breaking news
Shiva Ramakrishnan Committee
-
శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలి: సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఇవే.. - ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. - రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - అసెంబ్లీ, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. - హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. - ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి. - రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. - ముఖ్యంగా(గుంటూరు-విజయవాడ మధ్య) సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. - విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. - అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమాగ్రాభివృద్ధికి విధివిధానాలను రూపొందించాలి. -
అమరావతిని చుట్టేశారు
అదిగదిగో రాజధాని అంటూ ఓ వైపు చూపించి, మరో వైపు ఉన్న భూములను కారు చౌకగా కొట్టేసిన గత పాలకుల బండారం బట్టబయలవుతోంది. అమాయకపు రైతులను నమ్మించి, బెదిరించి బంగారం లాంటి భూములను కాజేసిన వైనం విస్తుగొలుపుతోంది. అధికారం అండ చూసుకుని బంధువులు, అనుచరుల పేరుతో విచ్చలవిడిగా సాగించిన అనైతిక, అక్రమ లావాదేవీల నిగ్గు తేలుతోంది. రాజధాని పేరుతో గత సర్కారు పెద్దలు సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్ను చూస్తున్న దర్యాప్తు అధికారులు.. ‘అబ్బబ్బబ్బబ్బా.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆప్టర్’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లలో చంద్రబాబు బృందం సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్పై చేపట్టిన సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదులుతోంది. పచ్చ గద్దల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్ట దాఖలు చేసి.. అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో వ్యాపారులు, తన బినామీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరకే భూములు కాజేయడంలో నువ్వా–నేనా అన్న రీతిలో పోటీపడినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి పరిటాల సునీత, మరో మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, చంద్రబాబు కోటరీలో కీలక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం ప్రైవేటు సైన్యంతో రాజధాని ప్రాంతంలో సాగించిన ఆకృత్యాలు, భూ దందాలు, సెటిల్మెంట్లపై సీఐడీ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రాజధాని ప్రాంతంలో భూములను కోడె దూడలా దున్నేయడమూ సీఐడీ విచారణలో బహిర్గతమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్తో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం పరిధిని నిర్ణయించడం.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లింగమనేని సంస్థలు దోచేసిన భూములు.. ఆ సంస్థల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు దక్కిన రహస్య వాటాలపై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. బినామీ పేర్లతో నారాయణ దూకుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే భారీగా భూములు కొనుగోలు చేశారు. తన బంధువు ఆవుల మునిశంకర్ పేరుతో తుళ్లూరు మండలం రాయపూడిలో సర్వే నంబర్ 167/8 లోని 1.18 ఎకరాలను.. ఎకరం రూ.9.44 లక్షల వంతున కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడ్డాక 2015 జూలై 23న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నారాయణ.. తన బావమరిది, నారాయణ విద్యా సంస్థల్లో డైరెక్టర్గా పనిచేస్తున్న రాపూరి సాంబశివరావు పేరుతో రాయపూడిలో 3.54 ఎకరాలు, ఆవుల మునిశంకర్ పేరుతో ఏడు ఎకరాలు, బెంగళూరులో తన విద్యా సంస్థల్లో పని చేసే కోతపు వరుణ్కుమార్ పేరుతో 0.4 ఎకరాలు.. వెరసి 12.12 ఎకరాలను 15 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. మందడంలో ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, కోతపు వరుణ్కుమార్లతోపాటు.. హైదరాబాద్, బెంగళూరుల్లో నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షించే పోతూరి ప్రమీల పేర్లతో 33.43 ఎకరాలను కొనుగోలు చేశారు. లింగాయపాలెంలో ఆవుల మునిశంకర్, పోతూరి ప్రమీల పేర్లతో 8.89 ఎకరాలను 12 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉద్దండరాయుని పాలెంలో పోతూరి ప్రమీల పేరుతో 1.43 ఎకరాలను కొన్నారు. మొత్తమ్మీద ఈ 4 గ్రామాల్లో 57.05 ఎకరాలను బినామీ పేర్లతో నారాయణ కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో సుజనా భూదందా టీడీపీలో నంబర్ టూగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. జాతీయ బ్యాంకులకు రూ.6 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు. బ్యాంకులకు కన్నం వేసి దోచేసిన సొమ్ముతో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కాజేశారు. సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత గుడిమెట్లలో ఎకరం భూమి విలువ రూ.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 కోట్లకుపైగా సుజనా చౌదరి కొట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమను మోసం చేశారని నిలదీసేందుకు యత్నించిన రైతులపై అప్పట్లో ఉక్కుపాదం మోపి, ఆ భూములను 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిగ్గు తేల్చింది. సీఐడీ విచారణలోనూ ఇదే అంశం వెల్లడైంది. కుమారుడి పేరుతో చినరాజప్ప చేతివాటం మాజీ డిప్యూటీ సీఎం.. హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన కుమారుడు నిమ్మకాయల రంగనాథ్ పేరుతో తుళ్లూరు మండలం నేలపాడులో సర్వే నంబరు 59లో ఒక ఎకరం, తన అనుచరుడు జగతా వెంకట గంగాధర్ పేరుతో ఒక ఎకరం.. ఎకరం రూ.మూడు లక్షల చొప్పున 2014 జూన్ 10న కొనుగోలు చేసినట్లుగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆ భూమిని 2014 అక్టోబరు 31న రిజిష్టర్ చేసుకున్నట్లు తేలింది. మిగతా గ్రామాల్లోనూ తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో భూమి కొనుగోలు చేసినట్లు అంచనాకు వచ్చిన సీఐడీ.. ఆ దిశగా విచారణ చేస్తోంది. చంద్రబాబు–లింగమనేని బంధం బట్టబయలు మంగళగిరి మండలం కాజ, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో 636.32 ఎకరాల్లో లింగమనేని రమేష్ భూములు కొనుగోలు చేసి 2014కు ముందే అపార్ట్మెంట్లను నిర్మించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే రాజధాని ఏర్పాటుపై లింగమనేనితో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 30 మధ్య లింగమనేని రమేష్ తన సంస్థ పేరుతో కాజ, కంతేరు గ్రామాల్లో 168 ఎకరాలకుపైగా భూమిని ఎకరం కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకుని 804.32 ఎకరాలకుపైగా భూమిలో ఎస్టేట్ను ఏర్పాటు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలో లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ బొబ్బా శివప్రకాష్ తన డ్రైవర్ బోడెపూడి హరిబాబు పేరుతో రాయపూడిలో సర్వే నంబర్ 369–2లో 0.65 ఎకరాలు, 369–2లో 1.13 ఎకరాలు, 371–2లో 0.65 ఎకరాలు.. మొత్తం 2.43 ఎకరాలను కొనుగోలు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా లింగమనేని వాటా ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలే వెల్లడించాయి. దీనికి ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్ భూములు రాకుండా చంద్రబాబు సహకరించారు. ఈ విషయంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సెటిల్మెంట్లతో పరిటాల వీరంగం మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి హర్షవర్దన్ డైరెక్టర్లుగా ఉన్న పీఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ పేరుతో అమరావతి మండలం ధరణికోటలో సర్వే నంబర్ 38–1లో ఎకరం భూమిని రూ.3.50 లక్షలకు కొనుగోలు చేసి 2014 ఆగస్టు 27న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో సర్వే నంబర్ 371లో ఎకరం రూ.2 లక్షల చొప్పున రెండు ఎకరాల భూమిని ఆ సంస్థ పేరుతో కొనుగోలు చేసి.. 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన భర్త పరిటాల రవి సోదరి కుమార్తె వడ్లమూడి మౌనిక పేరుతో అమరావతి మండలం నెమలికల్లులో 71/1, 71/2బీ సర్వే నంబర్లలో ఒక ఎకరం భూమిని రూ.2 లక్షలకు కొనుగోలు చేసి 2014 నవంబర్ 24న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అమరావతి మండలం ధరణికోటలో అల్లుడు హర్షవర్దన్ పేరుతో 38/1 సర్వే నంబర్లో 1.3 ఎకరాల భూమిని ఎకరం రూ.2.10 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పరిటాల రవి సోదరి వడ్లమూడి సుధాశారద పేరుతో తుళ్లూరు మండల కేంద్రంలో సర్వే నంబర్ 193లో ఎకరం భూమిని రూ.4 లక్షలకు కొనుగోలు చేసి.. 2014 అక్టోబర్ 11న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రాజధాని ప్రకటన వెలువడక ముందే రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని మోహరింపజేసి.. వివాదాస్పద భూములపై సెటిల్మెంట్లు చేసి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కారుచౌకగా 11.60 ఎకరాలు కొట్టేసిన కోడెల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో సర్వే నంబర్ 21–సీలో ఎకరం రూ.1.87 లక్షల చొప్పున 1.66 ఎకరాలను రాజధానిపై ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేసి, 2015 మార్చి 7న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో వివాదాస్పద భూములను గుర్తించి, అధికార బలంతో వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో దూసుకెళ్లారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నంబర్లు 167–1ఏ, 167–1సీ, 168–1, 168–3లో 11.60 ఎకరాల భూమికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తుండటాన్ని పసిగట్టిన కోడెల శివరామకృష్ణ.. ఆ భూమిని చౌకగా కొట్టేశారు. అన్నదమ్ముల్లో ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్టనర్గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసి, 2015 ఆగస్టు 1న రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. వాస్తవంగా ఆ ప్రాంతంలో అప్పటికే ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతుండేది. కేసుల నమోదుకు రంగం సిద్ధం సీఐడీ అధికారులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి 4,069.94 ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్31 మధ్య కాలంలో అంటే రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించక ముందే కుటుంబ సభ్యులు, కుటుంబ సంస్థలు, బినామీల పేర్లతో ఆ భూములను దోచేయడం వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు బృందం, వ్యాపార సంస్థలపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. ‘రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం ప్రకటన చేయక ముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంలో ఆంతర్యమేమిటి? అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆ భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి? వాటికి ఆదాయ మార్గాలు ఏమిటి? ఆదాయపు పన్ను చెల్లించారా?’ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్లో భూములు కొనుగోలు చేసిన వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు సమాచారం ఇచ్చి ఆ సంస్థలతో కూడా కేసులు నమోదు చేయించి సమాంతరంగా విచారణ చేపట్టనున్నారు. -
రాజధాని ముసుగులో అంతులేని అక్రమాలు
సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అంతులేనన్ని అక్రమాలు, లెక్కలేనన్ని మోసాలకు పాల్పడటమే కాకుండా చట్టాలను చట్టబండలుగా మార్చేసి రాజధానిని కుంభకోణాలమయం చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. రాజధానిని ఎక్కడ ఎంపిక చేశారో ముందుగానే తమ వారికి ఉప్పందించి కారుచౌకగా భూములు కొనుగోలు చేసి అధికార రహస్యాల పరిరక్షణ చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘించారన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, పేదలకు కేటాయించిన భూముల రక్షణ కోసం తెచ్చిన పీవోటీ (బదిలీ చేయడానికి వీలులేని) చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించారని తెలిపారు. రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన ఆధార సహితంగా గత పాలకుల మోసాలను బట్టబయలు చేశారు. రాజధాని అంశంపై కేంద్రం నిపుణులతో శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే కనీసం నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని మండిపడ్డారు. క్యాన్సర్తో బాధపడుతూ కూడా శివరామకృష్ణన్ స్వయంగా తిరిగి సవివరమైన నివేదిక గత ప్రభుత్వానికి అందజేశారని చెప్పారు. గుంటూరు, నూజివీడు ఇలా పలు ప్రాంతాల పేర్లు ప్రచారంలోకి తెచ్చి చంద్రబాబు, ఆయన సన్నిహితులు అమరావతి ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ‘2014 జూన్ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు కొనుగోలు చేశారు. ఇది ఇప్పటి వరకూ బయటపడిన లెక్కలు మాత్రమే ఇంకా ఎన్ని ఎకరాలు బయటపడతాయో? స్పీకర్ అనుమతిస్తే ఎవరెవరు ఎంతెంత భూమి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రాంతంలో కొన్నారో ప్రజెంటేషన్ ఇస్తా’ అని బుగ్గన తెలిపారు. సభాపతి అనుమతించడంతో పేర్లతో సహా వెల్లడించారు. ఆ వివరాలు మంత్రి మాటల్లోనే... ఇన్సైడర్ ట్రేడింగ్ కాక మరేంటి? ‘చంద్రబాబు మనుషులు లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం లాంటి మారుమూల గ్రామాల్లో భూములు కొనడానికి కారణం అక్కడ రాజధాని వస్తుందని ఉప్పందడం వల్లే. లేదంటే మారుమూల పల్లెల్లో భూములు ఎందుకు కొంటారు? దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనక మరేమని అంటారు? కోర్ క్యాపిటల్కు 1,681 ఎకరాల మన భూమిని ఇచ్చి, అభివృద్ధికి మన నిధులిచ్చి ప్లాట్లు వేసుకోవడం కోసం కన్సార్టియంకు ఇస్తామా? వచ్చే ఆదాయంలో వాళ్లకు 52 శాతం, ప్రభుత్వానికి 48 శాతమా? రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మార్చి కామధేనువులా మార్చుకుని నిరంతరం పిండుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఈ మోసం ఇంతటితో ఆగలేదు జగ్గయ్యపేటలో ఎకరా రూ. లక్ష చొప్పున 498 ఎకరాలను వీబీసీ ఫెర్టిలైజర్స్కు కేటాయించిన తర్వాత దాని ధర పెంచడం కోసం ఆ ప్రాంతాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. దీనివల్ల బాగుపడింది వీబీసీ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యజమాని ఎంఎస్బీ రామారావు. ఆయన చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణకు వియ్యంకుడు. ఇలా చేస్తే కోటీశ్వరులు ఎందుకు కారు?’ ఆయన లోకేష్ బినామీ ఎస్సీ, ఎస్టీల నుంచి అసైన్డ్ భూములు కొన్న వారిపై చర్యలు తీసుకోవాలి. కొల్లి శివరాం 47.39 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేశ్కు అసోసియేట్ అని బయట ఎవరిని అడిగినా చెబుతారు. గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు (నారా లోకేష్ మనుషులు) 14.07 ఎకరాలు ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూమి కొన్నారు. (ఇంకా ఎవరెవరు కొన్నారో మంత్రి బుగ్గన పేర్లతో సహా వివరించారు) తమవారికి అప్పనంగా భూములు భూకేటాయింపుల్లోనూ గత ప్రభుత్వం అన్యాయమే చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, సిండికేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు తదితరాలకు ఎకరం రూ. 4 కోట్లు చొప్పున కేటాయించారు. కాగ్కు రూ .4కోట్లుకి గత పాలకులు తమకు కావాల్సిన వారికి మాత్రం ఎకరం రూ. 40 లక్షలకు, రూ. 20 లక్షలకు అప్పనంగా ఇచ్చేశారు. ప్రైవేట్ సంస్థలతో ఎంవోయూ ప్రతిపక్ష నాయకుడు ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని చెప్పారు. కానీ ఎంవోయూ ప్రైవేట్ సంస్థలైన సింగపూర్ కన్సార్టియంతో ఉంది. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కాలేదు. బాబు బినామీల భూముల చిట్టా ఇదిగో ►బాబు సొంత సంస్థ హెరిటేజ్ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. మొత్తం 14.22 ఎకరాలు డైరెక్ట్గా హెరిటేజ్ఫుడ్స్ పేరు మీదే ఉన్నాయి. ►ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే బినామీల పేరు మీద అప్పటి మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. బంధువులు, తన దగ్గర పనిచేసే ఉద్యోగుల పేరుతో నారాయణ 55.27 ఎకరాల భూమి కొన్నారు. ►ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు బినామీ పేర్లతో కొన్నారు. ►పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొనుగోలు చేశారు. ►రావెల కిషోర్ బాబు 40.85 ఎకరాలు మైత్రీ ఇన్ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. ►కొమ్మాలపాటి శ్రీధర్ 68.60 ఎకరాలను అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొన్నారు. ►అప్పటి ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు 37.84 ఎకరాలు బినామీ పేరుతో కొన్నారు. ►పయ్యావుల కేశవ్ 15.30 ఎకరాలు పయ్యావుల శ్రీనివాసులు అండ్ వేం నరేందర్ రెడ్డి పేరుతో కొన్నారు. ►వేమూరు రవికుమార్ ప్రసాద్ 25.68 ఎకరాలు కొన్నారు. ఆయన నారా లోకేష్ వ్యాపార భాగస్వామి అని అందరికీ తెలుసు. ►లింగమనేని రమేష్ 351 ఎకరాలను సుజనా, ప్రశాంత్ పేరు మీద, ఇతర కంపెనీలు మీద కొనుగోలుచేశారు. ►యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ 7 ఎకరాలు కొనుగోలు చేశారు. ►కోడెల శివప్రసాద్ 17.13 ఎకరాలు శశి ఇన్ఫ్రా పేరు మీద కొన్నారు. ►ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50 ఎకరాలను ధూళిపాళ్ల వైష్ణవి, దేవురపుల్లయ్య పేర్లతో కొనుగోలు చేశారు. ►వీరంతా మారుమూల పల్లెల్లో ఎందుకు కొన్నారు? టీడీపీ నాయకులు, వారి బంధువులు అక్కడ రాజధాని వస్తుందని తెలిసే 2014 జూన్ 1 నుంచి డిసెంబరు వరకు 4,070 ఎకరాలు కారుచౌకగా కొన్నారు. -
రాజధాని నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ.. ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలకు విరుద్ధంగా.. హైకోర్టులో కేసు విచారణలో ఉన్న అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా విజయవాడ, గుంటూరు మధ్యన చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను రాయలసీమ అభ్యుదయ సం ఘం నాయకులు కోరారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాం డ్తో 1953కు పూర్వం కోస్తా నాయకులు ఉద్యమాలు చేశారన్నారు. కోస్తా అప్పటికే అభివృద్ధి చెంది ఉండటంతో అప్పట్లో రాయలసీమ ప్రజలు తమిళనాడులో కొనసాగేలా చూడటం లేదా తమకూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు. ఇది గుర్తించిన కోస్తా నాయకులు.. రాయలసీమ ప్రజల అభీష్టం మేరకు రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేస్తామని, పదేళ్లలోగా తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదులపై ప్రాజెక్టులను నిర్మించి సీమకు నీళ్లందిస్తామని ప్రతిపాదిం చారు. వాటికి ఆమోదం తెలిపిన సీమ, కోస్తా నేతల మధ్య నవంబర్ 16, 1937న శ్రీబాగ్ ఒప్పం దం కుదిరిందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. సీమ ప్రజలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని వివరించారు. కానీ.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు తరలించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014తో రాష్ట్రాన్ని విభజించాక.. ఆంధ్రప్రదేశ్లో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ.. సీమ ప్రజలకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీమ ప్రజల మనోభిప్రాయాలకు విరుద్ధంగా విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే సీమలో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల స్థాయిలో నీటి మట్టాన్ని నిలపకుండా.. నీటికి కిందకు వదిలేస్తున్నారని వివరించారు. తక్షణమే జోక్యం చేసుకుని సీమ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. గవర్నర్ను కలసిన వారిలో హైకోర్టు రిటైర్డు జడ్జిలు పి.లక్ష్మణరెడ్డి, గోపాలరావు, రిటైర్డ్ ఐపీఎస్లు ఎ.హనుమంతరెడ్డి, వెంకటరెడ్డి, రిటైర్డు సీఈ శ్రీరామిరెడ్డి, రాయలసీమ అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎం.ఓబుళరెడ్డి, ఉపాధ్యక్షులు ఇమ్రాన్ హుస్సేన్, కన్వీనర్ ఇస్మాయిల్ రెడ్డి ఉన్నారు.