breaking news
State Department of Agriculture
-
సాగు ఎగుమతుల్లో ఎదిగాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి వ్యవసాయ పంట ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2019–20తో పోలిస్తే 2020–21లో ఎగుమతులు బాగా పెరిగాయి. 2019–20లో మొత్తం రూ. 2,692.15 కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు వెళ్లగా 2020–21లో రూ. 4,180 కోట్ల మేర ఎగుమతి అయ్యాయి. మొత్తంగా పంట ఉత్పత్తుల ఎగుమతుల్లో చిన్న, పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో 14వ స్థానంలో తెలంగాణ నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దేశం నుంచి కూడా వ్యవసాయ ఎగుమతులు 2019–20తో పోలిస్తే 2020–21లో 34.86 శాతం పెరిగాయి. 2019–20లో 1.55 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా 2020–21లో ఇవి 2.10 లక్షల కోట్లకు పెరిగాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల 2020లో వ్యవసాయ ఎగుమతులపై ప్రభావం పడింది. కంటైనర్లు అందుబాటులో లేకపోవడం, రవాణా ఖర్చు పెరగడం, లాక్డౌన్ వల్ల సరఫరాలో అంతరాయం లాంటి పరిస్థితులు ఎదురైనా ఎగుమతులు పెరగడం విశేషం. పండ్లు, కూరగాయలు డీలా.. రాష్ట్ర ఎగమతుల్లో సుగంధ ద్రవ్యాలు (స్పైసెస్) ముందున్నాయి. ఇక్కడి పసుపు, మిర్చి తదితర సుగంధ ద్రవ్యాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. 2020–21లో రూ. 1,464 కోట్లు ఇవే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో రాష్ట్రంలో బాగా పండే పత్తి ఉంది. ఇక్కడి నుంచి రూ.1,056 కోట్ల విలువైన పత్తి విదేశాలకు ఎగుమతి అయింది. చైనా వంటి దేశాలకు ఇక్కడి పత్తి వెళ్తుంటుంది. ఆ తర్వాత రూ. 911 కోట్ల విలువైన బియ్యం (బాస్మతి కాకుండా) ఎగుమతి చేశారు. పండ్ల ఎగుమతి మాత్రం గతంతో పోలిస్తే తగ్గింది. 2019–20లో రూ. 41.99 కోట్ల విలువైనవి ఎగుమతి కాగా, 2020–21లో రూ. 15.67 కోట్లే ఎగుమతి అయ్యాయి. అలాగే 2019–20లో రూ. 33.34 కోట్ల విలువైన కూరగాయలు ఎగుమతి కాగా 2020–21లో రూ. 10.77 కోట్ల విలువైనవే విదేశాలకు వెళ్లాయి. పండ్లు, కూరగాయలు త్వరగా పాడై పోయే గుణం కలిగి ఉండటం, కరోనా కాలంలో రవాణా ఎక్కువ రోజులు తీసుకోవడంతో ఎగుమతులు తగ్గినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
- గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబు - ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి గుంటూరు క్రైం : స్వాతంత్య్ర వేడుకలకు గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబయింది. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వేదికతోపాటు, పోలీస్ గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు, అతిథులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మించిన శకటాలను మైదానంలో సిద్ధంగా ఉంచారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్యెల్యేలు, కలెక్టర్,ఎస్పీలు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చే శారు. వీఐపీల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.ఏర్పాట్లను అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ బి.సత్యనారాయణ, తహశీల్దారు టి. మోహన్రావు వున్నారు.