-
కీచులాటల పాలన
నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. పాలన గాడి తప్పడంతోపాటు అవినీతి పెచ్చుమీరింది. స్ట్రాంవాటర్ డ్రెయిన్ నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన రూ.461 కోట్లను వినియోగంలోకి తేవడంలో పాలకులు విఫలమయ్యారు. మంచినీటి చార్జీలు ఏడాదికి ఏడు శాతం చొప్పున పెరుగుతున్నాయి. గతేడాది దర్గా భూములు, శ్రీకనకదుర్గా సొసైటీ లేవఅవుట్ వివాదాల్లో చిక్కుకున్న పాలక వర్గం ఈ దఫా విజ్ఞానయాత్రతో రచ్చకెక్కింది. అసమ్మతి వర్గం మేయర్ చైర్ను టార్గెట్ చేసి దూకుడు పెంచింది. విజయవాడ : నగర పాలన మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. నగరపాలక సంస్థలో అవినీతిని కట్టడి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. టౌన్ప్లానింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య, ఎస్టేట్ సెక్షన్ల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరునెలలుగా తిరుగుతున్నా ఇంటిపన్ను వేయడం లేదని ఇటీవల జరిగిన జరిగిన కౌన్సిల్ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు చెప్పిన ఘటన పాలన ఎంతబాగా సాగుతుందోననే విషయాన్ని పట్టిచూపుతోంది. గడిచిన రెండేళ్లలో ఎనిమిది కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అధికారపార్టీ కార్పొరేటర్ల కలెక్షన్ల దందాపై బలమైన విమర్శలు ఉన్నాయి. పన్నుభారాలు మోపబోమంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారు. మంచినీటి చార్జీలను ఏటా 7 శాతం పెంచాలని ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన నిర్ణయాలనే నేటికీ యథాతథంగా అమలుచేస్తున్నారు. అమృత్ పథకంలో భాగంగా నీటి మీటర్ల ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవీ వైఫల్యాలు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పథకాన్ని పూర్తి చేయడంలో పాలకవర్గం పిల్లిమొగ్గలేసింది. నగరానికి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు 28,152 ఇళ్లు మంజూరవగా నాలుగు విడతల్లో 18,176 ఇళ్ల నిర్మాణం చేపట్టి 13,664 ఇళ్లను పూర్తి చేశారు. స్థలాభావం కారణంగా పదివేల ఇళ్లను పూర్తి చేయలేమని గతేడాది ప్రభుత్వానికి లేఖరాసిన నగరపాలకులు, 4,512 ఇళ్లను పూర్తి చేయడంలోనూ విఫలమయ్యారు. స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.461 కోట్ల నిధులు రాబట్టడంలో సఫలమైన మేయర్ శ్రీధర్ వాటి వినియోగించడంలో విఫలమయ్యారు. ఏడాది క్రితమే నిధులు విడుదలయ్యాయి. డ్రెయిన్ల నిర్మాణం కోసం ఇరవై రోజుల క్రితం పబ్లిక్హెల్త్ విభాగం టెండర్లు పిలవగా 14 శాతం ఎక్సెస్ పడ్డాయి. దీంతో మరోమారు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టెండర్ల దశదాటి పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో వేచిచూడాలి. కీచులాటలు టీడీపీలో అంతర్గత కీచులాటలు అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయి. స్టాండింగ్ కమిటీ, మేయర్ మధ్య సయోధ్య కొరవడింది. ఫలితంగా తీర్మానాలు తిర‘కాసు’ మయమవుతున్నాయి. కార్పొరేర్ల విజ్ఞానయాత్ర వివాదాస్పదంగా మారింది. అధికారపార్టీ కార్పొరేటర్లు తోటి మహిళా ప్రయాణికులతో అసభ్యంగా వ్యవహరించి చెడ్డపేరు తెచ్చుకున్నారు. మేయర్ చైర్ను టార్గెట్ చేసిన అసమ్మతి వర్గం దూకుడు పెంచింది. మేయర్తో మాటామంతి కూడా ఆపేసింది. ఎంపీ కేశినేని నాని జోక్యం నేపథ్యంలో పుష్కరాల వరకు తాత్కాలిక విరామం ప్రకటించింది. ఇష్టం లేకుంటే తనను మార్చేయాలని స్వయంగా మేయర్ టీడీపీ పెద్దల ముందు వాపోయినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే గ్రూపు లను ప్రోత్సహించడంతో మేయర్ చైర్ బలహీనపడింది. రెండేళ్ల పాలనలో స్వపక్షం కార్పొరేటర్లే మేయర్ను ముప్పుతిప్పలు పెట్టడం చర్చనీయాంశమైంది. -
త్వరలో సీఎం వద్దకు పంచాయితీ
స్ట్రాంవాటర్ డ్రెయినేజ్ పనులు పబ్లిక్ హెల్త్ విభాగానికి కట్టబెట్టిన మంత్రి నారాయణ! కార్పొరేషన్కే అప్పగించాలంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు విజయవాడ : స్ట్రాం వాటర్ డ్రెయినేజ్ (వరద నీరు) నిధులు తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ఎట్టకేలకు నిధుల్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఒత్తిడి వల్లే పబ్లిక్ హెల్త్ విభాగానికి పనుల్ని కట్టబెడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ చేపట్టాల్సిన పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. రాకరాక వచ్చిన నిధులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటలకు దారితీయడం ఇప్పుడు కార్పొరేషన్లో హాట్ టాపిక్గా మారింది. చిన్నబుచ్చుకున్నారు స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మేలో రూ.461 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలివిడతగా రూ.110 కోట్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని తొక్కిపట్టింది. నిబంధనల నేపథ్యంలో ఎట్టకేలకు ఇటీవలే విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ నాని, మేయర్ శ్రీధర్ చొరవ చూపారు. ఏ దశలోనూ కృషి చేయని మంత్రి నారాయణ ఇప్పుడు పెత్తనం చేయడాన్ని స్థానికనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించారు. 100 కి.మీ మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు పనుల్ని పబ్లిక్హెల్త్ విభాగానికి అప్పగించడంతో కార్పొరేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు. ఎందుకంత ప్రేమ! రూ.62 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40 వేల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్లద్వారానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది. దీనికి ఆ డ్రెయిన్ల సామర్థ్యం చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్టౌన్, సర్కిల్-3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈక్రమంలో స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. పబ్లిక్హెల్త్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు, ఒక డీఈ, ఇద్దరు ఏఈలు మాత్రమే ఉన్నారు. ఎస్ఈ గుంటూరు జిల్లాలో ఉంటారు. నగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్, ఇద్దరు ఎస్ఈలు, 8 మంది ఈఈలు, 21మంది డీఈలు, 40 మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది అధికారులు కార్పొరేషన్లో ఉండగా పబ్లిక్హెల్త్ విభాగానికి పనుల బాధ్యతల్ని మంత్రి అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. అనుమానమే.. కేంద్రం నిధులతో చేపట్టబోయే పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిధులు మురిగిపోతాయి. ప్రతి ఆరునెలలకు ఓ సారి నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుబట్టే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పనులు పూర్తవుతాయనే నమ్మకం తమకు లేదన్నది స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయంగా తెలుస్తోంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓటేసేందుకు మూడు కోట్ల కారులో వచ్చిన హీరోయిన్!
‘మల్లె మొగ్గ’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
ప్లే ఆఫ్స్కు వర్షం అంతరాయం కలిగిస్తే.. పరిస్థితి ఏంటి?
మొత్తం లుక్కే మార్చేసిన రీతూ.. అషూ రెడ్డి హాట్ హాట్!
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
‘మిరాయ్’ ది సూపర్ యోధ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
తప్పక చదవండి
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement