breaking news
Sweet Home
-
నాకు నచ్చిన పాత్ర విమల
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది. పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను. కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి. స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి. -
పేరు గల మాడుగుల హల్వా
మాడుగుల హల్వా ఘుమఘుమలు ఎల్లలు దాటాయి.నాలుగు తరతరాలు గడుస్తున్నాహల్వాకు ఆదరణ తగ్గలేదు.నేటికీ నిత్య మధురంగా ఉంటూ,అందరి నోటినీ పలకరిస్తోంది.విశాఖపట్టణం వచ్చినవారికి, మాడుగుల కూడా ఒక పర్యాటక ప్రదేశమే.సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మాడుగుల హల్వా ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... మాడుగుల పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది నోరూరించే హల్వా. ఈ తీయని పేరు సముద్ర తీరాలు దాటింది. విశాఖపట్టణానికి వచ్చినవారు, అక్కడి ప్రదేశాలను సందర్శించాక, నేరుగా మాడుగుల చేరుకుంటారు. నేతి వాసనతో ఘుమఘుమలాడే హల్వా రుచి చూస్తారు. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని పేరు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పురుడు పోసుకుంది ఈ హల్వా. ఇంతింతై వటుడింతౖయె నుంచి త్రివిక్రముని స్థాయికి చేరినక ఈ హల్వా దేశ సరిహద్దులు దాటింది. హల్వా పుట్టుక మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు సుమారు 130 ఏళ్ల కిందట మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో బూడిద గుమ్మడి, కొబ్బరికాయలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. కొంతకాలం తరవాత ఏదో ఒక కొత్త రకమైన స్వీట్ తయారుచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన... తియ్యని హల్వా రూపంలో ఆచరణలోకి వచ్చింది. మాడుగుల హల్వా తయారీ విధానం మంచి రకం గోధుమలను మూడు రోజుల పాటు నానబెట్టి, రుబ్బి, గోధుమ పాలు తీస్తారు. ఆ పాలను ఒక రోజు పులియబెట్టి ఆ తర్వాత పెద్ద పాత్రలో పోస్తారు. నెయ్యి, బెల్లం జత చేసి, మంట మీద ఉంచి, పాలు బాగా మరిగి దగ్గర పడేవరకు కలిపి దింపేస్తారు. జీడి పప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు. హల్వా తయారీ వినడానికి, చూడటానికి సులువుగానే అనిపిస్తుంది కానీ, పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే. మాడుగుల వాతావరణం, అక్కడి నీటిలో ఉండే గొప్పదనం వల్లే ఇంత రుచి వస్తుందని మాడుగుల వాస్తవ్యులు గర్వంగా చెప్పుకుంటారు. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా హల్వాకు మాడుగుల కుటుంబం వారికి వచ్చిన రుచి రావటం లేదని అందరూ చెబుతుంటారు. వారికి మాత్రమే అంత రుచి రావడానికి వారు కొన్ని కారణాలు చెబుతారు. గోధుమలను రోటిలో రుబ్బడంలో నైపుణ్యం ప్రదర్శించడం, రుబ్బిన పాలను ఇనుప కళాయిలో వేసి, పాకం వచ్చే వరకు అదే వేడిలో మరగ పెట్టి హల్వా పాకం తయారు చేయడం మాడుగుల హల్వాకు రుచి రావడానికి కారణాలు. హల్వాలో పెరుగుతున్న రకాలు మొదటలో హల్వా ఒకటే రకం ఉండేది. విక్రయాలు పెరగడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి హల్వాను... ఆవు నెయ్యి బాదం పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా జీడి పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా గోధుమపాలు నెయ్యి చక్కెరలతో మూడు రకాలుగా తయారుచేస్తున్నారు. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. కొన్నాళ్ల తరవాత వారి హల్వా తయారీ విషయం బయటకు తెలియడంతో మరో మూడు కుటుంబాలు కూడా హల్వా తయారుచేయడం ప్రారంభించారు. రుచిలోను, క్వాలిటీలోనూ దంగేటివారి హల్వా ఎక్కడా రాజీ పడలేదు. ఎన్ని షాపులు వచ్చినా దంగేటి వారి హల్వా షాపుకే మంచి పేరు ఉంది. రెండు వేల కుటుంబాలకు ఆధారం మాడుగుల హల్వా వ్యాపారం కారణంగా సుమారు 2000 కుటుంబాలు సుఖవంతమైన జీవనం సాగిస్తున్నాయి. మాడుగులలో ఉన్నత చదువులు చదువుకుని ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు వారంతా తప్పనిసరిగా హల్వా తీసుకెళ్ళి అక్కడ వారికి రుచి చూపిస్తున్నారు. నాలుగు తరాలుగా తగ్గని ఆదరణ... దంగేటి ధర్మారావు నుండి అతని కుమారుడు కొండలరావు, మనుమడు దంగేటి మూర్తి, ముని మనముడు మెహన్ వరకూ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అరకులోయకు షూటింగులకు వచ్చే సినీ నటులు ఈ హల్వాను తప్పక రుచి చూస్తారు. దివంగత ముఖ్యమంత్రి వై.స్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ హల్వా రుచి చూశారు. హల్వా ద్వారానే మాడుగుల ప్రసిద్ధి మత్స్య వంశ రాజుల పాలనలో మాడుగుల సామ్రాజ్యం ఉండేది. వారి పరిపాలనలో మాడుగుల ప్రాంతానికి పేరుప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, హల్వా ద్వారానే మాడుగులకు దేశవిదేశాలలో మంచి గుర్తింపు వచ్చింది. మాడుగుల నుండి వచ్చామని ఎవరితోనైనా అనగానే, ‘‘హల్వా తెచ్చారేమిటి బాబూ, అదెలా తయారువుతుంది. మళ్లీ ఎప్పుడు వస్తావు, మీరు వచ్చినపుడు హల్వా తీసుకురావడం మరవకండి’’ అని పలకరించడం పరిపాటిగా మారిపోయిందని స్థానికులు చెబుతారు. - కరణం నారాయణరావు, సాక్షి, మాడుగుల, విశాఖపట్నం జిల్లా తరాలుగా ఒకటే రుచి నేటికీ కొనసాగిస్తున్నాం... ఆవు నెయ్యి, గోధుమలు, కూలీల ధరలు పెరిగినా, లాభాలు ఆశించకుండా, ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నాం. మా ముత్తాత ధర్మారావు కనిపెట్టిన హల్వాను క్వాలిటీ తగ్గకుండా నేటి వరకు ఒకే విధంగా తయారు చేస్తున్నాం. అడ్రసు చెబితే చాలు ఎంత దూరమైన అందజేస్తున్నాం. - దంగేటి మోహన్, మునిమనుమడు, మాడుగుల -
ఆయనే వంట నేర్పించారు
స్వీట్ హోమ్ మీ ఇంట్లో బాస్ ఎవరు? అని కొందరు చిలిపిగా అడుగుతారు... నేను కూడా అంతే చిలిపిగా సమాధానం చెబుతాను. ‘పిల్లలు’ అని! నాకు, ఆయనకు మధ్య ఎలాంటి ఇగోలు లేవు. మా లక్ష్యం ఒక్కటే...పిల్లలకు మంచి చదువు చెప్పించాలి అని. పిల్లల హోమ్ వర్క్ విషయంలో నేను సహాయం చేస్తాను. సబ్జెక్ట్లను ఇద్దరం పంచుకుంటాం. నేను బాటనీ చెబుతాను. మ్యాథ్స్, ఫిజిక్స్ ఆయన చెబుతారు. నేను కొన్ని సందర్భాల్లో తల్లిగా కొంచెం కఠినంగా వ్యవహరించినా, ఇంకొన్ని సందర్భాల్లో మాత్రం స్నేహంగా ఉంటాను. భోజనాన్ని వృథా చేయడం నాకు నచ్చదు. దాని విలువ గురించి వాళ్లకు చెబుతుంటాను. ‘భర్త నా చేతిలో ఉండాలి... నేను చెప్పినదానికల్లా తల ఊపాలి’ అనుకునే రకం కాదు నేను. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వారి మీద ఎలాంటి ఆంక్షలూ పెట్టకూడదు. మా ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అంటే...ఇద్దరమూ! ఒకరికొకరం ఆశ్చర్యపరిచే బహుమతులు ఇచ్చుకుంటాం. క్యాండిల్లైట్ డిన్నర్లను ఇష్టపడతాం. మా ఆయన బాగా వంట చేస్తాడు. ఆయన నుంచే నేను వంట నేర్చుకున్నాను. - మాధురీ దీక్షిత్