breaking news
t devender goud
-
చేయి కలుపుదాం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయి క్లియరెన్స్ ఇచ్చారు. శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశాల్లో కాంగ్రెస్తో కలసి వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించిన బాబు.. ఆదివారం తన నివాసంలో జరిగిన సమావేశంలో పొత్తుపై మరింత స్పష్టతనిచ్చారు. ‘కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోండి. ఆ దిశగా చర్చలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోండి. మీరు ముందుకెళ్లండి. నేనున్నాను..’అని టీటీడీపీ చీఫ్ ఎల్.రమణతో పాటు ఇతర ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలను కలుపుకొని పోయే విషయంలో చొరవ తీసుకుని వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం రావడంతో ఎల్.రమణ కూడా వేగంగా పావులు కదిపారు. వెంటనే కాంగ్రెస్, సీపీఐ, జనసమితి నేతలకు ఫోన్లు చేసి కలసి వెళ్లడం కోసం మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించడం గమనార్హం. కాగా పార్టీ సమావేశంలో భాగంగా ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన జాబితాకు కూడా బాబు ఆమోదం తెలిపారు. పార్టీ మేనిఫెస్టో తయారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ టి.దేవేందర్గౌడ్కు అప్పగించారు. - ఎన్నికల సమన్వయ కమిటీ: ఎల్.రమణ, టి.దేవేందర్గౌడ్, రావుల చంద్రశేఖర్రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు - మేనిఫెస్టో కమిటీ: టి.దేవేందర్గౌడ్ (చైర్మన్), రావుల చంద్రశేఖర్రెడ్డి, బక్కని నర్సింహులు, అలీ మస్కతి, బండ్రు శోభారాణి - ప్రచార కమిటీ: గరికపాటి మోహన్రావు, సండ్ర వెంకటవీరయ్య, కొత్తకోట దయాకర్రెడ్డి, అరవింద్కుమార్గౌడ్, రమావత్ లక్ష్మణ్నాయక్ టీడీపీ–సీపీఐ పొత్తు ఖరారు వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయాలని తెలుగుదేశం, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఇరు పార్టీల నేతలు ఎన్టీఆర్ భవన్లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి ఆహ్వానించడంతో సీపీఐ నేతలు భవన్కు వచ్చి చర్చలు జరిపారు. భేటీ అనంతరం కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. అందరితో మాట్లాడదాం: రమణ రమణతో పాటు పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, అమరనాథ్బాబు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పార్టీ నేత పల్లా వెంకటరెడ్డి ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. గంట పాటు జరిగిన చర్చలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. తమతో పాటు కాంగ్రెస్, ఇతర భావసారూçప్య పార్టీలను కలుపుకుని పోయేలా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ చర్చించడానికి బదులు అన్ని పార్టీలను పొత్తుకు ఒప్పించాలని.. ఆ తర్వాత సీట్లు, సర్దుబాట్లపై చర్చించాలని అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ను గద్దె దింపుతాం: రమణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ను గద్దె దింపుతామని రమణ అన్నారు. కేసీఆర్కు రాజకీయ, నైతిక విలువల్లేవని విమర్శించారు. ఆయన కు సభలపై ఉన్న దృష్టి రైతులపై లేదన్నారు. రానున్న రోజుల్లో మహాకూటమి రాష్ట్రలో జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేడు, రేపు ఇతర పార్టీలతో కూడా చర్చిస్తామని.. కాంగ్రెస్కు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. గెలిచే స్థానాలే అడుగుతాం: చాడ కలసి వచ్చే అన్ని పార్టీలతో చర్చిస్తామని, మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్కు అధికారమే తప్ప రైతుల మీద ఆసక్తి లేదని విమర్శించారు. పోటీ చేయాల్సిన స్థానాలు ముఖ్యం కాదని, పోటీ చేసిన చోట గెలవాలని, చర్చల్లో గెలిచే స్థానాలే అడుగుతామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. నేడు కాంగ్రెస్తో చర్చలు! సోమవారం ఉదయం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో టీడీపీ నేతలు సమావేశ మయ్యే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్, టీడీపీల మధ్య చర్చలు జరిగే అవకాశముంది. బంద్ నేపథ్యంలో ఒకవేళ సోమవారం చర్చలకు వీలు కాకపోతే మంగళవారం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
విలీనం వెనుక రహస్య ఎజెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీహెచ్ఎం సీలో గ్రామ పంచాయతీల విలీనం వెనుక రహస్య ఎజెండా దాగిఉందని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆగమేఘాల మీద రాత్రికిరాత్రే శివారు పంచాయతీలను గ్రేటర్ లో కలపడానికి బలమైన కారణాలున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర విభజన తరుణంలో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేలా ఆదృశ్యశక్తులు పావులు కదిపాయన్నారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి అధ్యక్షతన టీడీపీ అత్యవసర సమావేశం జరిగింది.దేవేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆదాయాన్ని ఉమ్మడిగా పంచుకునే కుట్రలో భాగంగానే నగర పరిధిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆదాయ వనరులు దండిగా ఉన్న పంచాయతీలను కలపడం ద్వారా ఆస్తులను పరిరక్షించుకోవడమే కాకుండా... రెవెన్యూలోను అధికవాటాను కొల్లగొట్టొచ్చని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్లు ఆరోపించారు. జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల విలీనాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్లో అంతర్భాగమైన శివారు మున్సిపాలిటీల్లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప.. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని అన్నారు. గ్రేటర్తో గ్రామీణ ప్రజలకు పన్ను ల భారం తప్ప ఒరిగేదేమీలేదని పేర్కొన్నా రు. విలీనం సరికాదని, అవసరమైతే మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చాలని కోరినప్పటికీ సీఎం ఏకపక్షంగా విలీన ఉత్తర్వులు జారీ చేయడం దురదృష్టకర మన్నారు. జిల్లా ఉనికిని కాపాడుకునేందు కు రాజకీయాలకతీతంగా జిల్లా నేతలు కలిసిరావాలని దేవేందర్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామని, 19న ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి సహా పలువురు నేతలు నిరవధిక దీక్ష చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ హెచ్ ఎండీఏ, ఏపీఐఐసీలు అడ్డగోలు వ్యవహారాలతో జిల్లా ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. సంపన్న వర్గాలకు కొమ్ముకాసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నా జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల ను పరిగణనలోకి తీసుకోకుండా విలీన ప్రక్రి య చేపట్టిన అధికార పార్టీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే రత్నం పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ , ఎమ్మెల్సీ నరేందర్రెడ్డితో పాటు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఇతర నేతలు పాల్గొన్నారు.