Shreyas Seenu
-
10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ సంస్థ శ్రేయాస్ గ్రూప్ తాజాగా మీడియా, స్పోర్ట్స్ తదితర రంగాల్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10,000 మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్రావు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారు శ్రేయాస్ ప్రతినిధిగా చేరి, ఈవెంట్స్, రిటైల్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్లాంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విధానంలో యువత తమ సొంత ప్రాంతాల్లోనే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని శ్రీనివాస్రావు చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా గ్రూప్ హిందీ, పంజాబీలాంటి ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోకి విస్తరిస్తోంది. అలాగే కార్పొరేట్ క్లబ్, ఉత్సవ్ పేరిట ఈవెంట్స్ రంగంలో, ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ద్వారా రియల్టీలోనూ అడుగుపెట్టింది. ఏఐ ఫ్రేమ్స్ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత వీడియో ప్రొడక్షన్ స్టూడియో, ఎనీటైమ్ థియేటర్ అనే వినూత్న వినోద ప్లాట్ఫాంను ప్రారంభిస్తోంది. -
చిన్న చిత్రాలు మరిన్ని రావాలి
– అల్లు అరవింద్ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలు మరిన్ని రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో పదిమందికి పని దొరుకుతుంది. చిన్న సినిమాలు మంచి కథతో తీస్తున్నారు. శ్రేయాస్ శీను, ఫణిలకు సినిమా అంటే ప్యాషన్. చిన్న చిత్రాలు తీసి, సక్సెస్ సాధిస్తున్నారు’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, బాలీవుడ్ టీవీ నటి మహిమా మక్వాన్ జంటగా వేణును దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రేయాస్ శీను, ఫణి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. ఈ చిత్రం ట్రైలర్ను అల్లు అరవింద్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథను దర్శకుడు తనదైన స్కీన్ర్ప్లేతో ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నారు. మా చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రాహుల్, నిర్మాత ‘జెమిని’ కిరణ్, నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్, దర్శకుడు ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తాళ్లూరి ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్: కె.అరుణ్ మోహన్.


