breaking news
suspension notice
-
వైద్యుడి పరారీ.. సస్పెన్షన్ వేటు..
నెల్లూరు(అర్బన్): నర్సులను లైంగికంగా వేధించిన సంఘటనలకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం తెల్లవారుజామున పోలీస్స్టేషన్ నుంచి పరారయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అతనిని విచారణ నిమిత్తం బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని ఉదయగిరి పోలీస్స్టేషన్లో రాత్రి వరకూ విచారించారు. గురువారం తెల్లవారుజామున మూత్రవిసర్జన కంటూ స్టేషన్ బయటకు వచ్చిన డాక్టర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విచారణ చేపట్టారు. వైద్యుడి కోసం గాలిస్తున్నామని, స్టేషన్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా డాక్టర్ రవీంద్రనాథ్ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని ఆయన ఇంటి గోడకు అంటించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ శేషగిరిబాబు వైద్యాధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణలతను విచారణ అధికారిగా నియమించారు. కాగా డాక్టర్ రవీంద్రనాథ్ వికృత చేష్టలపై ఉదయగిరిలో ఇద్దరు నర్సులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక నర్సు తనను ఆమ్లెట్ చేసి తీసుకుని రావాలని కోరి ఇబ్బందులు పాల్జేశాడన్నారు. మరో నర్సు నన్ను ఆపరేషన్ థియేటర్కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. గతంలో పొదలకూరులో గర్భిణీపై ఇలా అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో కేసు నడుస్తోంది. అదే పొదలకూరులో ఓ నర్సుపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తిరగబడింది. దీంతో ఆమెకు క్షమాపణలు చెప్పి ఆ సంఘటన నుంచి బయటపడ్డాడని తెలిసింది. కఠిన చర్యలు తీసుకుంటున్నాం:డాక్టర్ సుబ్బారావు, డీసీహెచ్ ఉదయగిరిలో జరిగిన సంఘటనపై నగరంలోని డీసీహెచ్ కార్యాలయంలో జిల్లా ఆస్పత్రిల సమన్వయాధికారి డాక్టర్ సుబ్బారావు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పని చేసే ప్రదేశాల్లో నర్సులకు, ఇతర మహిళా సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. మరో మారు ఇలాంటివి జరగకుండా నిత్యం ఆస్పత్రు లను తనిఖీ చేస్తామన్నారు. -
దశమంతరెడ్డి పిస్టల్ లైసెన్స్ రద్దుకు నోటీస్
13లోగా సంజాయిషీ ఇవ్వాలని డీఆర్ఓ ఆదేశం నాపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆవేదన జనగామ : జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిస్టల్ లైసెన్స్ రద్దు కోసం జిల్లా రెవెన్యూ అధికారి మంగళవారం నోటీసు పంపించారు. ఎస్పీ అంబర్కిషోర్ఝా సిఫార్సు మేరకు డీఆర్ఓ శోభ దశమంతరెడ్డికి ఈ నోటీసులు జారీ చేశారు. జనగామలో జరుగుతున్న ఉద్యమంలో దశమంతరెడ్డి చురుకుగా పాల్గొంటూ శాంతికి విఘాతం కలిస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణlఉద్యమంలో తనపై అనేక కేసులు నమోదు చేసినా, ఏ రోజు కూడా పిస్టల్ ప్రస్తావన రాలేదన్నారు. జిల్లా కోసం సాగుతున్న ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష మేరకు కొట్లాడుతున్న తనపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తన వ్యక్తిగత భధ్రత కోసం పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకో గా, 2010లో గన్కు లైసెన్స్ ఇచ్చారన్నారు. ఈ నెల 13లోగా పిస్టల్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు. జిల్లా ఉద్యమంలో తాను శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారన్నారు. గన్ లైసెన్స్ రద్దు చేసినంత మాత్రాన తన ప్రాణానికి నష్టం లేదని, అండగా ప్రజలు ఉన్నారన్నారు.