breaking news
to take over
-
మృత్యు ఘోష
టిప్పర్ను ఢీకొన్న కేఎస్ ఆర్టీసీ బస్సు 14 మంది మృతి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిబంధనలు అతిక్రమించి ఓవర్టెక్కు యత్నం ముళబాగలు : ఏడు కొండల వాడి దర్శనానికి కొందరు, సొంత ఊర్లకు మరి కొందరు...ఇలా ప్రయాణమైన వారిలో 14 మంది అసువులు బాశారు. కోలారు జిల్లా ముళబాగలు తాలూకా శ్రీరంగపుర గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుమకూరు డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి మొత్తం 31 మందితో బయలుదేరింది. ముళబాగలు వద్ద ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఓ వైపు రోడ్డు పనులు జరుగుతుండగా, మరో మార్గంలో అటు, ఇటు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ, ముందుగా పోతున్న ఇసుక టిప్పర్ను ఓవర్ టేక్ చేయబోయింది. అయితే కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇరుకైన రోడ్డులో బస్సు కుడి భాగం టిప్పర్ను వేగంగా రాసుకుంటూ పోయింది. దీంతో ఆ భాగమంతా చీల్చుకుపోయింది. అటు వైపు కూర్చున్న వారిలో ఐదుగురు మహిళలు, ఓ పదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని కోలారులోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం ఐదుగురు మరణించారు. బస్సు తుమకూరు డిపోదైనప్పటికీ, ఆ పట్టణానికి చెందిన వారెవరూ అందులో లేరు. బెంగళూరులో తిరుపతికి 15 మంది, చిత్తూరుకు ఆరుగురు, పలమనేరుకు నలుగురు టికెట్లు తీసుకున్నారని కండక్టర్ నరసింహమూర్తి తెలిపారు. స్వల్ప గాయాలతో అతను ముళబాగలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరులోని హెబ్బాళకు చెందిన సోమశేఖర్, భార్య, మనవడితో కలసి ప్రయాణించారు. తన భర్తకు ఏమైందో తెలియడం లేదని, తన మనవడు మాత్రం ఒకసారి ఫోనులో మాట్లాడాడని గృహిణి చెప్పారు. బస్సులో ఇంకా గౌరిబిదనూరుకు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యచారి, పలమనేరుకు చెందిన అమల ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మృతులు కోలారుకు చెందిన నాగేశ్ (35), బెంగళూరులోని కోడిహళ్లికి చెందిన నాగమణి (50), బెంగళూరుకు చెందిన నారాయణమ్మ, భారతి బ్రహ్మచారి (35), పలమనేరుకు చెందిన రాజశేఖర్ (35), లిఖిత్ కుమార్ (3), తుమకూరుకు చెందిన డ్రైవర్ గంగాధరయ్య (50), ముళబాగలుకు చెందిన విజయమ్మ (55) మృతుల్లో ఉన్నారు. ఇంకా ఐదు మృత దేహాలను గుర్తించాల్సి ఉంది. -
ట్రాక్టర్ డ్రైవర్ వెకిలి చేష్టతో ముగ్గురి బలి
మృతుల్లో తల్లీకూతురు, మూడేళ్ల బాలుడు మరో ట్రాక్టర్ ఢీకొనడంతో బోల్తాపడిన కంకరలోడు ట్రాక్టర్ నెల్లికుదురు, న్యూస్లైన్ : బస్సు కోసం చూస్తుండగా తెలిసిన వ్యక్తికి చెందిన కంకర ట్రాక్టర్ రావడంతో బంధువులంతా కలిసి అందులో ఎక్కారు. పావు గంటయితే వారంతా క్షేమంగా ఇంటికి చేరేవారు. ఈ లోపే మృత్యువు రూపంలో మరో ట్రాక్టర్ వెనకాలే వచ్చింది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ కల్లు తాగిన మత్తులో ఓవర్టేక్ చేస్తూ పక్క నుంచి తాకించడంతో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. కంకర మీదపడడంతో తల్లీ,కూతురితోపాటు మరో బాలుడు మృతిచెందగా, నలుగురు తీవ్రం గా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని నర్సింహులగూడెం గ్రామ శివారు సంధ్య తండా సమీపంలో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం సింగారం గ్రామానికి చెందిన మందుల శ్రీను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇదే మండలంలోని వావిలాల గ్రామంలోని తన అత్తగారింట్లో శుక్రవారం జరిగిన ఉప్పలమ్మ పండుగకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హాజరయ్యూడు. శనివారం ఉదయం తిరుగు ప్రయాణమై నెల్లికుదురు - మహబూబాబాద్ ప్రధాన రహదారిలోని వావిలాల స్టేజీ వద్దకు చేరుకున్నారు. వారు బస్సు కోసం ఎదురు చూస్తుండగా శ్రీనుకు సింగారానికి చెందిన ట్రాక్టర్ యజమాని ఫోన్ చేశాడు. తాను మహబూబాబాద్లో కంకర లోడ్ చేసుకుని సింగారానికి బయల్దేరానని చెప్పాడు. దీంతో వారు బస్సు ఎక్కకుండా ఆగి కంకర ట్రాక్టర్ ఎక్కారు. అదే సమయంలో మండలంలోని ఓ గ్రామంలో జరిగిన పెళ్లికి హాజరై తాళ్లలో కల్లు తాగిన పది మంది మరో ట్రాక్టర్లో తిరుగుపయనమయ్యారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనుకు తెలిసిన వ్యక్తి కావడంతో ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. కల్లు తాగిన మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్తోపాటు అందులో ఉన్న వ్యక్తులు జోకులు వేసుకుంటూ, గట్టిగా కేకలు వేస్తూ కంకర ట్రాక్టర్ వెనకాలే వెళ్లారు. అతడు నర్సింహులగూడెం శివారు సంధ్యతండా సమీపంలోకి రాగానే కంకర ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోతూ తన ట్రాక్టర్తో తాకించాడు. దీంతో కంకర ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మందుల శ్రీను, అతడి భార్య లలిత(35), కూతురు అనూష(15), కుమారుడు ఉదయ్, మునిగలవీడు గ్రామానికి చెందిన బంధువులు ఎల్తూరి అశ్విని, ఎల్తూరి నరేష్, అతడి భార్య నిర్మల, కుమారుడు ప్రవీన్(3) మరికొందరు కిందపడగా వారిపై కంకర పడింది. చుట్టుపక్కలవారు గమనించి కంకరను తోడి అందరినీ బయటకు తీశారు. అరుుతే అప్పటికే కంకర మీదపడి ఊపిరాడక లలిత, ఆమె కూతురు అనూష, ఎల్తూరి నరే ష్ మృతిచెందగా శ్రీను, ఉదయ్, అశ్విని, నిర్మల తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్సై బి.చేరాలు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో మానుకోట ఏరియూ ఆస్పత్రికి తరలించారు. సంఘటనస్థలాన్ని మహబూబాబాద్ డీఎస్పీ శోభన్ కుమార్, తొర్రూరు సీఐ సార్ల రాజు సందర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను వదిలేసి డ్రైవర్, అందులో ప్రయూణిస్తున్నవారు పరారయ్యూరు. నలుగురు సంతానాన్ని కోల్పోయిన దంపతులు.. వావిలాలకు గుండెపాక లింగయ్య, అమ్మక్క దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కూతురు జన్మించారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఒక కుమారుడు, పురుగుల మందు తాగి మరో ఇద్దరు కుమారులు ఆత్మహత్యకు పాల్పడగా, వారు చేసుకున్న ఉప్పలమ్మ పండుగకు వచ్చి వెళుతూ మిగిలిన కూతురు లలిత కూడా మృతి చెందడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యూరు.