breaking news
suvarna raju
-
వైఎస్ జగన్ ఉదారతకు ఏపీ ఎంఆర్పీఎస్ కృతజ్ఞతలు
సాక్షి, అమరాతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారతకు ఏపీ ఎంఆర్పీఎస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక సీఐ అరాచకానికి, వేధింపులకు బలై నిండు ప్రాణాన్ని కోల్పోయిన దళిత యువకుడు పేరు పోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. క్రాంతి కుమార్ కుమారుడి కాలు ఆపరేషన్కు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను భరిస్తూ, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచినందుకు వారికి ఏపీ ఎంఆర్పీఎస్ రుణపడి ఉంటుందన్నారు. -
హెచ్ఏఎల్ ఛైర్మన్ గా సువర్ణరాజు
హైదరాబాద్: తెలుగువాడికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఛైర్మన్ గా ఆంద్రప్రదేశ్ కు చెందిన సువర్ణ రాజు నియమితులైయ్యారు. ఆర్కే త్యాగి స్థానంలో 17 వ ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పి.వేమవరంలో పుట్టిన సువర్ణరాజు చెన్నై ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. 1980 సంవత్సరంలో హెచ్ఏఎల్ లో చేరిన సువర్ణరాజు పలు కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అత్యుత్తమ పనితీరు కనబర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.


