breaking news
Siran
-
స్టార్ హీరో నెవ్వర్ బిఫోర్ లుక్.. గ్లింప్స్ అదిరింది!
తమిళ హీరో జయం రవి కొత్త సినిమా 'సైరన్'. మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంతో ఆంటనీ భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంతకు ముందు ఈ డైరెక్టర్.. అభిమన్యుడు, విశ్వాసం, హీరో చిత్రాలకు కథ సహకారం అందించాడు. ఇకపోతే జయం రవి పుట్టినరోజు కానుకగా ఆదివారం 'సైరన్' ప్రీ ఫేస్ వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఈ సినిమాలో జయం రవి సరసన కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాల్ట్ పెప్పర్ లుక్తో ఓ బల్లపై కూర్చుని టీ తాగుతున్న జయం రవి ఫొటోను పోస్టర్గా కాకుండా చిన్న వీడియోగా విడుదల చేశారు. భారీ బడ్జెట్తో తీస్తున్న 'సైరన్' సినిమాని యాక్షన్ కిల్లర్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా వివరాలని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే) -
యుద్ధ సైరన్ల మధ్య ప్రియురాలికి ప్రపోజ్: వీడియో వైరల్
Heartbreaking visuals from war-battered Ukraine: ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో వేలాది మంది సైనికులు నెలకొరిగారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భయానక యుద్ధం ఉక్రెయిన్ని శిథిలా నగరంగా మార్చింది. ఎటూ చూసిన శవాల దిబ్బ మరోవైపు సైన్యం కొరత ఏర్పడిన ఏ మాత్రం వెరకవక రష్యాతో పోరాడుతోంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి యుద్ధానికి సిద్ధమవుతూ ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఈ మేరకు సదరు వ్యక్తి మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. ఆ వ్యక్తి యుద్ధా సైరన్లు నడుమ ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. యుద్ధం కారణంగా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని తరుణంలో ఇలా ప్రపోజ్ చేశాడు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సంరక్షకుడు. గెరాష్చెంకో అనే వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...అతను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారుడని చెబుతాడు. అంతేకాదు ఈ వీడియోకి ఇప్పుడూ "మా జీవితం యుద్ధ జీవిత సమతుల్యత" అని ఒక క్యాప్షన్ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. హృదయ విదారకరమైన విషయం ఏమిటంటే ఒక పక్కా ఆనందకరమైన క్షణం మరోవైపు సైరన్ల మోత ఏడుపు తెప్పించేలా ఆవేదనగా ఉంటుంది. అయినప్పటికీ మిగతా సంరక్షక్షులు ఆ జంటను సంతోషంగా ఉండండి అంటూ.. ఉత్సహపరుస్తారు. This is our life now - we joke about "war-life balance". This rescuer was saving people, now he is proposing. The siren wails for danger, now it sounds in joy. It is all intertwined, and no one's life is untouched by war in Ukraine. pic.twitter.com/Bzh2nG7VjQ — Anton Gerashchenko (@Gerashchenko_en) July 29, 2022 (చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు) -
బుగ్గ తీశారు!
► స్వయంగా తొలగించిన సీఎం ఎడపాడి పళనిస్వామి ► అదే బాటలో మంత్రులు ► అందరికీ ఆదేశాలు ► సచివాలయంలో పళని బిజీ ► నీట్ మినహాయింపునకు లేఖ బుగ్గల సంస్కృతికి స్వస్తి పలుకుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తన వాహనంపై ఉన్న సైరన్ను స్వయంగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తొలగించారు. మంత్రులు అదే బాటలో ముందుకు సాగారు. అధికారులందరి వాహనాల్లో త్వరితగతిన తొలగించాలన్న ఆదేశాలను సీఎం జారీ చేశారు. ఇక, సీఎంగా పగ్గాలు చేపట్టి గురువారంతో రెండు నెలలు కావడంతో సచివాలయంలో పళనిస్వామి బిజీ అయ్యారు. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఇక వీఐపీ, వీవీఐపీ అన్న సంస్కృతికి చోటు లేదన్నట్టుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీఐపీ సంస్కృతిని సూచించే రీతిలో వాహనాల్లో ఉండే ఎర్ర బుగ్గలు(సైరన్) మే ఒకటి నుంచి ఉండబోవని కేంద్రం చేసిన ప్రకటనతో తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి తక్షణం స్పందించారు. గురువారం ఉదయం సచివాలయంలోకి రాగానే, తన వాహనంపై ఉన్న బుగ్గను సీఎం తొలగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను స్పందించానని పేర్కొన్నారు. తన మంత్రులు వారి వారి వాహనాలపై బుగ్గలను తొలగించేందుకు నిర్ణయించారని, కొందరు తొలగించేశారని, మిగిలిన వారు త్వరితగతిన తొలగిస్తారని వివరించారు. అధికారులు అందరూ త్వరితగతిన తమ తమ వాహనాలపై బుగ్గలను తొలగించాలన్న ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నా, తమఅమ్మ, దివంగత సీఎం జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఎర్రబుగ్గ సైరన్ వాహనాన్ని ఉపయోగించ లేదన్న విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సీఎం బిజీ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గురువారంతో పళనిస్వామికి రెండు నెలలు అయింది. అందుకే కాబోలు సచివాలయంలో బిజిబిజీ అయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి సచివాలయం వైపుగా సీఎం పెద్దగా దృష్టి పెట్టలేదు. అడపాదడపా కార్యక్రమాలకు హాజరైనా, తాజాగా మాత్రం రోజంతా బిజీగానే ఉండడం గమనార్హం. బల నిరూపణలో నెగ్గిన అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పళనిస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. తొలి సంతకంగా 500 టాస్మాక్ల మూత, అమ్మ పథకాల అమలు మీద దృష్టి పెట్టారు. ఈ రెండు నెలల కాలంలో మొత్తంగా ఆయన 1,520 ఫైల్స్ మీద సంతకాలు పెట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్టు, ఆరు వందల వరకు గతంలో ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ వ్యవహారాల మీద తొలి వారం పది రోజుల్లో తీవ్ర దృష్టి పెట్టినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నగారాతో ఆయన పనితీరు కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అందుకే పాలనా పరంగా ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాన ప్రతి పక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. సీఎం సాయం : మంత్రులు, అధికారులతో వారి వారి శాఖల్లోని కేటాయింపులు, పనుల గురించి సీఎం సుదీర్ఘంగానే చర్చల్లో మునిగారు. తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జరిగిన కేటాయింపులు, సాగుతున్న పనుల్ని సమీక్షించారు. అలాగే, వివిధ కారణాలు, ప్రమాదాల్లో మరణించిన విధి నిర్వహణలో ఉన్న పోలీసులు 14 మంది కుటుంబాల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ఆర్మీలో సేవల్ని అందిస్తూ, వాహన ప్రమాదంలో మరణించిన తూత్తుకుడి జిల్లా ములక్కాడుకు చెందిన గుణశేఖరన్ కుమారుడు ముత్తుచందన్ మృతికి తన సంతాపం తెలియజేశారు. ఆకుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వ సాయంగా రూ.20 లక్షలు ప్రకటించి, తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఇక, నీట్ పరీక్షా సమయం ఆసన్నం అవుతుండడం, తమిళ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళనను పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇక పలువురు వీఐపీల అపాయింట్మెంట్లతో సీఎం బిజీ అయ్యారు. ఇందులో పారాలింపిక్ విజేత మారియప్పన్ తంగవేల్ సీఎంను కలిసి తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ బిరుదును సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ‘నీతి ఆయోగ్’లో పాల్గొనేందుకు తగ్గ పర్యటన కసరత్తులు సాగాయి. ఆమేరకు శనివారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.