-
తమిళ విద్యార్థులకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని తప్పుపడుతు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సుప్రీంకోర్టు పిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎ ఎస్ బాంబ్డే, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ పద్దతిలో విద్యార్థులకు మార్కులు ఇవ్వలేమని, ఇరువురు సమావేశమై సమస్యను పరిష్కారించాలని న్యాయస్థానం పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్ఈ తీరును తప్పు పట్టింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సీబీఎస్ఈను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
డ్యాంలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
పూణె : డ్యాంలో మునిగి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. చెన్నైలోని ఈసీఎస్ మెట్రిక్యులేషన్ స్కూల్కు చెందిన 20 మంది విద్యార్థులు నలుగురు టీచర్లతో కలసి సమ్మర్ క్యాంప్లో భాగంగా మహారాష్ట్రలోని ముల్షి తాలూకాకు వచ్చారు. ఉపాధ్యాయులకు తెలియకుండా ముగ్గురు విద్యార్థులు ఈత కొడదామని దగ్గరలో ఉన్న ఓ డ్యాం వద్దకు వెళ్లారు. డ్యాంలోకి దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ విషయం తెలిసి వారితో పాటు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దానిష్ రాజా అనే విద్యార్థి మృతదేహం లభించింది. సంతోష్, సర్వన్న అనే ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుంది. తప్పిపోయిన విద్యార్థులు 13 ఏళ్లలోపు వారే. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీట్గా రాయాల్సిందే!
వైద్య విద్యలో 85 శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు నో ► చివరి ప్రయత్నం విఫలం ► తమిళ విద్యార్థులకు నీట్ తప్పదు నీట్ ప్రవేశపరీక్ష వల్ల తమిళ విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలమైంది. తమిళ సిలబస్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 85 శాతం రిజర్వేషన్కు సుప్రీంనో చెప్పింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ను కొట్టివేసింది. నీట్ ప్రవేశపరీక్షను రాయక తప్పని పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే నీట్ ప్రవేశపరీక్షపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని ప్రజలు, ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు నివేధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా నీట్ నుంచి మినహాయింపు కోరింది. అయితే నీట్ మినహాయింపు విజ్ఞప్తులు పరిశీలనకు కూడా నోచుకోకపోగా షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. నీట్పై మినహాయింపు లభిస్తుందన్న ఆశతో తమిళనాడు విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఈ కారణంగా నీట్ ఫలితాల్లో తమిళనాడు విద్యార్థులు దారుణంగా వెనుకబడిపోయారు. నీట్పై నిరసన తెలుపుతూ తమిళనాడు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గతంలో కొట్టివేసింది. విద్యార్థుల ప్రయత్నం విఫలం కావడంతో నీట్ నుంచి తమిళనాడును మినహాయింపుపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఈ బిల్లు రాష్ట్రపతి కార్యాలయంలో ఇంకా పెండింగ్ దశలో ఉంది. 85 శాతం రిజర్వేషన్: రాష్ట్రపతి ఆమోదానికి ఆలస్యం కావడంతో తమిళనాడు సిలబస్లో ఉత్తీర్ణులైన వారికి వైద్యవిద్యలో 85శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ రిజర్వేషన్ను సీబీఎస్ఈ సిలబస్ విద్యార్థులు వ్యతిరేకిస్తూ, ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. విద్యార్థుల వాదనతో ఏకీవభించిన మద్రాసు హైకోర్టు 85శాతం రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. అప్పీలు పిటిషన్పై ఇరువర్గాల వాదన పూర్తికాగా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. మద్రాసు హైకోర్టు జారీచేసిన 85శాతం రిజర్వేషన్ రద్దు ఆదేశాలపై స్టే విధించేందుకు వీల్లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులందరినీ సమభావనతో చూడాలనే ఉద్దేశంతోనే నీట్ విధానాన్ని ప్రవేశపెట్టారని, అయితే తమిళనాడులో స్టేట్, సెంట్రల్ సిలబస్ పేరిట విద్యార్థులను విభజించి పక్షపాత ధోరణిని చూపడం సమంజసం కాదని వారు హితవుపలికారు. 85శాతం రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు పిటిషన్ను కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు తీర్పుచెప్పారు. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష చెల్లదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. 85శాతం రిజర్వేషన్ చట్టాన్ని శుక్రవారం రద్దు చేసింది. ఇక తమిళనాడు విద్యార్థులకు నీట్ ప్రవేశపరీక్ష తప్పదని భావించాల్సి ఉంటుంది. అయితే నీట్ మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం తమిళనాడులో ఆశలు రేకెత్తిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement