breaking news
Sulagiri
-
వాట్సాప్లో ఐ లవ్ యూ.. అధికారి సస్పెన్షన్
సాక్షి, చెన్నై : మహిళా ఉద్యోగికి వాట్సాప్లో ఐ లవ్యూ అంటూ మెసేజ్ పంపిన సూళగిరి ఉప తాలూకా అభివృద్ధి అధికారిని శుక్రవారం సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. కృష్ణగిరిలో రాయకోటై రోడ్డులో నివసిస్తున్నారు కుమరేశన్ (51). ఈయన కృష్ణగిరి తాలూకా అభివృద్ధి కార్యాలయంలో అధికారిగా పనిచేస్తూ వచ్చారు. ఇటీవల సూళగిరి యూనియన్కు బదిలీ అయ్యారు. ఇలాఉండగా సూళగిరి కార్యాలయంలో పని చేస్తున్న మహిళా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగి వాట్సాప్ నంబరుకు ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపారు. దీని గురించి జిల్లా ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు అందడంతో శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విచారణలో కుమరేశన్ మహిళా ఉద్యోగికి మెసేజ్ పంపినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టర్ ప్రభాకర్ కుమరేశన్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. -
తెల్లకాకి కావ్.. కావ్..
తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా సూళగిరిలో ఓ ఇంటి వద్ద కనిపించిన తెల్లకాకి. విషయం తెలుసుకున్న అటవీ ఉద్యోగులు దానిని మత్తిగిరి అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు. -క్రిష్ణగిరి, తమిళనాడు -
ప్రియుడి సహా పట్టుబడ్డ నూతన వధువు
హొసూరు : గత నెల 28న 20 పౌన్ల నగలు, రూ. 5 వేలు నగదుతో అదృశ్యమైన నూతన వధువును సూళగిరి పోలీసులు ప్రియునితో సహా పట్టుకున్నారు. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్(23)కు బేరికె సమీపంలోని గురునైపల్లి గ్రామానికి చెందిన శశికళ(19)తో ఫిబ్రవరి 23న పెళ్లి జరిగింది. ఈ తరుణంలో మార్చి 28వ తేదీ శశికళ 20 పౌన్ల నగలు, రూ. 5వేలు అదృశ్యమైయ్యింది. ఈ ఘట నపై భర్త చంద్రశేఖర్ సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో శశికళ గురునైపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి (25) ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు గురునైపల్లి గ్రామానికి చేరుకొని క్రిష్ణమూర్తి ఇంట్లో ఉన్న శశికళను అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శశికళ 10వ తరగతి చదువుతున్న సమయంలో క్రిష్ణమూర్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకొన్నారు. ఈ విషయంపై శశికళ తన తల్లితండ్రులకు తెలిపింది. వారు ఈ పెళ్లికి నిరాకరించి మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్తో పెళ్లి జరిపించారని, తర్వాత ఫోన్ద్వారా క్రిష్ణమూర్తితో మాట్లాడిన శశికళ తనను భర్త ఇంటి నుంచి తీసుకెళ్లమని మొరపెట్టుకోవడంతో మాదరసనపల్లిలోని వినాయక దేవాల యానికి రమ్మని క్రిష్ణమూర్తి.. శశికళను తీసుకెళ్లినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి హొసూరు కోర్టులో హాజరుపరచనున్నారు.