నరేంద్ర మోదీ గురువు స్వామి దయానంద గిరి శివైక్యం
రిషికేశ్: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరి(87) శివైక్యం పొందారు. రిషికేశ్లోని దయానంద ఆశ్రమంలో బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. గత పదిరోజులుగా జాలీగ్రాంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి దయానంద గిరి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి బుధవారమే తరలించారు. బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి దయానంద శివైక్యం చెందారు.
ఈ నెల11న చివరి సారిగా మోదీ, స్వామి దయానంద గిరిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆడిగి తెలుసుకున్నారు.