-
చిత్తు కాగితాల సుందర చిత్రం
ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అక్కర్లేని... చిత్తుకాగితాలు స్లమ్స్. ఆ కాగితాలను అందమైన పువ్వులుగా సీతాకోకచిలుకలుగా, పిల్లల నవ్వుల్లా కొత్తగా సింగారిస్తోంది రూబుల్నాగి. కాశ్మీర్లో పుట్టిన రూబుల్ నాగి లండన్లో పెరిగింది. అక్కడే చదువుకుంది. శిల్పాలు, ఆర్ట్ ఇన్స్టాలేషన్లో ప్రత్యేకత కలిగిన ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కళతో సమాజాన్ని మార్చాలన్నది ఆమె కల. అందుకు తగినట్టుగానే రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ చేస్తోంది. ఎక్కడో కాదు భారతదేశంలో చిత్తుకాగితాలుగా పరిగణించే స్లమ్స్ని ఆమె తన కాన్వాస్కు వాడుకుంది. స్లమ్స్ కలర్ఫుల్ దేశమంతా తిరిగి పిల్లల కోసం వర్క్షాప్లు నిర్వహిస్తున్న ఆమె ‘రూబుల్ నాగి’ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రూబుల్ జనవరి 2018 నుంచి ‘మిసాల్ ముంబై’ పేరుతో ధారవి మురికి వాడలను పెయింటింగ్ తో అలంకరిస్తోంది. ఇప్పటివరకు 30 మురికివాడల్లోని 1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది. గోడలపై చిత్రాలను రూపొందించింది. తన పెయింటింగ్తో స్లమ్స్ రూపురేఖలను మార్చుతోంది 40 ఏళ్ల రూబుల్ నాగి. కళతో కనెక్ట్ కళకోసమే జీవితాన్ని అంకితం చేసిన రూబుల్ రెండు దశబ్దాలలో 800 శిల్పాలు, లెక్కలేనన్ని చిత్రాలను రూపొందించింది. 62 కిండర్ గార్టెన్లను కూడా నడుపుతోంది. తద్వారా పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. రూబుల్ నాగి సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఆమె తన కళను ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా భావిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను లేవనెత్తడానికి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు సహాయపడే మార్గం ఇది’ అని చెప్పే రూబుల్ పెయింటింగ్స్తో సామాన్య ప్రజలూ ప్రేరణ పొందుతుంటారు. ఆమె పెయింటింగ్స్ విద్య, మహిళా సాధికారత, ఉపాధి వంటి సమస్యలను చర్చిస్తాయి. అదే సమయంలో ఆమె వర్క్షాప్లో మురికివాడల ప్రజలు పరిశుభ్రత గురించీ తెలుసుకుంటారు. కొత్త శక్తి దిశగా! రూబుల్ ఆలోచన గొప్పదనం తెలుసుకోవాలంటే ఆమెతో కాసేపు ముచ్చటించాలి. ‘ఈ ఇళ్ళపై నేను పెయింట్ చేసిన రంగులు కొన్ని ఏళ్ల తరువాత మసకబారుతాయి. కానీ ఈ రంగులు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. అవి వారికి ఎల్లప్పుడూ కొత్త శక్తిని ఇస్తాయి’ అంటుంది అంటోంది ఈ చిత్రకారిణి. రూబుల్ ఇప్పటివరకు రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్రతో పాటు పెయింటింగ్ ద్వారా ముంబై మురికివాడలను అభివృద్ధి చేసింది. చేస్తోంది. ఆమె పెయింటింగ్స్ను కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతప్రభుత్వం, మ్యూజియమ్లతో సహా ఎంతో మంది సేకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో మురికివాడలకు ప్రాణం పోస్తోంది రూబుల్ నాగి. మహిళలతో రూబుల్ నాగి -
మురికివాడలను పీపీపీ మోడల్గా తీర్చిదిద్దుతాం
తిరుపతి స్కావెంజర్ కాలనీలో మొదటి ప్రాజెక్టు ప్రారంభం మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు(మినిబైపాస్): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మురికివాడలను అత్యంత సౌకర్యవంతమైన కాలనీలుగా మార్చే ప్రక్రియకు త్వరలో శ్రీకారంచుట్టనున్నామని మంత్రి నారాయణ శుక్రవారం నెల్లూరులో వెల్లడించారు. స్థానిక బారాషాహిద్ దర్గాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఏరియాలను అభివృద్ధి చేయడం కన్నా ఇదివరకే ఉన్న స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేయడం సులభమన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మురికివాడలను పీపీపీ మోడల్గా తీర్చిదిద్దుతామని, తొలి ప్రయత్నంగా తిరుపతిలోని స్కావెంజర్ కాలనీని అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతమైన కాలనీగా మార్చనున్నామని మంత్రి తెలిపారు. తిరుపతిలో ఉన్న స్లమ్ మున్సిపల్ పరిధిలో ఉందని, మొదటగా వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించి, 6 అంతస్తుల మిద్దెలను ఏర్పాటు చేసి స్లమ్ ఏరియాలో ఉన్న వారందిరికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు. ముంబై కార్పొరేషన్లో ఏ విధంగా అయితే పీపీపీ మోడల్ ఇళ్లను నిర్మించారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. నవంబరు ఆఖరులోపు టెండర్లను పిలుస్తామన్నారు. తిరుపతిలో ఐదున్నర ఎకారాల స్థలంలో అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరులో కూడా ఐదున్నర ఎకరాల స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని అన్నారు. బిల్డర్ల సహాయంతో నిర్మిస్తామని, ఒక్క పైసా కూడా స్లమ్లో ఉన్న వారు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నూనె మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement