breaking news
Sreelekha
-
సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ
‘‘నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను. రాయల్టీ రూపంలో ఏమీ సంపాదించలేదు. 2012లో రాయల్టీ గురించి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి ముందు నాకు వచ్చిందేమీ లేదు. ఇప్పుడు రాయల్టీ అనేది సింగర్స్ హక్కు. దీని కోసమే ‘ఇస్రా’ కృషి చేస్తోంది. అర్హులందరూ ఇందులో సభ్యులుగా చేరాలి’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్’ (ఇస్రా) ఆధ్వర్యంలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఈ సంస్థ బుధవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ముఖ్య అతిథి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ –‘‘ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2 వేలు చెల్లించి ‘ఇస్రా’లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పటికి 410 మంది సభ్యులున్నారు. గాయనీగాయకులకు భాషతో సంబంధం లేదు. నన్ను, ఏసుదాస్గారిని ఏ భాషవాళ్లంటే ఏమని చెబుతారు? రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయాలు వద్దు. రాయల్టీ వద్దని గతంలో ఎవరైనా సంతకాలు చేసినా అవి ఇప్పుడు చెల్లవు. సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ రూపంలో ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. సినిమా, జానపదాలు, గజల్, ఆధ్యాత్మిక, క్లాసికల్ పాటలు పాడిన వారందరూ రాయల్టీ పొందడానికి అర్హులే’’ అన్నారు. ‘ఇస్రా’ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్లో ఒకరైన సంజయ్ టాండన్ మాట్లాడుతూ– ‘‘ఇంతకు మునుపు ఉన్న ఐపీఆర్యస్కు.. ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ వల్ల వారి ఆదాయానికి నష్టం ఉండదు. ప్రస్తుతం స్టేడియమ్లలో సీటుకు రూ. 1.60 చొప్పున వసూలు చేస్తున్నాం. డిమాండ్ని బట్టి భవిష్యత్తులో పెరగొచ్చు, తగ్గొచ్చు. రాయల్టీ విషయమై యు.యస్, యు.కె., బ్రెజిల్తో మాట్లాడాం. ఇటీవల బ్రెజిల్ నుంచే మాకు రూ.40 లక్షలు వచ్చాయంటే మన సంగీతానికి అక్కడున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇప్పటిదాకా 2016లో రూ.51లక్షలు, 2017లో రూ. 1.2కోట్ల రాయల్టీ వసూలు చేసి అందజేశాం. సభ్యులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అందిస్తున్నాం. మృతిచెందిన గాయనీగాయకుల రాయల్టీని వారసులకు అందిస్తాం’’ అన్నారు. ఆర్.పి.పట్నాయక్, శ్రీలేఖ, వేణు, కౌసల్య, కేఎం రాధాకృష్ణన్, సింహా తదితర సింగర్స్ పాల్గొన్నారు. -
అకౌంట్లో డబ్బు మాయం.. నటి ఫిర్యాదు
ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఓ ఫైనాన్సియల్ కంపెనీ మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు. తన అకౌంట్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా 1.18 లక్షల రూపాయల డబ్బును మరో అకౌంట్కు ట్రాన్స్పర్ చేసినట్టుగా గుర్తించిన శ్రీలేఖ సదరు ఫైనాన్సియల్ కంపెనీపై కస్బా పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు గతంలో శ్రీలేఖ అదే ఫైనాన్సియల్ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. అయితే శ్రీలేఖ ఆ లోన్ తిరిగి చెల్లించనట్టుగా చెపుతున్నా.. ఆలోన్ కోసమే నెలకు 6000 రూపాయలు ఫైనాన్సియల్ కంపెనీ శ్రీలేఖ బ్యాంక్ అకౌంట్ ను డెబిట్ చేసినట్టుగా గుర్తించారు. -
సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారికి వేధింపులు
త్రివేండ్రం: కేరళకు చెందిన సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి శ్రీలేఖ ఆర్.. సహచర అడిషనల్ డీజీపీ ర్యాంక్ అధికారిపై సంచలన ఆరోపణలు చేశారు. కేరళ ట్రాన్స్పోర్ట్ అడిషనల్ డీజీపీ తొమిన్ జే తంచన్గెరీ తనను 29 ఏళ్లుగా వేధిస్తున్నారని శ్రీలేఖ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బస్ కుంభకోణం కేసు విజిలెన్స్ విచారణలో శ్రీలేఖ పేరు చేర్చిన తర్వాత తొమిన్పై ఆరోపణలు చేశారు. కేరళ ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ప్రైవేట్ బస్సులకు శ్రీలేఖ పర్మిట్లను మంజూరు చేశారని కేసు నమోదైంది. ఈ బస్ కుంభకోణంపై విజిలెన్స్ కోర్టు విచారణ ప్రారంభించింది. అయితే ఈ కుంభకోణంలో తన పాత్ర లేదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు తొమిన్ కుట్రపన్ని కేసులో ఇరికించారని శ్రీలేఖ ఆరోపించారు. కాగా శ్రీలేఖ చేసిన ఆరోపణలు నిరాధారమని తొమిన్ తోసిపుచ్చారు.