breaking news
Sybil credit score
-
CIBIL Score: సిబిల్ గుబులు!
నేడు ప్రతి చిన్న వస్తువు కొనుగోలూ ఈఎంఐ విధానంలోనే చెల్లింపుల్లో జాప్యంతో సిబిల్ స్కోర్కు దెబ్బ భవిష్యత్లో ఇతర రుణాలు తీసుకోలేని పరిస్థితి ఆలస్య రుసుములు, వాటిపైన పన్నుల బాదుడు సరేసరి ఆయా కంపెనీల ప్రకటనల వలలో చిక్కుకుంటున్న ప్రజలునియంత్రణ అవసరమంటున్న నిపుణులు విజయవాడకు చెందిన గౌస్ మొహియుద్దీన్ ఐదు నెలల క్రితం టీవీ కొన్నారు. గత నెలలో ఈఎంఐ కట్టాల్సిన సొమ్ము కంటే రూ.10 బ్యాంకులో తక్కువగా ఉండటంతో రూ.580 ఆలస్య రుసుము పడటమే కాకుండా సిబిల్ స్కోర్ భారీగా తగ్గింది.రమేశ్ నాయుడు అనే డిగ్రీ విద్యార్థి ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి శాంసంగ్ మొబైల్ కొన్నాడు. నాలుగో నెలలో ఈఎంఐ చెల్లించకపోవడంతో మొబైల్ను బ్లాక్ చేశారు. తిరిగి దీన్ని పనిచేయించేందుకు ఈఎంఐ కట్టడంతో పాటు రూ.600 ఆలస్య రుసుం చెల్లించాడు. అతడు ఇప్పుడు ద్విచక్రవాహనం కొనడానికి వెళ్తే.. ‘సిబిల్ స్కోర్ పడిపోయింది.. రుణం ఇవ్వలేం’ అని చెప్పారు... ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సిబిల్ స్కోర్ సరిగా లేక వాహన, వ్యక్తిగత, గృహ రుణాలను పొందలేకపోతున్నారు. చెక్ బౌన్స్ అయితే భారీగా సిబిల్ స్కోర్ పడిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏ రుణం తీసుకున్నా సకాలంలో చెల్లించాలంటున్నారు. ఆయా రుణ సంస్థలు, బ్యాంకులు నిర్దేశించిన తేదీల్లోగా చెల్లింపులు చేయాలంటున్నారు. ఇలా చేస్తేనే చక్కటి సిబిల్ స్కోర్ సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. సిబిల్ సరిగా లేకపోతే ఏ రుణం కూడా మంజూరు కాదని చెబుతున్నారు. సిబిల్ లెక్కలివి.. సగటున ఉండాల్సిన కనీస స్కోర్ 650ఏదైనా రుణం రావాలంటే కనీసం ఉండాల్సిన స్కోర్ 600గృహరుణం కావాలంటే ఉండాల్సిన స్కోర్ 700కు పైనఈఎంఐల్లోనే ఎక్కువ..ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ నెలసరి వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానంలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వివిధ బ్యాంకులతోపాటు ప్రైవేటు ఆర్థిక సంస్థలు సైతం క్రెడిట్ (సిబిల్) స్కోర్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో చాలా మంది ఈఎంఐ విధానంలో వస్తువులను కొంటున్నారు. అయితే నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోవడం, అందుకు తగ్గట్టుగా బ్యాంకులో నగదు నిల్వ ఉంచకపోవడంతో బౌన్సుల బారినపడుతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుం, దానిపైన ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఫోన్లలో ఆయా రుణ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. నియంత్రించుకోకుంటే కష్టం.. ఇప్పుడు చాలా సులువుగా ఆన్లైన్లోనూ, వివిధ యాప్స్ ద్వారా రుణాలు లభిస్తున్నాయి. కేవలం పాన్ కార్డు నంబర్ను సంబంధిత వెబ్సైట్ లేదా యాప్లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ మాల్స్, షాపుల్లోనూ పాన్ కార్డు నంబర్ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆసక్తితో రుణాల ద్వారా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ‘జీరో వడ్డీ’, ‘ప్రాసెసింగ్ ఫీజు లేదు’ అంటూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే ప్రకటనల వలలో పడుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇలా ఆయా ప్రకటనలకు ఆకర్షితులై రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో భారీగా ఆలస్య రుసుం, ఇతర జరిమానాలు తప్పడం లేదు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా పడిపోతోంది. తద్వారా భవిష్యత్తులో రుణాలు పొందలేని పరిస్థితి తలెత్తుతోంది.పదిశాతం మందికి పైగా డిఫాల్టర్లే..రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నవారిలో మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు చెబుతున్నాయి. సాధారణంగా సిబిల్ స్కోర్ 650 దాటితేనే ఏ రుణమైనా లభిస్తుంది. అయితే రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత తేదీల్లోగా చెల్లించకపోవడంతో ప్రతి పదిమందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేస్తున్న వారిలో రుణాల రికవరీ అత్యంత తక్కువగా ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు గుర్తించాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో డిఫాల్టర్లు 14 శాతంగా ఉన్నారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. జరిమానాలు ఎక్కువగా పడటం, చెక్ బౌన్స్ కేసులు నమోదు కావడం, ఈఎంఐల చెల్లింపుల్లో జాప్యం వంటివన్నీ అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ మూడు చోట్లా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా తగ్గినట్టు తేలింది. ఈ మూడు నగరాలు కాకుండా మిగతా జిల్లాల్లో సగటున 10 శాతం డిఫాల్టర్లు ఉంటున్నారు.సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ బాగుంటుంది.. ప్రస్తుతం సిబిల్ స్కోర్ చాలా కీలకమైంది. సిబిల్కు ఆయా ఫైనాన్స్ సంస్థలు చిన్న చిన్న అప్పుల సమాచారాన్ని కూడా ఇస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు కారణంగా మా దగ్గరకు వచ్చే చాలామందికి సిబిల్ స్కోర్ లేక రుణాలు ఇవ్వడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ స్కోర్ బాగుంటుంది. లేదంటే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – సునీల్ కుమార్, మేనేజర్, ఎస్బీఐ -
రుణ గ్రహీతల్లో... మూడోవంతు మహిళలే
ముంబై: మహిళలు రుణాలను ఆశ్రయించే పరిస్థితి పెరుగుతోంది. రిటైల్ రుణాలు తీసుకుంటున్న వారిలో మహిళల శాతం 2020 సెప్టెంబర్ నాటికి 28 శాతానికి చేరినట్టు ట్రాన్స్యూనియన్ సిబిల్ సంస్థ వెల్లడించింది. రుణాలు తీసుకుంటున్న మహిళల శాతం 2014 నుంచి 21 శాతం మేర పెరిగినట్టు వివరించింది. 2014 నాటికి రుణాలు తీసుకునే మహిళలు 23 శాతంగానే ఉన్నారని పేర్కొంది. కానీ ఇదే కాలంలో రుణాలను ఆశ్రయించిన పురుషులు 16 శాతమే పెరిగారని.. మొత్తం మీద పురుషులతో పోలిస్తే మహిళలే ఈ కాలంలో ఎక్కువగా రుణ బాట పట్టారని.. రుణ మార్కెట్లో మహిళా రుణ గ్రహీతల సంఖ్య 4.7 కోట్లకు చేరుకుందని సిబిల్ నివేదిక తెలియజేసింది. ‘‘రిటైల్ రుణాల్లో రూ.15.1 లక్షల కోట్లు నేడు మహిళలు తీసుకున్నవే. గత ఆరేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున పెరిగింది’’ అని వివరించింది. ‘‘కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తోడు, ఆర్థిక అవకాశాలను సొంతం చేసుకునే దిశగా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి’’ అని సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఇళ్ల కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడం, మహిళలకు ప్రోత్సాహకంగా కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం కూడా దీనికి తోడ్పడినట్టు చెప్పారు. -
చిన్న వ్యాపారాల నుంచి రూ. 2.32 లక్షల కోట్ల డిఫాల్ట్ల ముప్పు: సిబిల్
ముంబై: కోవిడ్–19 ప్రభావంతో చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.2.32 లక్షల కోట్లు డిఫాల్ట్ అయ్యే తీవ్ర పరిస్థితి నెలకొందని సిబిల్ పేర్కొంది. ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు రుణం ఉన్న లఘు పరిశ్రమలు తీవ్రంగా కరోనా ప్రభావానికి గురవుతాయని బుధవారంనాడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ పేర్కొంది. రూ.10 లక్షల లోపు రుణం ఉన్న చిన్న సంస్థల మొత్తం రుణ పరిమాణం దాదాపు రూ.93,000 కోట్లయితే, ఇందులో రూ.13,600 కోట్లు మొండిబకాయిల ఖాతాలోకి వెళ్లొచ్చని అంచనావేసింది. చిన్న పరిశ్రమలను ఆదుకోవాలి.. ఐబీఏ: కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని కేంద్రం, ఆర్బీఐలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ రంగానికి సంబంధించి రుణ బకాయిల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వన్టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్ వంటి కొన్ని కీలక సిఫారసులు ఐబీఏ జాబితాలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుసహా పలు పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐబీఏ కీలక సిఫారసులు చేసింది. -
విద్యా రుణం తీర్చకపోయినా.. మైనస్ స్కోర్: సిబిల్
కొచ్చి : తీసుకున్న విద్యా రుణం తిరిగి తీర్చకపోయినా... అది సిబిల్ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్-కన్జూమర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ హర్షాలా చందోర్కర్ స్పష్టం చేశారు. విద్యారుణం తీసుకున్న ఒక వ్యక్తి తన కోర్సును పూర్తిచేసిన నిర్దిష్ట సమయం తర్వాత రుణ బకాయి చెల్లించాల్సి ఉంటుంది. లేదా సంబంధిత వ్యక్తికి హామీ ఉన్న వ్యక్తి అయినా నెలవారీ చెల్లింపులు జరపాలి. పెరుగుతున్న విద్యా రుణ బకాయిలు... ఈ రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్ సమస్య ఉండదని కొందరు భావిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో చందోర్కర్ ఈ విషయం చెప్పారు. రుణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తికి బ్యాంకులు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్ను ప్రమాణంగా తీసుకుంటాయి. విద్యా రుణానికి సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే.. సిబిల్ డేటా ప్రకారం దేశంలో, విదేశాల్లో విద్యకు సంబంధించి మొత్తం రుణాల విలువ 2015 మార్చి 31 నాటికి రూ.63,800 కోట్ల మూడు, నాలుగు త్రైమాసికాల్లో విద్యా రుణాలకు అత్యధికంగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. 2014 నాల్గవ త్రైమాసికంలో 1,30,000 విద్యా రుణ దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రస్తుతం సగటు రుణం రూ.6 లక్షలకు చేరింది.మొత్తం మంజూరులో రూ.1 లక్ష లోపు రుణాలు 10 శాతంకన్నా తక్కువ ఉండగా... రూ.5 లక్షలు దాటిన రుణాల సంఖ్య 30 శాతంపైనే.