breaking news
Taxi Stand
-
అస్సాంలో మూకదాడి..విద్యార్థి నేత మృతి
జోర్హాత్: అస్సాంలో జరిగిన మూకదాడిలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు)నేత ఒకరు అసువులు బాశారు. జోర్హాత్ నగరంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద సోమవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఆసు నేత అనిమేశ్ భుయాన్(28), మరో ఇద్దరు కార్యకర్తలు మృతుస్మంత బారువా, ప్రణయ్ దత్తాలతో కలిసి తమ వాహనం వద్ద నిలుచుని ఉండగా ఒక వృద్ధుడు స్కూటీపై వచ్చి అక్కడే పడిపోయాడు. అనిమేశ్ వాహనం ఢీకొనడం వల్లే వృద్ధుడు పడిపోయాడంటూ అతడి సంబంధీకులు వారితో గొడవకు దిగి, తీవ్రంగా కొట్టారు. చుట్టుపక్కల గుమికూడిన జనం ఈ దారుణం చూస్తూ నిలబడ్డారే తప్ప, అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆముగ్గురితోపాటు వృద్ధుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. భుయాన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ప్రజాప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు..
కోడి పందాలు వద్దంటూ సీపీఎం ఆందోళన నరసాపురం అర్బన్ : సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించాలంటూ ధర్నాకు సైతం సిద్ధపడిన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల తీరు సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ విమర్శించారు. జిల్లాలో కోడిపందాలను అరికట్టాలని కోరుతూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక టాక్సీస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. బలరామ్ మాట్లాడుతూ సంక్రాంతి సరదా, సంప్రదాయం పేరుతో ఏటా జిల్లాలోని భీమవరం చుట్టుపక్కల ప్రాం తాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీటిని ప్రజాప్రతినిధులే దగ్గరుండి జరిపిం చడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పుతో ఈ ఏడాదైనా విష సంస్కృతికి ముగింపు దక్కుతుందనుకున్నా ఆశాభంగం తప్పనట్టు ఉందన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు గడుస్తున్నా జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ధ్వజ మెత్తారు. నిట్ లాంటి సంస్థలు పక్క జిల్లాకు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న నాయకులు జూదాల నిర్వహణకు ఉత్సాహం చూపడం హేయన్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి కవురు పెద్దిరాజు మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోడిపందాల కోసం పట్టుపడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు.. అంటూ నాయకులు నినదించారు. పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.త్రిమూర్తులు, ఎం.రామాంజనేయులు, కేతి నీడి వెంకటేశ్వరరావు, పొగాకు నా రాయణరావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ, భూడిద భువనేశ్వరి, పొన్నాడ రాము పాల్గొన్నారు.