breaking news
Swaroopa Rani
-
ఏఓబీలో కూంబింగ్
శ్రీకాకుళం ,భామిని: ఆంధ్రా–ఒడిశా బోర్డర్(ఏఓబీ)లో పోలీస్ల కూంబింగ్ ముమ్మరమయింది. గత కొన్నాళ్లుగా స్తబ్ధతగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో అలజడి నెలకొంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అరకులో మావోయిస్టుల ఘాతుకంతో పోలీస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చడంతో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో నిలిపివేసిన సాయుధ పోలీస్ కూంబింగ్లు తిరిగి ఆరంభమయ్యాయి. ఏఓబీలో కీలకమైన తివ్వకొండల్లో పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. భామిని మండలం నుంచి ఒడిశా, విజయనగరం జిల్లాలకు విస్తరించిన తివ్వకొండలు, అటవీ ప్రాంతంలో సోమవారం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. డీఎస్పీ స్వరూపారాణి సందర్శన తివ్వకొండల్లో జరుగుతున్న పోలీస్ కూంబింగ్ను పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావుతో కలిసి కొండ ప్రాంతాల్లో జరుగుతున్న కూంబింగ్ను పరిశీలించారు. సాయంత్రం సాయుధ బలగాలతో కలిసి భామిని మండలం మనుమకొండ–పాలవలస గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. పాలవలస సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహించారు. ఏబీ రోడ్లు వెంబడి పోలీస్లు తనిఖీలు చేశారు. -
'అనంత' మేయర్కు స్వైన్ఫ్లూ లక్షణాలు
అనంతపురం: అనంతపురం నగర మేయర్ స్వరూపరాణికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గత మూడు రోజులుగా స్వరూప తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఇప్పటికే హైదరాబాద్కు బ్లడ్ శాంపిల్ కూడా పంపించినట్టు సమాచరం. రోగ నిర్ధారణపై అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను..
లెక్కించలేనన్ని వన్నెలను ప్రకృతిలో పొదిగిన విధి అతడికి ఒక్కగానొక్క వన్నె కూడా తెలియకుండా చేసింది. అయితేనేం.. ‘నీ జీవితాన్ని ఏడువన్నెల ఇంద్రధనువుగా మార్చడానికి నేనున్నాను. నీకు తెలియని రంగుల్ని నా స్పర్శగా, ప్రేమగా అనువదించి అందిస్తా’నంది ఓ యువతి. ‘చూపు లేని నీ బతుకునావకు చుక్కానిని అవుతాను’ అన్న ఆ యువతి వేలికి ఉంగరం తొడిగే వేళ అతడు.. ఇన్నాళ్లూ తనను చిన్నచూపు చూసిన విధినే చిన్నబుచ్చినంత పరమానందభరితుడయ్యాడు. పుట్టంధుడైన వేల్పూరి రవిబాబు, స్వరూపరాణిల కులాంతర వివాహం శనివారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో జరిగింది. వెదురుపాకకు చెందిన వీరబాబు పుట్టుకతోనే అంధుడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తల్లి మంగ, తండ్రి వెంకన్న అనారోగ్యంతో మృతిచెందారు. కంటిచూపు లేదని, కన్నవారు లేరని అతడు కుంగిపోలేదు. మండపేటలోని ప్రత్యేక అంధుల పాఠశాలలో చేరాడు. మొక్కవోని సంకల్పంతో డిగ్రీ, డీఈడీ చదివిన వీరబాబు 2012 డిసెంబర్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ప్రస్తుతం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ఎంపీయూపీ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా సమిశ్రగూడెంకు చెందిన స్వరూపరాణి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి ఆశ వర్కర్ కాగా తండ్రి చిరుద్యోగి. కులాలు వేరైనా వీరబాబు, స్వరూపరాణిల వివాహం చేయడానికి పెద్దలు ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన స్వరూపరాణి ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవయ్యా...అందుకే నా కన్నులతో లోకం చూడయ్యా’ అంటూ వీరబాబు జీవితంలో ప్రవేశించింది. అంధుల పాఠశాలలో వీరబాబు సహాధ్యాయులు, అతడి గురువులు వివాహానికి హాజరయ్యారు. వీరబాబు సహాధ్యాయులు తమకు కళ్లులేక పోయినా.. ఆనందకాంతులు నిండిన ముఖాలతో నవదంపతులను ఆశీర్వదిస్తుంటే చూసేవారి కళ్లు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. ఎంతోమంది స్నేహహస్తం అందించారు.. నేను చదువుకునే సమయంలో మండపేట ప్రత్యేక అంధుల పాఠశాల యాజమాన్యంతో పాటు స్నేహితులు సహకరించారు. నేను చదవడానికి ఆర్థికంగా స్నేహితులు చేసిన సహాయం, అందించిన ప్రోత్సాహం మరువలేనిది. - వేల్పూరి వీరబాబు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను.. మనిషికి దేవుడిచ్చిన వరం ఈ ప్రకృతి. దానిని చూడలేని వీరబాబుకు నా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. అతడిని నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. - స్వరూపరాణి