breaking news
six million people
-
6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు
సీఎం లక్ష ఇళ్లే క ట్టిస్తామని చెబుతున్నారు: బీజేపీ ఎమ్మెల్యే చింతల సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్లకోసం ఆరు లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారని, ముఖ్యమంత్రి మాత్రం లక్ష ఇళ్లే క ట్టిస్తామని చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కట్టిస్తానన్న లక్ష ఇళ్లకైనా బడ్జెట్లో నిధులు కే టాయించారా? అంటే.. ఎక్కడా ఆ ప్రస్తావనే లేదన్నారు. తాజా బడ్జెట్లో కూడా రూ.30 వేల కోట్ల లోటు తప్పదన్నారు. డబుల్ బెడ్రూంల విషయమై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. లక్ష ఇళ్లు 100శాతం సబ్సిడీపై ప్రభుత్వం నిర్మిస్తుందని, కొంత వ్యయాన్ని భరించగలిగిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో రెండు రకాలుగా ఇళ్లు నిర్మిస్తామన్నారు. -
ఆరు లక్షల మందికి పల్స్పోలియో
వేలూరు, న్యూస్లైన్:వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఆరు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యశాఖ మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రభుత్వ ఆస్పతిలో కలెక్టర్ నందగోపాల్ అధ్యక్షతన మంత్రి కేసీ వీరమణి పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల 73,971 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకుగాను 2216వ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 9,157 మంది సిబ్బంది, 305 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఆదివారం చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం వైద్య సిబ్బందిచే మూడు రోజుల పాటు ఇంటింటికి వెల్లి చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అస్లాంబాషా, మున్సిపల్ చైర్మన్ సంగీత పాల్గొన్నారు. అలాగే వేలూరు పెడ్లాండ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ విజయ్, మేయర్ కార్తియాయిని పోలియో చుక్కలను వేశారు. వీరితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో జిల్లాలో రెండు లక్షల 28,069 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు కలెక్టర్ జ్ఞానశేఖరన్ తెలిపారు. ఇందుకోసం 1,885 పోలియో కేంద్రాలు, 866 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్ పోలియో చుక్కలను కలెక్టర్ ప్రారంభించారు. అలాగే సెయ్యారు ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి ముక్కూరు సుబ్రమణియన్ పల్స్ పోలియోను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధి కారులు పాల్గొన్నారు.