breaking news
Swift Strike
-
అరకులో కాంట్రాక్టు ఉద్యోగుల మెరుపు సమ్మె
అరకు: ప్రముఖ పర్యాటక ప్రాంతం విశాఖపట్నం జిల్లా అరకులో కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మకు దిగారు. 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మె చేపట్టారు. మ్యూజియం, పద్మావతి గార్డెన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అరకు అందాలను తిలకిద్దామని వచ్చిన పర్యాటకులకు ఉద్యోగుల సమ్మెతో నిరాశ ఎదురైంది. -
నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె: అశోక్బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెను ఆఖరి అస్త్రంగా ఉపయోగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చిన వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. రైల్రోకో, బంద్, చలోఅసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈసారి నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. విభజనపై కేంద్రం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలైనా సమైక్యవాదాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించాలని కోరారు. ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించేందుకు స్టీరింగ్ కమటీ ఏర్పాటు చేస్తున్నామని అశోక్బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు సమైక్య ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చలసాని శ్రీనివాస్ అన్నారు.