breaking news
Swears
-
లోకేష్ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటేశ్వరపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు. ‘‘నేను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా?. లోకేష్ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి చేస్తారా?. నేను ఎదుటి వారికి సహాయం చేశాను కానీ, అక్రమాస్తులు కూడబెట్టలేదు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుంది?. నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అనిల్ పేర్కొన్నారు. చదవండి: ‘రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా?’ -
యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ ప్రమాణం
-
‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
- ‘అమ్మ’ సమాధిని మూడుసార్లు అరచేత్తో గట్టిగా తట్టిన చిన్నమ్మ - కుట్రల నుంచి పార్టీని కాపాడతానని శపథం చేశారంటున్న అన్నాడీఎంకే శ్రేణులు - అది ‘కుట్ర, ద్రోహం, కష్టాల’కు సంకేతమని పార్టీ వెబ్సైట్లో వెల్లడి - బెంగళూరు కోర్టులో లొంగిపోయిన శశికళ, ఇళవరసి, సుధాకరన్ - తనకు వీఐపీ వసతులు కల్పించాలని కోరుతూ శశికళ లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన శశికళ బెంగ ళూరు కోర్టులో లొంగిపోవడానికి బయల్దేరే ముందు బుధవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్లోని ‘అమ్మ’ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. మొదట అమ్మ సమాధి వద్దకు చేరుకుని పూలు చల్లారు. వంగి నమస్కారం చేసి, మరలా లేచి నిలబడి పెదాలు బిగబట్టి సమాధిపై అరచేత్తో గట్టిగా తట్టారు. ఆ తరువాత మళ్లీ లేచి నిలబడి పెదాలు కదిలిస్తూ మనస్సులోనే ఏమో గొణుక్కున్నారు. ఇలా మరో రెండుసార్లు సమాధిపై అరచేత్తో గట్టిగా తట్టారు. అనంతరం వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నారు. అమ్మ సమాధిపై శశికళ చేసిన శపథం వెనుక ఆంతర్యంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. నా ప్రాణం ఉన్నంత వరకూ అన్నాడీఎంకేను ఏ శక్తీ నాశనం చేయలేదు, శత్రువుల కుట్రల నుంచి పార్టీని కాపాడుతాను అని శపథం చేసినట్లుగా శశికళ వెంట ఉన్న పార్టీ శ్రేణులు తెలిపాయి. అయితే, ‘కుట్ర, ద్రోహం, కష్టాల’కు బలయ్యానని సంకేతంగా శశికళ మూడుసార్లు అమ్మ సమాధిని చేత్తో తట్టారని అన్నాడీఎంకే అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. శశికళ మెరీనా బీచ్ నుంచి రామాపురంలోని ఎంజీ రామచంద్రన్ నివాసానికి వెళ్లి కొద్దిసేపు మౌనముద్రలో కూర్చున్నారు. ఆ తరువాత అదే ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా శశికళ, ఇళవరసి బెంగళూరు వైపు పయనమయ్యారు. అంతకుముందు పోయెస్ గార్డెన్లో జయలలిత ఫొటో వద్ద శశికళ శ్రద్ధాంజలి ఘటించారు. ఇదే కేసులో శిక్ష పడిన సుధాకరన్ కూడా చెన్నై నుంచి వేరుగా బయల్దేరి బెంగళూరు కోర్టులో లొంగి పోయారు. బంధువులకు పదవులు: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ - వ్యతిరేకిస్తూ పార్టీ నిర్వాహక కార్యదర్శి రాజీనామా సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్తూ పార్టీ బాధ్యతల్ని తన కుటుంబసభ్యులకు కట్టపెట్టారు. వరుసకు కుమారుడైన దినకరన్కు బుధవారం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని అప్పగించారు. దినకరన్తో పాటు శశికళ అన్న సుందరవదనం కుమారుడు డాక్టర్ వెంకటేషన్ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆ ఇద్దరు గతంలో చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, క్షమాపణ కూడా కోరడంతో పార్టీలోకి మళ్లీ తీసుకున్నట్టు ప్రకటించారు. టీటీవీ దినకరన్ తన ప్రతినిధిగా, ఉప ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలను చూసుకుంటారని తన ప్రకటనలో కార్యకర్తలకు సందేశాన్ని పంపించారు. ప్రభుత్వం ఏర్పాటైన పక్షంలో దినకరన్కు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించగానే, దినకరన్ ఆగమేఘాలపై కువత్తూరు క్యాంప్నకు చేరుకుని ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే అమ్మ జయలలిత గతంలో పక్కన పెట్టినవారికి పదవులు కట్టబెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. దినకరన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నిర్వాహక కార్యదర్శి కరుప్పసామి పాండియన్ తన పదవికి రాజీనామా చేశారు. జయలలిత 2011లో ఎంపీ పదవి నుంచి టీటీవీ దినకరన్, పార్టీ యువజన కార్యదర్శి పదవి నుంచి డాక్టర్ వెంకటేష్లను తొలగించిన విషయం తెలిసిందే. సింగపూర్ పౌరసత్వం కూడా కలిగి ఉన్న దినకరన్పై విదేశీమారక ద్రవ్యం కేసు, ఇంగ్లాండ్లో ఓ బ్యాంక్లో పెద్ద మొత్తం డిపాజిట్తో పాటు పలు కేసులు ఉండడం గమనార్హం. -
గతం కాదు.. ఇప్పుడు చూడండి
►కోడిపందాలపై జిల్లా ఎస్పీ శపథం ► ఆదేశాలు లెక్క చేయకపోతే రౌడీషీట్లు తెరుస్తాం ఉండి : గతంలో కోడిపందాలపై ఎవరు ఎలా వ్యవహరించారో నాకు తెలియదు కాని నేను మాత్రం కచ్చితంగా ఆపి తీరుతా అని శపథం చేశారు జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్. సోమవారం ఉండి పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట తదితర దురలవాట్ల వల్ల చాలా కుటుంబాలు వీధిన పనడుతున్నాయన్నారు. అందుకే సంక్రాంతి పండగకు ముందుగానే జిల్లావ్యాప్తంగా సుమారు 600 బైండోవర్ కేసులు నమోదు చేశామని అన్నారు. కోడిపందాలపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లాలో ఆరు ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయని చెప్పారు. పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా రౌడీషీట్లు తెరుస్తామని అన్నారు. పందాల నిర్వహణపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ప్రతిరోజూ కేసులూ నమోదు చేస్తున్నామని తెలిపారు. కోడిపందాలపై రెండు నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా 167 సీసీ కెమెరాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసామన్నారు. హెల్మెట్ ధారణను భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పోలీసుల బాధ పడలేకపోతున్నాం అని అనుకోకుండా కుటుంబాలను, జీవితాలను కాపాడుకుంటున్నాం అనే మంచి ఆలోచనతో హెల్మెట్ ధరించాలన్నారు. జిల్లాల్లో 2014లో రూ.2.80 కోట్లు, 2015లో రూ.3.70 కోట్ల సొత్తును రికవరీ చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని వణికించిన సైకో సూదిగాడి కోసం ఇంకా గాలింపు జరుపుతున్నామన్నారు. సీసీ కెమెరాలలో క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో నిందితుడిని పట్టుకోలేకపోయామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అమర్నాథ్నాయుడు, సీఐ ఆర్జే జయసూర్య, ఎస్సై ఎం.రవివర్మ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.