breaking news
Supply of sugarcane
-
చెరుకు గానుగ ఆడేదెవరు?
విజయనగరం కంటోన్మెంట్: చెరుకు బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా చెరుకు సరఫరా చేసిన రైతుల పేరున బినామీ రుణాలు వాడడంతోనే ఎన్సీఎస్ యూజమాన్యంపై రైతులకు నమ్మకం పోరుుందని, చెరుకు రైతులకు సమస్య లేకుండా గానుగ ఆడుతామని ప్రభుత్వం భరోసా కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్ను ఆయన కార్యాలయంలో శుక్రవారం రంగారావు కలిశారు. చెరుకు రైతుకు పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు. అనంతరం కలెక్టరేట్ పొర్టికో వద్ద మీడియూతో మాట్లాడారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలోని రైతులంతా సీతానగరం చక్కెర ఫ్యాక్టరీ ఉందన్న ధీమాతో మూడు లక్షల టన్నుల చెరుకును ఉత్పత్తి చేశారని ఇప్పుడు గానుగ ఆడే విషయంలో వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్సీఎస్ యూజమాన్యం మళ్లీ గానుగ ఆడుతామన్న సంకేతాలిస్తున్న సమయంలో రైతులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గానుగ ఆడే సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ రైతుల గుండెలపై భారం పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వమే భరోసానివ్వాలని కోరారు. ఆర్ఆర్ యూక్టుతో ఎన్సీఎస్ భూముల విక్రయంతో బిల్లులను పూర్తి స్థారుులో చెల్లింపులు చేయూలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఆధీనంలో క్రషింగ్ జరపాలన్నారు. ఇతర పార్టీలకు భూములను విక్రరుుంచి వచ్చిన సొమ్ముతో ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు, ఫ్యాక్టరీ కార్మికుల వేతనాల చెల్లింపులు వెంటనే జరపాలన్నారు. రైతులకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటుందో ముందుగానే చెప్పాలని కోరారు. శాసనసభలో ప్రస్తావించా... జిల్లాలోని చెరుకు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభలో తాను ప్రస్తావించానని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెరుకు బోర్డు నిబంధనలకు అనుగుణంగా బిల్లులు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశానన్నారు. సొంతంగా పెట్టుబడులు పెట్టలేక అప్పులు చేసి రైతులు చెరుకును పండిస్తున్నారని ఇటువంటి వారికి వెంటనే బిల్లులు చెల్లింపులు చేయూల్సిన అవసరం ఉందన్నారు. చెరుకు రైతుల సమస్యలు మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అదే జరిగితే చూస్తూ ఊరుకోబోమని రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అగ్రిమెంట్లే చేయలేదు... జిల్లాలోని ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులకు ఇంత వరకూ చెల్లింపులు చేయకపోవడమే కాకుండా కొత్త సీజన్కు సంబంధించిన అగ్రిమెంట్లు ఇంకా చేయకపోవడం దారుణమని ఎమ్మెల్యే రంగారావు అన్నారు. ఏటా ఈ సమయూనికి అగ్రిమెంట్లు కట్టేవారని ఈ ఏడాది ఇంత వరకు అగ్రిమెంట్లు కట్టకపోవడంతో రైతుల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని నివృత్తి చేయూలన్నారు. అనంతరం ఎన్సీఎస్ సుగర్స్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న రామా సుగర్స్ లేబర్ యూనియన్ నాయకులు సీఎస్ రంగనాయకుడు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు, పీఎఫ్ బకారుులు చెల్లించలేదన్నారు. ఏటా ఆందోళన చేసేటప్పుడు మాత్రమే ఎంతోకొంత నిధులు చెల్లించే అలవాటున్న యూజమాన్యం పూర్తి స్థారుు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీఎస్ యూజమాన్యం ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఆదాయూన్ని సొంత వ్యాపారాలకు మళ్లించడం వల్లే రైతుల సమస్యలు పెరి గిపోయూయని చెప్పారు. ఎమ్మెల్యే వెంట పలువురు రైతులు ఉన్నారు. -
‘బకాయిల’పై సర్కారు సీరియస్
బోధన్, న్యూస్లైన్ : చెరుకు రైతులకు బకాయిల చెల్లింపులో ఫ్యాక్టరీ యాజమాన్యం జాప్యం చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. క్రషింగ్కు చెరుకు పంటను తరలించిన రైతులకు డబ్బులు చెల్లించాలని కేన్ కమిషనర్ ఆదేశించారు. పక్షంలోగా డబ్బులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) పరిధిలో బోధన్, కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు రైతులు చెరుకు సరఫరా చేశారు. అయితే రైతులకు బిల్లు లు చెల్లించడంలో ఫ్యాక్టరీలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో సుమారు రూ. 45 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒక్క బోధన్ యూనిట్ పరిధిలోనే రూ. 10.50 కోట్ల బకాయిలున్నాయి. ఈ విషయమై చెరుకు రైతులు, బోధన్కు చెందిన నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర కేన్ కమిషనర్ బద్రు మల్హోత్ను కలిశారు. రైతుల బాధలు వినిపిం చారు. దీనిపై ఆయన స్పందించి అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్లకు ఫోన్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి గతనెల 15వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేశామని బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ వివరించారు. మే 31 వరకు బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఆర్ఆర్ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంగళవారం నోటీసులు పంపించామన్నారు. ఈ నోటీసు ప్రకారం పదిహేను రోజుల్లోగా ఫ్యాక్టరీ స్పందించకపోతే చట్ట ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. క్రషింగ్ ప్రారంభం నుంచి వివాదమే 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభం నుంచి బోధన్లోని శక్కర్నగర్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం వివాదాస్పదంగా వ్యహరిస్తోంది. 2013 నవంబర్ ఆఖరులో క్రషింగ్ ప్రారంభమవ్వాల్సిన సమయంలో క్రషింగ్ను నిలపివేసింది. రైతులు ఆందోళన చేయడంతో కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకున్నారు. దీంతో డిసెంబర్ 7వ తేదీన క్రషింగ్ ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు సాగింది. ఈ సీజన్లో లక్షా 72 వేల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. ధర విషయంలోనూ.. మద్దతు ధర విషయంలోనూ ఫ్యాక్టరీ ఏకపక్షంగా వ్యవహరించింది. టన్ను చెరుకుకు రూ. 3,500 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరగా 2012-13 సీజన్లో చెల్లించినట్లుగా టన్నుకు రూ. 2,600 ప్రకటించింది. గత్యంతరం లేక రైతులు ఇదే ధరకు చెరుకును విక్రయించారు. చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. ముందుగా చెప్పినట్లుగా రూ. 2,600 చెల్లించాల్సి ఉండగా మొదటి నాలుగు రౌండ్లలో రూ. 2,400 చొప్పునే చెల్లించింది. ఐదో రౌంట్లో రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు మొత్తం రూ. 10.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులకోసం రైతులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఒప్పందాలను ఉల్లంఘించింది శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఒప్పం దాలను ఉల్లఘించింది. చెరుకు బిల్లులు సరఫరా చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. చెరుకు సరఫరా చేసి నాలుగు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఆర్ఆర్ఏ ప్రకారం నోటీస్ ఇచ్చాం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ ఆర్ఆర్ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి మంగళవారం నోటీసులిచ్చాం. 15 రోజుల్లో ఫ్యాక్టరీ స్పందించాలి. లేకపోతే ఫ్యాక్టరీ ఆస్తులు సీజ్ చేస్తాం.