breaking news
specific services
-
భారత్ పన్నుల రాజేమీ కాదు
న్యూఢిల్లీ: భారత్ టారిఫ్ల విషయంలో కింగ్ (రాజు) ఏమీ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ దిగుమతుల సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయన్న అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతూ... అభివృద్ధి చెందిన జపాన్, దక్షిణ కొరియా, ఈయూ, అమెరికా సైతం అధిక టారిఫ్లను వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు మోపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ ఆరోపిస్తున్న విషయం గమనార్హం. ‘‘అమెరికా ఆరోపణలు పూర్తిగా అసత్యం. అమెరికాలో పొగాకు దిగుమతులపై 350 శాతం, వేరుశనగలపై 164 శాతం టారిఫ్లు ఉన్నాయి. వారు సైతం సహేతుక స్థాయిలో అధిక టారిఫ్లను నిర్వహిస్తున్నారు’’ అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) ప్రొఫెసర్ రాకేశ్ మోహన్ జోషి సైతం ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణలు సరైనవి కావని, అభివృద్ధి చెందిన దేశంగా ముందు తన డ్యూటీలను క్రమబద్ధీకరించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడేది వాస్తవాలు కాదని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మోహిత్సింగ్లా పేర్కొన్నారు. ‘భారత్ కంటే అధిక టారిఫ్లను అమలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై జపాన్ 736 శాతం, దక్షిణ కొరియా 807 శాతం టారిఫ్లు విధిస్తున్నాయి’ అని సింగ్లా చెప్పారు. -
కళారంగానికి కళాకౌముది విశిష్టసేవలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి రాజంపేట : రాజంపేట పట్టణంలో కళారంగానికి కళాకౌముది సేవా సంస్థ విశిష్ట సేవలందించిదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి గుర్తు చేశారు. శనివారం రాత్రి స్థానిక కాకతీయ విద్యాసంస్థ కళావేదికలో కళా కౌముది సంస్థ అధ్యక్షుడు పోలా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సంస్థ 24వ వార్షికోత్సవం సభకు ఆకేపాటి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992లో కళా కౌముది సంస్థ వివిధ రకాలుగా కళ,సాహిత్య రంగాలను పెంచి పోషించే విధంగా ముందుకు నడిచిందన్నారు. కళాకౌముది సంస్థ అంటే గుర్తుకొచ్చేది దివంగత టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఆకేపాటి చెంగల్రెడి అని పేర్కొన్నారు. కళాకౌముది సంస్థను చెంగలరెడ్డి స్థాపించారని, నేటికీ ఆ సంస్థ తన మనుగుడ విషయంలో రాజీ పడకుండా ముందుకువెళుతోందని పేర్కొన్నారు. తాను ఈ సంస్థ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆకేపాటి రజనీకాంత్రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థ సభ్యుల సహకారంతో 24యేళ్లపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వీడన్ ప్రొఫెసర్ ఆకేపాటి వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థను దిగ్విజయంగా నిర్వహించడంలో సమష్టి కృషి దాగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు, కాకతీయవిద్యాసంస్థల అధినేత పోలా శ్రీనివాసులరెడ్డి , పీ.రాధాకృష్ణారెడ్డి, ప్రముఖ వైద్యుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు మలిశెట్టి సుబ్బరాయుడు, కార్యదర్శి ఎన్.శివరాజు, పర్యవేక్షకుడు దరూరి హరినాధ్చౌదరి, పట్టణానికి చెందిన కెఎంఎల్ నరసింహులు, పాపినేని విశ్వనాధరెడ్డి, డీలరు సుబ్బరామిరెడ్డి, రాఘవరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తెలుగుభాష సంరక్షణసమితి ప్రతినిధులు కాకర్లరాముడు, గంగనపల్లె వెంకటరమణ, విద్యాన్ చిన్నయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం యుపీ రాయుడు కళాబృందంచే అద్భుత ఇంద్రజాల ప్రదర్శన, హాస్యవల్లరి వేణుగోపాల్ చే నిర్వహించి కార్యక్రమం సభికులను అలరించింది. శ్రీచక్ర యూపీ స్కూలు, సరస్వతీ విద్యామందిర్, చక్రశుభ నివాస్ స్కూల్ విద్యార్థుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.