్రి ఎన్ని గంటల వరకూ వ్యాపారాలు చేస్తున్నారు ఎల్లపు దుర్గారావు : సుమారు 8 గంటల వరకూ వ్యాపారాలు చేస్తున్నాం. దోమలు చంపేస్తున్నాయ్. కరెంటు కూడా సరిగా ఉండటం లేదు సార్. బాబూరావునాయుడు : ఏమ్మా.. నీకు గుర్తింపు కార్డు ఇచ్చారా. గోరి రాజేశ్వరి : ఇచ్చారు సార్... ఇదిగో. బాబూరావునాయుడు : ఎంతకాలమైంది. అందరికీ ఇచ్చారా. రాజేశ్వరి : మూడు నాలుగు నెలలైంది సార్. జేసీ మరో వ్యాపారిని పిలిచి ‘ఇక్కడ అందరికీ ఆధార్ కార్డులున్నాయా, రైతు గుర్తింపు కార్డులున్నాయా’ అని ప్రశ్నించారు. రైతు బజార్ ఎస్టేటు ఆఫీసర్ నందినీదేవి కల్పించుకుని ‘రైతు బజార్లలో ఈ మధ్యనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు సార్. రైతులందరూ తమ పొలాల్లో ఫొటోలు తీయించుకుని దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో ఇక్కడ వ్యాపారులందరూ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశం పరిశీలనలో ఉంది. అందువల్ల గుర్తింపు కార్డులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది’ అని వివరించారు. అప్పుడే రైతు బజార్కు వచ్చిన ఒక పెద్దాయన జారుుంట్ కలెక్టర్ను కలసి ‘ఎస్టేట్ అధికారి రైతులపైన, వ్యాపారులపైన ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతున్నారు. ఆమెను తీరు మార్చుకోమని చెప్పండి’ అని సూచించడంతో జారుుంట్ కలెక్టర్ పక్కనే ఉన్న నందినీదేవిని చూపించి ‘ఈమేనా..’ అని అడిగారు. ఆ పెద్దాయన తనకు మనిషి తెలియదని, మైకులో ఆమె మాటలు వింటూ ఉంటానని.. ఇక్కడి వారు ఆమె గురించి అన్న మాటలు మీ దృష్టికి తీసుకువచ్చానని చెప్పారు. సంచార రైతు బజార్ల ఏర్పాటుకు కృషి ‘సాక్షి’ దినపత్రిక వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడింది. రైతు బజార్ను పరిశీలించడంతో వినియోగదారులు, వ్యాపారులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగింది. ముఖ్యంగా వినియోగదారులు సూచించిన మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సంచార రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్ కంటే రైతు బజార్లో బాగా తక్కువ ధరకు దొరికేలా రైతుల భాగస్వామ్యం పెంచడానికి ఇప్పటికే నిబంధనల్ని కఠినతరం చేశాం. ఈ రైతు బజార్లో మంచినీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య, పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉన్నట్టు గ్రహించాను. సమస్యల సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తాను. ధరల నిర్ణయంలో రైతుల కష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ప్రతిరోజూ చెత్త తొలగించేవిధంగా నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. ఏ దుకాణంలో ఏ రకం కూరగాయలు ఉంటే ఆ రకానికి చెందిన ధరలే బోర్డులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రజలు, వ్యాపారులు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ త్వరగా పరిష్కరించగలిగేవే కాబట్టి వాటిపై దృష్టి పెడతాం. - టి.బాబూరావునాయుడు, జాయింట్ కలెక్టర్ -
రెవెన్యూ ఉద్యోగులకు గ్రేడింగ్
ఏలూరు, న్యూస్లైన్ : ప్రజలకు సత్వర సేవలు అందించేం దుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం డెప్యూ టీ తహసిల్దార్ల సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ ప్రాధాన్యతను జేసీ వివరించారు. గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశ్యంతోనే వీఆర్వోల వ్యవస్థను బలోపేతం చేశారని, అయితే వీఆర్వోల పనితీరు ఆశించిన మేర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. గ్రామస్థాయిలో అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేయాల్సిన వీఆర్వోలు సరైన సమాచారాన్ని యంత్రాంగానికి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలిందన్నారు. దశాబ్దాల తరబడి గ్రామాల్లో పాతుకుపోయిన వీఆర్వోలను బదిలీ చేసి రెవెన్యూ వ్యవస్థను జిల్లాలో పటిష్టం చేయడానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆలోచిస్తున్నట్లు జే సీ వివరించారు. వీఆర్వో స్థారుు నుంచి ప్రగతి నివేదికలు వీఆర్వో స్థాయి నుంచి ప్రగతి నివేదికలు ప్రతినెలా సమగ్రంగా సమర్పించాలని, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అధికారులు ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఊపేక్షించబోమని జేసీ హెచ్చరించారు. జిల్లాలో ఒక్క గజం కూడా స్థలం అన్యాక్రాంతం కాకూడదని, భూముల సమగ్ర సమాచారం, జమాబందీ రికార్డులు, మీ సేవ కేంద్రాల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆయన ఆదేశించారు. త్వరలో మండల స్థాయిలో వీఆర్వోలు, ఆర్ఐలతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయా లో సూచించాలని డీటీలను కోరారు. డీఆర్వో కె.ప్రభాకర్రావు మాట్లాడుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా భూమి కేటాయించాలంటే ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి అవసరమైన భూ ప్రతిపాదనలు కలెక్టర్కు అందాలని చెప్పారు. 10 ఎకరాలు లేదా రూ.50 లక్షల విలు వ లోపు భూములను ప్రభుత్వం సంస్థలకు కేటాయిం చే అధికారం కలెక్టర్కు ఉందని, ఆపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అనుమతి కోసం పంపాలని ఆయన వివరించారు. కేటాయించిన భూములు లీజుకు ఇచ్చినా చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్నా అటువంటి వాటిపై నివేదిక సమర్పిస్తే జిల్లా స్థాయి ల్యాండ్ ఆడిట్ మోనటరింగ్ కమిటీ పరిధిలోకి తీసుకువచ్చి వాటిని రద్దు పరుస్తామని డీఆర్వో తెలిపారు. ఉద్యోగుల పనితీరు తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానం జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు రెవెన్యూ స్కోర్ కార్డును ఆన్లైన్లో పొందుపర్చామని జారుుంట్ కలెక్టర్ చెప్పారు. ప్రతి నెలాఖరున గ్రామాల వారీగా ప్రగతి వివరాలను డీటీలు సేకరించి ఆన్లైన్లో రెండో తేదీలోగా డేటాను పొందుపర్చాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నూరు శాతంపైగా సాధించిన ఉద్యోగులకు గ్రేడ్-ఏ 90 నుంచి 100 శాతం లక్ష్యాలు సాధిస్తే గ్రేడ్ బి, 80 నుంచి 90లోపు సాధిస్తే గ్రేడ్ సీ, 80 శాతం లోపు ఉంటే వారిని డి గ్రేడ్లో ఉంచుతామన్నారు. పనితీరును బట్టి పదోన్నతులు కల్పిస్తామన్నారు. రెవెన్యూ స్కోర్ కార్డులో తప్పుడు సమాచారం పొందుపరిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మీడియాతోనే సామాజిక మార్పులు జేసీ బాబూరావునాయుడు
ఏలూరు, న్యూస్లైన్ : సామాజిక మార్పులకు మీడియా యే ప్రధాన కారణమని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు అన్నారు. ఏలూరు గవరవరంలోని సెంట్ ఆన్స్ మహిళా కళాశాలలో రెండు రోజుల పాటు ఏపీ ప్రెస్ అకాడమీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన పాత్రికేయుల శిక్షణ తరగతుల ముగింపు సభలో సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పాలనారంగానికి మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమని జేసీ అన్నారు. వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందని చెప్పారు. విలేకరి నిత్య విద్యార్థి జిల్లా అదనపు ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ విలేకరి నిత్య విద్యార్థని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి అందించాల్సిన గురతర బాధ్యత వారిపై ఉందన్నారు. కొన్ని సందర్భాలలో పాత్రికేయుల నుంచి కీలక సమాచారం పోలీస్ శాఖ కూడా పొందుతుందని గుర్తుచేశారు. అయితే పరిశోధనాత్మక కేసులకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని సందర్భాలలో గోప్యంగా ఉంచాల్సిన అవసరముందన్నారు. సభకు అధ్యక్షతన వహించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేం దర్ మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని ప్రాంతాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. పలు అంశాలపై శిక్షణ సామాజిక విలువలు పాటిస్తూ పాత్రికేయునిగా తన పరిధిని గుర్తెరిగి ఏవిధంగా ఉండాలనే విషయంపై వల్లీశ్వర్ వివరించారు. ‘పరువు నష్టం కోర్టు ధిక్కారం’ అంశంపై రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఆర్.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న విలేకరులకు ధ్రువీకరణ పత్రం, కిట్లను జేసీ, సురేందర్, చంద్రశేఖర్ అం దజేశారు. ప్రెస్ అకాడమీ సెక్రటరీ ఎస్ఏ హష్మి, జి.నాగరాజు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డెప్యూటీ డెరైక్టర్ రెహ్మన్, జిల్లా పౌరసంబంధాధికారి ఆర్వీఎస్ రామచంద్రరావు, డివిజినల్ పౌరసంబంధాధికారి ఎం.భాస్కరనారాయణ, ఏపీఆర్వో పి.మాధవ్, సూపరింటెండెంట్ శ్రీగోవింద్ నాయక్ పాల్గొన్నారు. -
తీరంలో అలజడి
ఏలూరు, న్యూస్లైన్: వరుస ఉపద్రవాలతో అతలాకుతలమైన జిల్లాను లెహర్ తుపాను వణికిస్తోంది. జిల్లాపై బుధవారం మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, గురువారం తీరం దాటే సమయంలో తీవ్రరూపంలో విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. నష్ట నివారణ చర్యలపై సమీక్ష : రానున్న రెండురోజుల్లో లెహర్ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమై నష్టనివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్కుమార్తో కలసి ఏలూరులో జిల్లా అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రఘువీరా ఆదేశించారు. సహాయక చర్యలకు నిధుల కొరత లేదని చెప్పారు. పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించడానికి అవసరమైన బృందాలను నియమించాలని జేసీ టి.బాబూరావునాయుడును ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీ కనుమూరి బాపిరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), రాష్ట్ర చిన్న నీటిపారుదల అభివృద్ధి మండలి చైర్మన్ ఘంటా మురళి, ఇరి గేషన్ ఎస్ఈ వైఎస్ సుధాకర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పాల్గొన్నారు. నరసాపురంలో కలెక్టర్ మకాం తుపాను నేపథ్యంలో కలెక్టర్ సిద్ధార్థజైన్ నరసాపురంలో మకాం చేశారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం వర్షాలతో తుపాను ఆరంభమవుతుం దని, గురువారం నాటికి భారీ గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు లెహర్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రెవెన్యూ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ నిరవధికంగా పనిచేస్తాయి.