హెచ్ఏఎల్ ఛైర్మన్ గా సువర్ణరాజు | Sakshi
Sakshi News home page

హెచ్ఏఎల్ ఛైర్మన్ గా సువర్ణరాజు

Published Sat, Jan 31 2015 5:27 PM

T Suvarna Raju takes charge as Chairman of HAL

హైదరాబాద్: తెలుగువాడికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్ ఏరోనాటికల్  లిమిటెడ్ ఛైర్మన్ గా ఆంద్రప్రదేశ్ కు చెందిన సువర్ణ రాజు నియమితులైయ్యారు. ఆర్కే త్యాగి స్థానంలో 17 వ ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పి.వేమవరంలో పుట్టిన సువర్ణరాజు చెన్నై ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. 1980 సంవత్సరంలో హెచ్ఏఎల్ లో చేరిన సువర్ణరాజు పలు కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అత్యుత్తమ పనితీరు కనబర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
 

Advertisement
Advertisement