breaking news
Syed Mushtaq Ali domestic T20 cricket tournament
-
SMAT: సూపర్ లీగ్కు హైదరాబాద్, ఆంధ్ర జట్లు
దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్లలో ఓడినా... ఈ రెండు టీమ్లు ముందంజ వేయడంలో సఫలమయ్యాయి. గ్రూప్ ‘బి’లో ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్ మొత్తం 20 పాయింట్లతో అగ్ర స్థానం సాధించగా, గ్రూప్ ‘ఎ’లో ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి, 2 ఓడిన ఆంధ్ర 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యాయి.సోమవారం జరిగిన చివరి లీగ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అమన్ రావు (33; 2 ఫోర్లు, 2 సిక్స్లు), తనయ్ త్యాగరాజన్ (27; 2 సిక్స్లు) రాణించారు. అనంతరం చండీగఢ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. సత్యనారాయణ రాజుకు 4 వికెట్లువిదర్భతో లక్నోలో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 19 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా విదర్భ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమన్ మోఖడే (35 బంతుల్లో 50; 7 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (41; 2 సిక్స్లు) రాణించగా... ఆంధ్ర బౌలర్ సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. పైలా అవినాశ్ (44; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రికీ భుయ్ (26; 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. యశ్ ఠాకూర్ 4 వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. పుణేలో ‘సూపర్ లీగ్’ మ్యాచ్లుటోరీ్నలో భాగంగా ‘సూపర్ లీగ్’ దశకు చేరిన 8 జట్లను 2 గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్లతో ఆంధ్ర తలపడనుండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, రాజస్తాన్, హరియాణాలతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్లు వరుసగా ఈ నెల 12, 14, 16 తేదీల్లో జరుగుతాయి. రెండు గ్రూప్ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 18న ఫైనల్లో తలపడతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్లు పుణేలో నిర్వహిస్తారు.చదవండి: SMAT 2025: సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం -
యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఓ యువ సంచలనం అద్భుత ప్రదర్శలనతో అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీపై అతడు ఇన్నింగ్స్ అభిమానులను, టాలెంట్ స్కౌట్స్ను సైతం ఆశ్చర్యపరిచింది.ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా అతడిది. తన విధ్వంసకర బ్యాటింగ్తో దేశవాళీ క్రికెట్లో నయా ఫినిషర్గా పేరు గాంచాడు. అతడే రాజస్తాన్ పవర్ హిట్టర్ 21 ఏళ్ల ముకుల్ చౌదరి.ఢిల్లీపై అద్బుతం.. ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్లోని ఝుంఝునుకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఫస్ట్ క్లాస్, సీనియర్ టీ20 క్రికెట్ మ్యాచ్లు ఇప్పటివరకు పెద్దగా ఆడకపోయినప్పటికి.. అండర్-23 టోర్నీల్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఢిల్లీపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 176 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయం అని భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ముకల్ అద్భుతం చేశాడు.ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగి తన జట్టును ఒంటి చేత్తే గెలిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 1 ఫోర్లు, 7 సిక్స్లతో 62 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముకుల్ 2023లో రాజస్తాన్ సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. కానీ అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు ఇప్పటివరకు మూడేసి చొప్పున ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్లు ఆడాడు.లీడింగ్ రన్ స్కోరర్గా..ముకుల్ ఇటీవల ముగిసిన అండర్ 23 వన్డే టోర్నమెంట్లో రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 147గా ఉంది. అదేవిధంగా టోర్నమెంట్లో అత్యధికంగా 34 సిక్సర్లు బాదాడు. ఈ ప్రదర్శనలతో సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని అతడు ఆకర్షించాడు. దీంతో దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడే అవకాశం చౌదరికి లభించింది.ఈసారి మాత్రం తన వచ్చిన అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. పేస్, స్పిన్ రెండింటినీ అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అంతేకాకుండా అతడి షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది.ముంబై కన్ను..కాగా ఈ యువ సంచలనంపై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. నవంబర్ ఆఖరి వారంలో అతడు ముంబై నిర్వహించిన ట్రయల్స్కు హాజరైనట్లు సమాచారం. రియాన్ రికెల్టన్కు బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్గా ముకుల్ను తీసుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు టాలెంట్ స్కౌట్స్ కూడా అతడి బ్యాటింగ్ వీడియోలను పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టోక్స్ -
హార్దిక్ పాండ్యా విధ్వంసం..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దుమ్ములేపాడు.ఆసియాకప్-2025లో గాయపడిన తర్వాత పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తన పునరాగమనంలో పాండ్యా బంతితో రాణించలేకపోయినప్పటికి బ్యాట్తో మాత్రం విధ్వంసం సృష్టించాడు. 225పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను హార్దిక్ ఉతికారేశాడు.తన ఇన్నింగ్స్ను నెమ్మదిగా మొదలపెట్టినప్పటికి.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 183.33గా ఉంది. అతడితో పాటు విష్ణు సోలంకి(43), శివాలిక్ శర్మ(47) మెరుపులు మెరిపించారు.225 పరుగుల లక్ష్యాన్ని బరోడా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్లో హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ టీ20 సిరీస్కు ముందు హార్దిక్ మరో రెండు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లు ఆడనున్నాడు.చదవండి: IND vs SA: అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?Hardik Pandya is back with a bang. smashed 77 not out and won the game for Baroda against Punjab.#SMAT2025 #HardikPandya pic.twitter.com/KmmVpawkgQ— The last dance (@26lastdance) December 2, 2025 -
ముంబై కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఆడనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ టోర్నీలో ఆడాలని సూర్యకుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ టీ20 టోర్నమెంట్లో ముంబై జట్టును సూర్య ముందుండి నడిపించనున్నాడు. వాస్తవానికి ముంబై కెప్టెన్గా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించాల్సి ఉండేది. కానీ అయ్యర్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. అతడి స్దానంలోనే సూర్య ముంబై పగ్గాలను చేపట్టనున్నాడు. అయితే ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అన్ని మ్యాచ్లకు సూర్య అందుబాటులో ఉండకపోవచ్చు.ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి సూర్య సారథ్యంలోని భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ టీ20 సిరీస్ డిసెంబర్ 19తో ముగియనుంది. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనుంది.మరోవైపు స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే మాత్రం ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందుబాటులో ఉండనని ముంబై క్రికెట్ అసోయేషిన్కు తెలియజేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో మాత్రం ముంబై జట్టు సారథిగా శార్ధూల్ ఠాకూర్ వ్యహరిస్తున్నాడు.చదవండి: IND vs SA: 'నీ ఈగోను పక్కన పెట్టు'.. టీమిండియా ఓపెనర్కు వార్నింగ్ -
మరో సుడిగాలి శతకం బాదిన ఉర్విల్ పటేల్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉత్తరాఖండ్తో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 36 బంతుల్లో శతకొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక స్కోర్.టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఉర్విల్ గత నెలాఖరులో త్రిపురతో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది వేగవంతమైన సెంచరీ. ఓవరాల్గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన శతకం.టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ..భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. సమర్థ్ (54), ఆధిత్య తారే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జేస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు.183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆర్య దేశాయ్ (23), అక్షర్ పటేల్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్రస్తుత ఎడిషన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో) వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. -
ఒకే జట్టులో 11 మందితో బౌలింగ్.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఒకే మ్యాచ్లో జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఫీట్కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 వేదికైంది.ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే స్టేడియంలో మణిపూర్తో జరిగిన జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని జట్టులో ప్రతీ ఒక్కరితో బౌలింగ్ చేయించాడు. ఆఖరికి వికెట్ కీపర్గా ఉన్న బదోని సైతం ఈ మ్యాచ్లో బౌలింగ్ చేశాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం 11 మంది బౌలర్లను ఉపయోగించిన తొలి జట్టుగా ఢిల్లీ రికార్డులకెక్కింది. టీ20ల్లోఒకే ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు అత్యధికంగా 9 మంది మాత్రమే బౌలింగ్ చేశారు. ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, ఆర్సీబీ జట్లు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాయి. తాజా మ్యాచ్తో ఈ అల్టైమ్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది.కాగా ఢిల్లీ జట్టుకు సంబంధించి స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఢిల్లీ బౌలర్లు ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, ఆయుష్ బదోని రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా.. . హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ తలా మూడు ఓవర్లు బౌలింగ్ చేశారు. వీరితో పాటు ఆర్యన్ రానా, హిమ్మంత్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, యశ్ దుల్, రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశారు. త్యాగీ, దిగ్వేష్ తలా రెండు వికెట్లు సాధించగా.. బదోని, అయూష్ సింగ్, ప్రియాన్షూ ఆర్య చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
తిలక్ వర్మ మెరిసినా...
రాజ్కోట్: కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకున్నా... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత మ్యాచ్లో మేఘాలయ జట్టుపై ఘనవిజయం సాధించిన హైదరాబాద్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో బెంగాల్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. టి20ల్లో వరుసగా మూడు శతకాలు బాది రికార్డుల్లోకెక్కిన తిలక్ వర్మ అదే ఫామ్ కొనసాగిస్తూ హాఫ్సెంచరీతో విజృంభించగా... రాహుల్ బుద్ధి (30; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. తన్మయ్ అగర్వాల్ (6) రాహుల్ సింగ్ (10), మికిల్ జైస్వాల్ (12), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (3), సీవీ మిలింద్ (0) విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 3... షహబాజ్, కరణ్ లాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగాల్ జట్టు 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. అభిõÙక్ పొరెల్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్లాల్ (46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. తదుపరి మ్యాచ్లో బుధవారం రాజస్తాన్తో హైదరాబాద్ తలపడనుంది. బెంగాల్ చేతిలో హైదరాబాద్ ఓటమి -
తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన హైదరాబాద్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఈ టోర్నీ గ్రూపు-ఏలో భాగంగా రాజస్తాన్ వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. మేఘాలయ బ్యాటర్లలో లారీ సంగ్మా(46) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3వికెట్లు పడగొట్టగా.. మిలాంద్, అంకిత్ రెడ్డి తలా వికెట్ సాధించారు. అదరగొట్టిన తన్మయ్, తిలక్ వర్మ.. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. హైదరాబాద్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్(46 నాటౌట్), కెప్టెన్ తిలక్ వర్మ(31 బంతుత్లో 41 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశారు. తిలక్ వర్మ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. తొలిసారి హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహిస్తున్నాడు. కాగా తిలక్ వర్మ భారత సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మిచెల్ స్టార్క్ క్రీడా స్పూర్తి.. రనౌట్ చేసే అవకాశమున్నా! వీడియో వైరల్ -
Asian Games: బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక దేశవాళీ టీ20 టోర్నీలోనూ..
BCCI- Asian Games 2023: ముంబై: ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనడం ఖాయమైంది. శుక్రవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. చైనాలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. అయితే ఈ పోటీల్లో మహిళల విభాగంలో మాత్రమే భారత రెగ్యులర్, పూర్తి స్థాయి జట్టు బరిలోకి దిగుతోంది. పురుషుల విభాగంలో మాత్రం ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 5 నుంచి భారత్లోనే వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటమే దీనికి కారణం. అదే విధంగా.. ఐపీఎల్–2023 సీజన్లో కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతా లో రెండో విజయం చేరింది. జార్ఖండ్ జట్టుతో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు చీపురపల్లి స్టీఫెన్ (3/23), హరిశంకర్ రెడ్డి (3/24) రాణించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపో యింది. చివరి ఓవర్లో జార్ఖండ్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఐదు వికెట్లున్నాయి. అయితే జార్ఖండ్ ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు (రెండు వికెట్లు స్టీఫెన్, రెండు రనౌట్లు) కోల్పోయింది. ఆఖరి ఓవర్ వేసిన ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి జార్ఖండ్ను కట్టడి చేశాడు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు క్యాచ్లు తీసుకోవడంతోపాటు ఒక రనౌట్లో పాలుపంచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బార్ (45; 6 ఫోర్లు), శ్రీకర్ భరత్ (48; 5 ఫోర్లు), రికీ భుయ్ (15 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకట్టుకున్నారు. -
ముంబై గెలుపు
కటక్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ముంబై కీలక విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను మెరుగుపర్చుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ముంబై 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మహారాష్ట్ర 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య తారే (39 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించాడు.


