-
జీఎస్టీ పరిధిలోకి మరింత మంది!
సాక్షి, అమరావతి: జీఎస్టీ పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకురావడానికి గల మార్గాలను అన్వేషించడానికి రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన ఎంపవర్డ్ కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశం కానుంది. గత రెండు నెలలుగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య తగ్గిపోతుండటం, ఆ మేరకు ఆదాయమూ క్షీణిస్తుండడంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న లిక్కర్, పెట్రోలియం, స్టాంప్ డ్యూటీలు వంటి వాటిని కూడా జీఎస్టీలోకి తీసుకొచ్చేందుకున్న సాధ్యాసాధ్యాల బాధ్యతను ఎంపవర్డ్ కమిటీకి అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరగనున్న కమిటీ సమావేశం.. లిక్కర్, పెట్రోలియం, స్టాంప్ డ్యూటీలు వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై వివిధ రాష్ట్రాలకున్న అభ్యంతరాలను ప్రధానంగా చర్చించడంతోపాటు జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్ని ఎలా పెంచాలన్న విషయంపైనా దృష్టి పెట్టనుంది. ఈ కమిటీ ఇచ్చే సూచనలపై వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పెట్రోలు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదని సమాచారం. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ప్రత్యేక దృష్టితో పరిశీలించి జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని ఈ సమావేశంలో ఏపీ డిమాండ్ చేయనుందని తెలుస్తోంది. ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి.. జీఎస్టీ ఆదాయం తగ్గితే ఆ మేరకు కేంద్రం పరిహారం ఇస్తున్నా... కాంపెన్సేషన్ సెస్ పేరుతో ఆ భారం తిరిగి రాష్ట్రాలపైనే పడుతుండటంతో సొంతంగా ఆదాయం పెంచుకోవడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిధిలోకి మరింతమందిని తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,48,461 మంది జీఎస్టీ కింద నమోదవగా క్రమంగా రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. జూలై నెలలో రిటర్నులు దాఖలు చేసినవారి శాతం 88.84 ఉండగా, అది క్రమంగా క్షీణిస్తూ అక్టోబర్ నాటికి 69.69 శాతానికి పడిపోయింది. దీంతో రాష్ట్రంలో జీఎస్టీ కింద నమోదు చేసుకోకుండా జీరో వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా సేవారంగంపై కన్నేయాలని వాణిజ్య పన్నులశాఖ నిర్ణయించింది. జనవరి నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ శాఖకు చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. -
తలుపులు మూసి ఉపన్యాసం
తణుకు: తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపులకు రెండో విడత పెట్టుబడి నిధి రూ. 13.65 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మహిళలను ఉద్దేశించి ఉపన్యసించారు. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ఉండడంతో నీరసించిన మహిళలు బయటకు వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే సమావేశం అయ్యేంత వరకూ కదలడానికి వీల్లేదని స్థానిక నేతలు హుకుం జారీచేశారు. తలుపులు మూసివేశారు. దీంతో చేసేది లేక మహిళలు కూర్చుండిపోయారు. రెండు గంటల తర్వాత ప్రసంగం పూర్తికావడంతో హమ్మయ్య బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. అంతకు ముందు యనమల తణుకు పట్టణంలో రూ. 16 లక్షలతో నిర్మించిన స్వాగత ముఖద్వారం, హౌసింగ్ బోర్డు కాలనీలో స్విమ్మింగ్ పూల్, ఎనిమిదో వార్డులో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవా రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పట్టణంలోని ఎనిమిదో వార్డలో మంత్రులు యనమల, చినరాజప్ప జనచైతన్య యాత్ర మొక్కుబడిగా నిర్వహించారు. వార్డులోని మహిళలను ఒక చోటకు చేర్చి వారితో మాట్లాడారు. అయితే వారికి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే హౌసింగ్బోర్డు కాలనీలో ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్లో నీళ్లు పసర్లు తేలి ఉన్నాయని, ఇలా అయితే ఎలా అని మంత్రి యనమల మునిసిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. పచ్చరంగులో టైల్స్ వేయించారా అంటూ ఛమత్కరించారు. -
రాజకీయాల్లోకి రాకుంటే.. బిజినెస్మేన్ అయ్యేటోణ్ని
- పదేళ్ల పాటు పీడీఎస్యూలో.. - ఉద్యమ సహచారిణితో పెళ్లి - విప్లవ సినిమాలంటే ఇష్టం.. ఓ పది చూసుంటా.. - చిన్నప్పుడే శ్రీశ్రీ సభకు పోయినా - టెన్త్ క్లాస్లోనే జైలు కెళ్లినా - పన్నెండేళ్ళుగా తీరిక లేదు - రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరో తరగతిలోనే ఆయన పిడికిలెత్తాడు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ, అణిచివేత, అన్యాయాల్ని ఎదురించే ఉద్యమాలే పాఠాలుగా చదువుకున్నాడు. చీకటి రోజుల్లోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గొంతెత్తాడు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పోరుకు నడుం బిగించి పదో తరగతిలోనే జైలుకెళ్లాడు. పదేళ్లపాటు పీడీఎస్యూకు తిరుగులేని సారథ్యం వహించాడు. వామపక్ష పార్టీల చీలికలు పేలికలతో ఉద్యమబాట వీడాడు. సొంతంగా కోళ్ల పరిశ్రమను స్థాపించి కొత్త జీవితం ఆరంభించాడు. ఆరేళ్లపాటు పౌల్ట్రీ రంగం.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష.. టీఆర్ఎస్ నేతలతో ఏర్పడ్డ పరిచయాలు.. ఆయనను రాజకీయాల్లోకి రప్పించాయి. అదీ మొదలు తెలంగాణ ఉద్యమం ఆద్యంతం అనిర్వచనీయమైన పాత్ర పోషించారు. కేసీఆర్కు కుడి ఎడమ భుజంగా.. టీఆర్ఎస్ కార్యకలాపాలన్నింటా నమ్మినబంటుగా ఎదిగారు. వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినరికార్డును సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖకు సారథ్యం వహిస్తున్నారు. ఆయనే మంత్రి ఈటెల రాజేందర్. సాదాసీదాగా.. సౌమ్యునిగా.. అందరికీ అందుబాటులో ఉండే ఉద్యమనేతగా పేరుతెచ్చుకున్న ఈటెల ఇన్నర్వ్యూ ఈవారం ‘సాక్షి’ సండేస్పెషల్ ఈటెల రాజేందర్ పుట్టిన తేది : 1964 మార్చి 20 తల్లిదండ్రులు : ఈటెల మల్లయ్య-వెంకటమ్మ అన్న, తమ్ముడు : సమ్మయ్య, భద్రయ్య అక్కాచెల్లెళ్లు : అమృతమ్మ,నీలమ్మ,పూలమ్మ, శోభ, సుజాత విద్యార్హతలు : బీఎస్సీ భార్య : జమున, కుమారుడు నితిన్,కూతురు నీత ‘సదువంతా హాస్టల్. బతుకంతా ఘర్షణ. నిరంతరం ఉద్యమం.. పోరాటం. చిన్నప్పుడు నా ఇల్లే ఓ చిన్నపాటి లైబ్రరీ. ఎన్నో పుస్తకాలు. పన్నెండేళ్లుగా క్షణం తీరిక లేదు. ఒక్క పుస్తకం సదువలేదు. నిత్యం ఉద్యమాలు. రాజకీయాలు. ప్రజా జీవితంలోనే ఉన్నా. వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు.. ఆశయాలు.. నమ్ముకున్న సిద్ధాంతాలు.. ఇప్పుడవి నెరవేరుతాయా.. అంటే చెప్పలేను కానీ.. నాకైతే నమ్మకముంది. ఉద్యమాల ద్వారా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలకు ప్రజాకోణం ఉంటుంది. టీఆర్ఎస్కు అదే ప్రజాకోణం ఉంది. అందుకే ప్రజల ఆకాంక్షలు ఫలిస్తాయనే నమ్మకం నాకుంది..’ - ఈటెల రాజేందర్, ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి అన్నయ్యే స్ఫూర్తి ఊళ్లలో దొరతనం.. భూస్వామ్య పెత్తందారీ రాజ్యం.. అణిచివేత.. అన్యాయం.. అంటరానిత నం.. పేదరికం.. అవన్నీ నేను పుట్టి పెరిగిన పరిసరాలు. అందుకే చిన్నప్పటి నుంచే ఉద్యమబాట ఎంచుకున్నాను. నాకంటే వయసులో ఎనిమిదేళ్లు పెద్దయిన మా అన్న సమ్మయ్య అప్పటికే ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన టీచర్. అతనే నాకు స్ఫూర్తి. బాలసంఘా లు.. రాత్రి పాఠశాలలు.. ఊరి బాగోతాలు.. ఇవ న్నీ ఉద్యమంలో నా తొలి రోజులు. ఇంట్లో అమ్మానాన్నలకు తెలిసేది కాదు. ఇప్పుడు అమ్మ లేరు. మా నాన్నకు 95 ఏళ్లు. ఇంటి దగ్గరే ఉంటున్నారు. మేం తొమ్మిది మంది సంతానం. అయిదుగురు అక్కాచెల్లెళ్లు. ముగ్గురు అన్నాదమ్ముళ్లం ఉన్నాం. ఫస్ట్ గజ్వేలే.. పౌల్ట్రీ బిజినెస్లో ఉన్నప్పుడే స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ అవసరాలకు నావంతుగా సహాయ సహకారాలు అందించేటోన్ని. అప్పుడు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దేశ్పాండే రాధాకృష్ణ రాజకీయాల్లోకి రావాలని నన్ను ప్రోత్సహించారు. 2002లో పార్టీలో చేర్పించి కేసీఆర్కు పరిచయం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో వ్యాపారరీత్యా స్థిరపడటంతో అక్కణ్నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నా. అది రిజర్వుడు సెగ్మెంట్ కావటంతో కమలాపూర్ నుంచి పోటీకి దింపారు. మొదటిసారి పోటీ చేసేటప్పుడు సొంత నియోజకవర్గంతో నాకు పరిచయాలేమీ లేవు. పదో తరగతిలోనే.. చిన్నప్పుడే ఊరి నుంచి వెళ్లిపోవటంతో విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే సాగింది. డిగ్రీ వరకు హాస్టల్ చదువులే. కేశవ్ మెమోరియల్ స్కూళ్లో పదో తరగతి. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్. సైఫాబాద్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివాను. పదో తరగతిలో ఉన్నప్పుడే జైలుకెళ్లాను. మేం యాకుత్పురా హాస్టల్లో ఉన్నప్పుడు స్కాలర్షిప్ రూ.40. విద్యార్థులకు రోజుకు రూ.1.33 భోజన ఖర్చులకు చెల్లించేది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు అన్నీఇన్నీ కావు. కాలేజీల్లో, హాస్టళ్లలో సీటు దొరకటమే కష్టం. అప్పుడు చేపట్టిన ఆందోళనలు ఇప్పటికీ మరిచిపోలేను. అడ్మిషన్లు, క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తాను. అప్పుడు జైలుకెళ్లాల్సి వచ్చింది. అదీ మొదలు.. ఇంటర్లో రెండుసార్లు... డిగ్రీలో ఓసారి... 1986 నుంచి 1996 వరకు వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు నాలుగుసార్లు జైలుకెళ్లాను. ఇంటర్లో ఉన్నప్పుడే పీడీఎస్యూకు ఆలిండియా జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టాను. తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్, కరీంనగర్లో రెండుసార్లు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేను.. మంత్రిని కాకుంటే... పౌల్ట్రీ బిజినెస్మేన్ గా ఉండేటోన్ని. 2002లో టీఆర్ఎస్లో చేరాను. చిన్నప్పుడు ఉద్యమకారునిగా ఉండిపోవాలని అనుకున్నాను. చీలికలు పేలికలతో వామపక్ష పార్టీలు తలోదిక్కు అయ్యాయి. అందుకే ఉద్యమబాటను వీడాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి రాకుంటే బిజినెస్మేన్గా ఉండేటోన్ని. ఉద్యమ సహచరిణి నా సహచరి జమునారెడ్డి. 1989లో పెళ్లి చేసుకున్నాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యమంలో పాలుపంచుకున్నాం. జమునది నల్గొండ జిల్లా పలివెల. వాళ్ల కుటుంబీకులందరితో నాకు మంచి సంబంధాలుండేవి. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు నితిన్. పూణెలో బీబీఏ అయిపోయింది. కూతురు నీతా. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అడుగడుగునా కుటుంబీకుల ప్రోత్సాహం నా వెన్ను తడుతోంది. మరిచిపోలేను కమలాపూర్లో ఆరో తరగతి చదివే రోజులు. అప్పుడు ఎమర్జెన్సీ. చీకటి రోజులు. గొంతెత్తితే జైళ్లో పెట్టే రోజులు అవి. అప్పుడే మా స్కూల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాను. మాటల్లోనే చీల్చి చెండాడాను. ఇప్పటికీ ఆ సంఘటన మరిచిపోలేను. 1973లో హుజూరాబాద్లోని కాలేజీ గ్రౌండ్లో శ్రీశ్రీ మీటింగ్ పెట్టాడు. శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమకాలం. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై జనాన్ని తట్టి లేపేందుకు నిర్వహించిన ఆ సభను చూసేందుకు మా ఊరి నుంచి అక్కడి దాకా వెళ్లాను. మా అన్న ఇంటర్మీడియట్ చదివే రోజులవి. అప్పుడు నేను ఇంకా స్కూల్ పిల్లగాణ్నే. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలప్పుడు చిన్నపిల్లలం. అప్పుడు ప్రచారం చేస్తున్న జనతా పార్టీకి డబ్బుల్లేవు. అప్పుడే జనతా పార్టీ తరఫున ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రచారానికి మేం బూట్లు పాలిష్ చేశాం. అదొక్కటే బాధ వామపక్ష పార్టీలు చీలికలు.. పేలికలుగా విడిపోయిన సందర్భం నన్ను బాధపెట్టింది. ఆ తర్వాతే పీడీఎస్యూ నుంచి బయటకు వచ్చాను.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement