breaking news
sri ramachandra
-
పాన్ ఇండియా సింగర్ అవ్వాలని నా టార్గెట్..
-
హంసవాహనంలో రామయ్య జల విహారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రగిరిపై కొలువైన వైకుంఠ రాముడు గోదావరి నదిలో జలవిహారం చేశారు. హంసవాహనంలో సీతాసమేతుడై జలవిహారం చేస్తున్న రామయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తర లివచ్చారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం నిర్వ హించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుప్పావై సేవాకాలం, మూలవర్లకు అభిషేకం, వేద పారాయణం, ప్రబంధ పాశుర పఠనం.. తదితర కార్యక్రమాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం దర్బారు సేవ అనంతరం ప్రత్యేక పల్లకిలో సీతాసమేత రామచంద్రస్వామిని మేళతాళాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ హంసాకృతిలో అలంకరించిన పడవలో సీతారాములను వెంచేపు చేసి, ఆగమ శాస్త్ర పద్ధతి లో షోడశోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు హంస వాహనంలో స్వామివారి జలవిహారం ప్రారంభమైంది. ఒక్కో పరిక్రమణాని కి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కనుల విందుగా వేడుకను నిర్వహించారు. రాత్రి 7:01 గంటలకు ఐదు పరిక్రమణాలతో తెప్పోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కా గా, భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ప్రేమలో పడితే...
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రను హీరోగా పరిచయం చేస్తూ శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ఆర్వీ సుబ్బు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తుండటం విశేషం. అలాగే ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీ హండ కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పాటలను, అక్టోబర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమంటే పడని ఓ యువకుడు ప్రేమలో పడ్డ తర్వాత తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనేది ప్రధానాంశం. కొత్త కోణంలో ఉండే ప్రేమ కథ. ప్రేమ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. మణిశర్మ స్వరపర చిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్రెడ్డి, జగదీష్, ఆర్ట్: కె.వి.రమణ.