breaking news
Swiss Bank UBS
-
దూసుకెళ్తున్న భారత్.. భారీగా పెరిగిన బిలియనీర్లు
భారతదేశం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంపద సృష్టికి హాట్స్పాట్గా ఉద్భవించింది. పదేళ్లలో ఇండియాలోని బిలియనీర్ల నికర విలువ దాదాపు మూడు రేట్లు పెరిగి 905.6 బిలియన్లకు చేరింది. దీంతో భారత్ ఇప్పుడు మొత్తం బిలియనీర్ సంపదలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచినట్లు స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్గా పేరుపొందిన 'యూబీఎస్' నివేదికలో వెల్లడించింది.యూబీఎస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలోకి కొత్తగా 32 మంది చేరారు. దీంతో 153 మంది నుంచి బిలియనీర్ల సంఖ్య 185కు చేరింది. వీరి మొత్తం నికర విలువ ఒక్కసారిగా (905.6 బిలియన్స్) పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.76 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా 2024లో బిలియనీర్ల సంఖ్య 2682కు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 2,544గా ఉంది. నికర విలువ కూడా ఈ ఏడాది 12 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 751 నుంచి 835కి పెరిగింది, వారి మొత్తం సంపద 4.6 ట్రిలియన్స్ నుంచి 5.8 ట్రిలియన్లకు పెరిగింది.చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య 520 నుంచి 427కి చేరింది. వారి సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్లకు పడిపోయింది. భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కు చేరింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
'ఆ రెండు' నగరాలు చవకైనవి
ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడ వేతనాలు బాగా తక్కువ బల్గేరియా రాజధాని సోఫియాలో మనుగడ మహా సులువు లండన్.. .అత్యంత వ్యయభరితం తగినన్ని ఇళ్లు లేక పెరిగిన కిరాయిలు లండన్: ప్రపంచంలోనే అత్యంత వ్యయపూరిత నగరాల్లో లండన్ ఐదో స్థానంలో ఉంది. అయితే ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడ వేత నాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఇక మన దేశానికొస్తే కారు చౌక నగరాల్లో ముంబై, ఢిల్లీ ఉన్నాయి. ఈ విషయం స్విట్జర్లాండ్ బ్యాంకు యూబీఎస్ ఇటీవల చేసిన అధ్యయనంలో తేలింది. వస్తువుల ధరలు, అద్దెలతో పోల్చినపుడు జ్యూరిచ్, జెనీవా, న్యూయార్క్, ఓస్లోల కంటే లండన్ వెనుకబడిపోయింది. ఇక స్థూల వేతనాలకొచ్చేసరికి 13వ స్థానంలో నిలిచింది. లండన్ కంటే సిడ్నీ, కోపెన్హాగన్, చికాగోలలో సులువుగా మనుగడ సాగించొచ్చు. ఈ మూడు నగరాల ప్రజల రాబడి లండన్వాసులకంటే ఎక్కువ. నివాసాల కిరాయిల పెరుగుదల లండన్వాసుల జీవన వ్యయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందువల్ల వారి జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. పైగా బ్రిటన్ ప్రభుత్వం అవసరాలకు సరిపడా ఆవాసాలను నిర్మించకపోవడం కిరాయిలు పెరిగిపోయేలా చేసింది. ఇతర దేశాలనుంచి లండన్కు వలసలు పెరగడం, ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నవారు డబ్బును ఆదా చేసుకునేందుకు అందులోనే సుదీర్ఘకాలం ఉండిపోవడం ఆస్తుల అద్దెలు ఆకాశాన్నంటుకునేలా చేశాయి. 2007-08 ఆర్థిక సంక్షోభం తర్వాత ద్రవ్యోల్బణంతో పోలిస్తే రాబడి అత్యంత నిదానంగా పెరిగింది. 39 రకాల ఆహార పదార్థాల సగటు ధరలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు యూరప్లోని రాజధాని నగరాలైన పారిస్, బెర్లిన్లతో పోలిస్తే లండన్లోనే జీవన వ్యయం బాగా ఎక్కువగా ఉంది. అయితే జ్యూరిచ్, సియోల్, న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఉన్నాయి. లండన్ వాసి ఓ ఐ ఫోన్ కొనుగోలు చేయాలంటే అతడు కనీసం 41.2 గంటలపాటు పని చేయాల్సి ఉంటుంది. అదే జ్యూరిచ్వాసి అయితే 20. 6 గంటలు పనిచేస్తే సరిపోతుందని ఈ అధ్యయనంలో తేలింది. లండన్లో బ్రెడ్ ధర బాగా తక్కువ. ఇక్కడ ఆరు నిమిషాలపాటు పనిచేస్తే చాలు...తినడానికి ఏమైనా కొనుగోలు చేయొచ్చు. ఇక న్యూయార్క్లో అయితే మూడు నిమిషాలు పనిచేసినా కడుపు ఆకలితో నకనకలాడాల్సిన పని ఉండదు. జీవన వ్యయం అత్యంత తక్కువగా ఉండే నగరాల విషయానికొస్తే బల్గేరియాలోని సోఫియా తొలి స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో రొమేనియాలోని బుఖారెస్ట్, భారత్లోని ముంబై, ఢిల్లీ నిలిచాయి. ప్రపంచంలోని 71 ప్రాంతాలతో పోలిస్తే ఈ రెండు నగరాల్లో వేతనాలు బాగా తక్కువ.