breaking news
Suresh Prabhakar Prabhu
-
శ్రీవారి సేవలో రైల్వే మంత్రి
తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం కానుకలు సమర్పించారు. దర్శనమనంతరం ఆలయాధికారులు సురేష్ ప్రభుకు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సరం డైరీ, శ్రీవారి కేలండర్ను అందజేశారు. -
కేంద్ర మంత్రిగా సురేష్ ప్రభాకర్ ప్రమాణం
-
శివసేన నుంచి కేంద్రమంత్రిగా సురేష్ ప్రభాకర్ ప్రభు
జననం: మహారాష్ట్రలోని ముంబైలో 1953 జూలై 11 తేదిన జన్మించారు. ఆయనకు భార్య ఉమా ప్రభు. ఉమా జర్నలిస్ట్ గా పని చేశారు. కుమారుడు అమెయా ప్రభు ఉన్నారు. వృత్తి చార్టెడ్ అకౌంటెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సభ్యుడు. రాజకీయ ప్రస్థానం: సుదీర్ఘ కాలంగా శివసేన పార్టీకి సేవలందిస్తున్న సురేష్ ప్రభు నాలుగు సార్లు రాజాపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 సంవత్సరంలో ఆయన ఓటమి పాలయ్యారు. 1998 నుంచి 2004 మధ్య కాలంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, పర్యవరణం, అడవులు, ఎరువులు, రసాయన, విద్యుత్, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖల మంత్రిగా సేవలందించారు. నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. ప్రపంచ బ్యాంక్ పార్లమెంటరీ నెట్ వర్క్ సభ్యుడిగా ఎంపిక సౌత్ ఆసియా వాటర్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.