రన్నరప్గా పేస్ జోడి
తాష్కెంట్:ఈ సీజన్ లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాలనుకున్న భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ కు నిరాశే ఎదురైంది. తాష్కెంట్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో భాగంగా పురుషుల డబుల్స్ లో పేస్-ఆండ్రీ బెగెమాన్ జంట ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకుంది.
శుక్రవారం జరిగిన తుదిపోరులో పేస్ ద్వయం 4-6, 2-6 తేడాతో ఎల్గిన్-ఇస్టోమిన్ జోడి చేతిలో పరాజయం చెందింది. దాంతో ఈ సీజన్ మూడో ప్రయత్నంలో కూడా టైటిల్ సాధించాలనుకున్న పేస్ కల తీరలేదు. అంతకుముందు విన్సాటాన్-సలేమ్, సెయింట్ పీటర్స్ బర్గ్ ఏటీపీ టోర్నీల్లో కూడా పేస్ జంట ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది.