-
మిత్రబంధం!
చెన్నై: టీఎన్సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ రజనీకాంత్ను ఆయన నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరునావుక్కరసు, రజనీకాంత్ల మధ్య మంచి స్నేహబంధం ఉందట. ఇది మిత్రబంధమేనని ఎలాంటి రాజకీయాలకు తావు లేదని తిరునావుక్కరసర్ స్పష్టం చేశారు. -
సోనియా కసరత్తు!
టెన్ జన్పథ్కు నేతలు అధ్యక్ష పదవికి నువ్వా..నేనా ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తులు చేపట్టి ఈనెల ఆరో తేదీలోపు ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం. టెన్ జన్పథ్ నుంచి పిలుపు వస్తుండడంతో క్యూకట్టే పనిలో టీఎన్సీసీ నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక ఢిల్లీకి చేరడంతో ఆ పదవిని ఆశిస్తున్న వాళ్లంత దేశ రాజధానికి పయనమయ్యారు. టీఎన్సీసీ పదవికి ఈవీకేఎస్ ఇలంగోవన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్లో గట్టి పోటీ ఏర్పడింది. ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసర్, ఎమ్మెల్యే, వ్యాపార వేత్త వసంతకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, మాజీ ఎమ్మెల్యే పీటర్ అల్ఫోన్స్లతో పాటు పలువురు రేసులో నిలబడ్డారు. అయితే చివరకు పై నలుగురి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నది. ఈవీకేఎస్ మద్దతు దారులు మాత్రం పీటర్ అల్ఫోన్స్కు పగ్గాలు అప్పగించాలన్న నినాదంతో గురువారం ఢిల్లీకి చేరారు. తొలుత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్తో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం టెన్ జన్పథ్కు ఈవీకేఎస్ మద్దతుదారుడు శివరామన్ నేతృత్వంలో ఇరవై జిల్లాల అధ్యక్షులు చేరుకున్నారు. అక్కడ అధినేత్రి సోనియాగాంధీతో ఈవీకేఎస్ మద్దతు దారులు భేటీ అయ్యారు. ఈవీకేఎస్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలను వివరించారు. సమష్టి నాయకత్వంతో ముందుకు సాగేందుకు ఆయన ప్రయత్నించిరు. కానీ గ్రూపు నేతలు సాగించిన రాజకీయాలను అధినేత్రి సోనియాకు వారు వివరించి వచ్చారు. వీరి భేటీ అనంతరం పీటర్ అల్ఫోన్స్ సోనియాగాంధీతో గంటకు పైగా సమావేశం కావడం గమనార్హం. సాయంత్రం మరో మారు పీటర్ భేటీ కావడంతో అధ్యక్ష పదవి ఆయనకు దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇక, తమకు టెన్ జన్పథ్ నుంచి పిలుపు వస్తుందన్న ఎదురు చూపుల్లో తిరునావుక్కరసర్, వసంతకుమార్, సుదర్శన నాచ్చియప్పన్ ఉన్నారు. వసంతకుమార్, సుదర్శన నాచ్చియప్పన్ చడీ చప్పుడు కాకుండా బుధవారం సోనియా గాంధీని కలిసినట్టు సమాచారం. అయితే, మరో మారు తమకు పిలుపు వస్తుందన్న ఆశతో వారు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక, మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ను సైతం సోనియా గాంధి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. అధ్యక్ష ఎంపిక మీద కసరత్తుల్లో పడ్డ అధినేత్రి, గ్రూపుల నేతలందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేరీతిలో ఆ పదవికి అర్హుడ్ని ఎంపిక చేసేందుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల ఆరో తేదీలోపు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడ్ని నియమించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, సోనియా దృష్టి పీటర్ వైపుగా ఉండగా, రాహుల్ మాత్రం తిరునావుక్కరసర్కు పగ్గాలు అప్పగించే దృష్టితో ఉన్నారని , వీరిలో ఎవర్నీ ఆ పదవి వరిస్తుందో ఆరో తేదీ వరకు వేచి చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
ఇక ప్రైవేటు డ్రైవింగ్ లైసెన్స్లు
ఆలస్యంగా రైళ్ల రాకపోకలు
దేశంలో మొదటి హైడ్రోజన్ నగరంగా విశాఖ
‘అంగన్వాడీ’ జిల్లా అధ్యక్షురాలి మృతికి సంతాపం
వృద్ధుడికి మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
గోడ కూలి వ్యక్తి మృతి
మద్యం మత్తులో డిగ్రీ విద్యార్థి ర్యాష్ డ్రైవింగ్
మండే ఎండ.. జాగ్రత్తలే అండ..
తప్పక చదవండి
Advertisement