breaking news
SVU campus
-
అందరూ సేవాభావం అలవరుచుకోవాలి
యూనివర్సిటీక్యాంపస్ : అందరూ సేవాభావం అలవరుచుకోవాలని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అన్నారు. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు రోజు లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లా యంత్రాంగం తరఫున ఆయనకు స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఆయన్ని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం రవిశంకర్ సత్సంగం చేశారు. అందరూ ఆ«ధ్యాత్మికత, సేవాభావం అలవాటు చేసుకోవాలని అప్పుడే సంతోషంగా ఉం టారని చెప్పారు. ప్రతి మనిషిలోపల ఏడు చక్రాలు ఉంటాయన్నారు. ఏడుకొండలపై వెలసిన శ్రీవారు ఎంతో మహిమకలిగిన దేవుడు అన్నారు. అన్నమయ్య రచించిన ‘‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’’ కీర్తనలోని పరామార్థాన్ని వివరించారు. దేశానికి ఆంధ్రప్రదేశ్, తిరుపతి సాంస్కృతిక హబ్గా తయారవుతుందన్నారు. ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతిని తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్న ప్రద్యుమ్న నేతృత్వంలో తిరుపతి ఆధ్యాత్మిక ఆనంద నగరంగా తీర్చిదిద్దబడుతుందనడంలో సందేహం లేదన్నారు. అలరించిన అన్నమాచార్య కీర్తనలు ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా ఎస్వీ స్టేడియంలో జోతిర్మయి ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. ప్రేక్షకులు భక్తిసాగరంలో మునిగి తేలారు. అనంతరం హాలీంఖాన్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న, ఆర్డీఓ కనకనరసారెడ్డి పర్యవేక్షించారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి ఎస్వీ స్టేడియంలో శ్రీరామనవమి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే సినీనేపథ్య గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవీ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విబ్రీమీడియా పర్యవేక్షిస్తోంది. యోగాతో మానసిక శాంతి తిరుచానూరు: యోగాతోనే మానసిక శాంతి సాధ్యమని యోగా శిక్షకులు తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం శిల్పారామంలో యోగాపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు యోగాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు తరలివచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ ఒకప్పుడు జీవన విధానానికి, ప్రస్తుత జీవన విధానికి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. -
ఎస్వీయూ క్యాంపస్లో రగడ
-
ఎస్వీయూ క్యాంపస్లో రగడ
రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదం కొట్టుకొనే స్థాయికి చేరింది. విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ప్రిన్సిపాల్ చాంబర్ ధ్వంసమైంది. పోలీసులు సరైన సమయంలో స్పందించక పోవడంతో గొడవ ముదిరింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. సుమారు 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎమ్మార్పల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. కళాశాలలో ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు, అనుబంధ వసతి గృహానికి అధికారులు సెలవు ప్రకటించారు. సోమవారం రాత్రికల్లా వసతి గృహాలు ఖాళీ చేయాలని సర్క్యులర్ ఇచ్చారు. ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో బీటెక్ రెగ్యులర్, బీటెక్, ఎంటెక్ డ్యూయెల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుతున్న సందర్భంలో రెండు కోర్సుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. అది చివరికి ప్రిన్సిపల్ చాంబర్ ధ్వంసానికి దారితీసింది. సంఘటన బాధాకరం: కళాశాలలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమమని, ఘటన బాధాకరమని కళాశాల ప్రిన్సిపాల్ పద్మనాభం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కళాశాల ప్రిన్సిపాల్గా పద్మనాభం బాధ్యతలు చేపట్టిన రోజే ఈ సంఘటన జరగడం ఆయన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.