breaking news
Sukhna Lake
-
నీళ్లలోకి దూకి.. అమ్మాయిని కాపాడిన జడ్జి
చండీగఢ్: సెక్యూరిటీ లేకుండా మార్నింగ్వాక్కు కూడా వెళ్లని జడ్జిగారు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఒక బాలికను కాపాడిన ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న పంజాబ్, హర్యానా హైకోర్ట్ జడ్జి జస్టిస్ జైపాల్ తన సెక్యూరిటీ ఆఫీసర్ యశ్పాల్తో కలిసి సుఖానా సరస్సు ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో హెల్ప్.. హెల్ప్.. అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఒక బాలిక సరస్సులో మునిగిపోవడాన్ని చూసిన జైపాల్ .. క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను రక్షించడానికి సరస్సులోకి డైవ్ చేశారు. సాక్షాత్తు జడ్జిగారే దూకితే మరి రక్షణాధికారి ఊరుకుంటారా.... జడ్జిగారితో పాటే ఆయన కూడా సరస్సులోకి దూకేశారు. ఇద్దరూ మునిగిపోతున్నబాలిక కోసం వెదుకులాట మొదలుపెట్టారు. ఇంతలోనే భూమి అడుగుకు చేరిన బాలికను గమనించిన సెక్యూరిటీ అధికారి యశ్పాల్ హుటాహుటిన ఆమెను ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే ఆ బాలిక అపస్మారక స్థితిలోకి జారుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆబాలికను ఆసుపత్రికి తరలించారు. చదువుల్లో మంచి మార్కులతో రాణిస్తున్నప్పటికీ, తండ్రి పేదరికం మూలంగా చదువుకు దూరమైంది సదరు బాలిక. దీంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. విషయం తెలుసుకున్నజడ్జ్ జైపాల్ ఆబాలిక చదువుకు సహాయం చేయడమే కాదు.. బాలికను రక్షించడంలో ముఖ్యభూమిక పోషించిన సెక్యూరిటీ అధికారికి నగదు పురస్కారం ప్రకటించి, పదోన్నతికి సిఫారసు చేశారట. -
చూసొద్దాం... రాక్ గార్డెన్స్!
దేనికీ స్పందించని మనిషిని రాతితో పోలుస్తుంటారు. కానీ ఈ రాతి ఉద్యానాలను సందర్శించిన వారు ఆ పోలిక తప్పని చెబుతారు. జీవం ఉట్టిపడే ఈ ఉద్యానాల ప్రత్యేకత అలాంటిది. రాతి కట్టడాల గురించి తెలుసు, పచ్చని మొక్కలతో అలరారే ఉద్యానాలూ తెలుసు... మరి పూర్తిగా రాళ్లతోనే నిర్మితమైన ఉద్యానాల గురించి తెలుసా!! లేదంటే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనిషి చేతుల్లో పురుడు పోసుకున్న ఈ ప్రకృతి వనాలను సందర్శిస్తే ‘రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు...’ అని సంధించిన ఓ మహాకవి ప్రశ్నకు సమాధానం ఇవేనా అనిపించకమానదు. నెక్ చంద్ రాతి వనం మన దేశంలోని చండీగఢ్లో సుఖ్నా సరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానం సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. వాస్తవానికి ఈ గార్డెన్ ఏర్పాటుపై నిషేధం విధించింది అప్పటి ప్రభుత్వం. అందుకని 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిల్ పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో నృత్యభంగిమల్లో ఉన్నవి, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పని చేశారు. 1975లో ఈ రాతి ఉద్యానం వెలుగులోకి రావడం, ప్రభుత్వం చంద్ శ్రమను గుర్తించి, పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్లను ఇందుకోసం ఉపయోగించమని సూచించింది. 1976లో ఈ పార్క్ను పబ్లిక్ ప్లేస్గా గుర్తించి ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఈ రాక్గార్డెన్ సందర్శనకు ప్రతిరోజూ 5 వేల మందికి పైగా సందర్శకులొస్తున్నారు. సన్ యట్-సెన్ చైనీస్ గార్డెన్ కెనడాలోని వాంకోవర్లో కొలువుదీరిన ఈ సంప్రదాయ గార్డెన్ను రాయి, నీరు, గ్రహాలు, నిర్మాణం.. ఈ నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రూపొందించారు ఉద్యాన సృష్టికర్తలు జో వాయ్, డొనాల్ వ్యుఘన్లు. 1985-1986లో నిర్మించిన ఈ గార్డెన్కి చైనాలోని తాయ్ సరస్సు దగ్గర ఉన్న రాళ్లను తెప్పించి నిర్మించారు. తాయ్ సరస్సులోని రాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, అదృష్టాన్ని కలిగిస్తాయని చైనీయుల నమ్మకం. ఆధునిక చైనా జాతీయ నాయకుడైన డాక్టర్ సన్ యట్-సెన్ పేరును దీనికి పెట్టారు. ప్రకృతికి దీటుగా ఏర్పాటు చేసిన ఈ ఉద్యానం విజ్ఞాన, విహార, ధ్యానానుభూతులను ఏకకాలంలో కలిగిస్తోంది. డంబర్టన్ ఓక్స్ గార్డెన్ అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో డంబర్టన్ ఓక్స్పేరుతో ఉంది ఈ రాతి వనం. బీట్రిక్స్ ఫెర్రాండ్ అనే వ్యక్తి రంగురంగు రాళ్లతో అత్యద్భుతంగా 1920ల కాలంలో ఈ రాతి ఉద్యానాన్ని రూపొందించారు. అలంకరణ కోసం రకరకాల రాతి ముక్కలను ఈ స్టైల్ గార్డెన్ నిర్మాణానికి ఉపయోగించారు. వాకర్ రాక్ గార్డెన్ వాషింగ్టన్లో వాకర్ రాక్ గార్డెన్ను ఆంటోనీ గౌడి 1950లో అభివృద్ధి చేశాడు. దీని రూపకర్త మిల్టన్ వాకర్. ఇతను బోయింగ్ విమానాల మెకానిక్గా పనిచేసేవాడు. తన భార్య మిల్టన్తో కలిసి 20 ఏళ్లపాటు అత్యంత ప్రేమగా ఈ ఉద్యానాన్ని సృష్టించాడు. ఈ రాతి ఉద్యానంలోని కట్టడాలకు రాళ్లు, చెక్కలు, రంగురంగుల గాజు ముక్కలను ఉపయోగించాడు. 18 అడుగుల పొడవైన టవర్, అలంకృత ఫౌంటెయిన్లు, ఆల్ఫ్స్ పర్వతాలను పోలిన సుందర రూపాలు, సీతాకోకచిలుకలను పోలిన రాళ్ల నిర్మాణాలు ఇక్కడ కనువిందుచేస్తాయి.