-
మాది అమీర్, కిరణ్ల సంబంధం వంటిది
ముంబై: శివసేన, బీజేపీలది అమీర్ఖాన్, కిరణ్ రావుల మధ్య సంబంధం వంటిదని ఎంపీ సంజయ్రావుత్ వ్యాఖ్యానించారు. ఇరుపార్టీల మధ్య స్నేహం ఉందని స్పష్టంచేశారు. 15 ఏళ్ల వివాహ బంధానికి చెక్ పెడుతూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవలె అమీర్ దంపతులు ప్రకటించారు. ఇద్దరి మధ్య సంబంధం మారిపోయినా, ఇంకా కలిసే ఉన్నట్లు వారిద్దరూ ఓ ప్రకటనలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ, సేనలు శత్రువులు కాదని ఇటీవల మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రావుత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోమవారం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. (వారి) దారులు విడిపోయాయి. కానీ, వారు స్నేహితులు. ఇక్కడ కూడా అంతే. (మా) మార్గా లు వేరు కానీ, స్నేహం అలాగే ఉంది. రాజకీయాల్లో స్నేహం ఉంటుంది. కానీ మేం (మహారాష్ట్రలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దీని అర్థం కాదు. తేడాలు ఉన్నాయి, కానీ నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, మేం (సేన, బీజేపీ) భారతదేశం–పాకిస్తాన్ కాదు. సమావేశాలు, చర్చలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్గాలు వేరయ్యాయి. రాజకీయాల్లో మా మార్గాలు విడిపోయాయి’’ అని అన్నారు. -
‘మహా’ రాజకీయం : ఎమ్మెల్యేలు జారిపోకుండా..
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండటంతో వేరేపార్టీ వలలో తమ ఎమ్మెల్యేలు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ముందస్తు చర్యలకు దిగడం తెల్సిందే. మహారాష్ట్రలో గెల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు రాజస్తాన్ రాజధాని జైపూర్లోని బుయెనా విస్టా రిసార్ట్స్కు తరలించింది. ఈ రిసార్ట్లోని 50 విల్లాల్లో ఎమ్మెల్యేలు బస చేస్తుండగా ఒక్కో విల్లా రోజువారీ టారిఫ్ దాదాపు రూ.1.20 లక్షలు. ప్రతి విల్లాకు ఒక ప్రైవేట్ స్విమ్మింగ్పూల్ వంటి హంగులున్నాయి. ఎమ్మెల్యేల దృష్టి ఇతర అంశాలపైకి పోకుండా ఉండేందుకు వరుసగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు అంచనా. బ్యుయెనా విస్టా రిసార్ట్ వెబ్సైట్ ప్రకారం గార్డెన్ విల్లా ఒకరోజు టారిఫ్ రూ.24వేలు ఉండగా, ప్రైవేట్ పూల్తో కూడిన హెరిటేజ్ విల్లాకు రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాయల్ ఎగ్జిక్యూటివ్ విల్లాకైతే ఏకంగా రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది. మూడు దశాబ్దాల బంధం ముగిసింది! శివసేనకు చెందిన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ మోదీ కేబినెట్ నుంచి రాజీనామా చేయడంతో హిందుత్వ భావాలున్న ఏకైక భాగస్వామ్య పారీ్టతో బీజేపీ మూడు దశాబ్దాల బంధం ముగిసినట్లయింది. సీట్ల పంపిణీ కుదరక రెండు పారీ్టలు 2014 శాసనసభ ఎన్నికల్లోనే విడివిడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచి్చంది. అనంతరం స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలం పెంచుకుంటూ వస్తోంది. దీంతో మోదీ, అమిత్ షాల నేతృత్వంలో హిందుత్వ సిద్ధాంతంతో నడుస్తున్న బీజేపీ నీడలో ఉండాల్సిన పరిస్థితి శివసేనకు ఏర్పడింది. వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే‡ ఉన్నంత కాలం మహారాష్ట్రలో ఒక వెలుగువెలిగిన తమను బీజేపీ తుడిచిపెడుతుందనే అనుమానాలు శివసేనలో ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతోనే శివసేన అనుమానం మరింత బలపడింది. కోరిన మంత్రి పదవి ఇవ్వనందునే కేంద్ర కేబినెట్లో శివసేన తమ నేత అనిల్ దేశాయ్ను చేరనివ్వలేదు. అధికార పక్షం తీరుపై పార్టీ పత్రిక సామ్నాలో ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. -
మోదీ వర్సెస్ ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’
ప్రధానితో తలపడుతున్న నాలుగు ‘మహా’ పార్టీలు ముంబై: మహారాష్ట్రలో మారిన రాజకీయ సమీకరణాలు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీల ప్రధాన కూటముల పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో.. ఐదు ప్రధాన పార్టీలు ఒంటరిపోరుకు దిగడం తెలిసిందే. దీంతో అవి పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటూ రాజకీయాలను రక్తి కట్టిస్తాయని పరిశీలకులు భావించారు. అయితే చిత్రం గా.. వీటిలో నాలుగు పార్టీలకు ఒకే ఒక్కరు శత్రువుగా మారారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ! శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్లు.. మోదీని, ఆయన పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. ఖండనమండనల్లో ఒకదాన్నొకటి మించిపోయి కమలదళాన్ని చీల్చిచెండాడుతున్నాయి. వీటిలో ఒకదానిపై ఒకదాని విమర్శలకంటే అన్ని కలిసి మోదీపై చేస్తున్న దాడే తీవ్రంగా ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పార్టీలకు, దేశ నాయకుడైన మోదీకి మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు రాష్ట్రానికి ‘వెలుపలి వ్యక్తుల’ని గ్యాంగ్ ఆఫ్ ఫోర్ పార్టీలు మండిపడుతున్నాయి. మహా రాష్ట్రను విభజించేందుకు, ముంబైని రాష్ట్రం నుంచి వేరుచేసేందుకు యత్నిస్తున్నారంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోనే బీజేపీ తమకు వెన్నుపోటు పొడిచింద ని శివసేన విరుచుకుపడుతోంది. విమర్శల దాడిని తట్టుకోవడానికి బీజేపీ కేవలం మోదీపైనే ఆధారపడుతోంది. సీఎం పదవికి అందరికీ ఆమోదయోగ్యమైన నేత లేకపోవడంతో రాష్ట్ర కమలనాథుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో మోదీనే తమను గట్టెక్కించే ఆపద్బాంధవుడని భావిస్తోంది. మహారాష్ట్రను విభజించే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు కుండబద్ధలు కొడుతున్నా ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ ప్రచారం ముందు దాని మాట గట్టిగా వినిపించడం లేదు. ఎన్నికల్లో బాగా ముందుకొచ్చే కుల, ప్రాంతీయ రాజకీయాలు ‘మోదీ వర్సెస్ గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పోరుతో వెనక్కి మళ్లడం గమనార్హం. -
ప్రచార సామగ్రికి డిమాండ్
సాక్షి, ముంబై: ఎన్నికల ప్రచార సామగ్రి విక్రయించే షాపులన్నీ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి. శివసేన-బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటముల మధ్య పొత్తు ఉంటుందా..? ఊడుతుందా...? అనే దానిపై మొన్నటి వరకు ఇరు పార్టీల నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. దీంతో ఎన్నికల సామగ్రి కొనుగోలు చేయలేకపోయారు. కాని ఇరు కూటముల మధ్య పొత్తు బెడిసి కొట్టడంతో రాష్ట్రంలోని మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాల్లోనూ అన్ని పార్టీల అభ్యర్థులు పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేసేందుకు అవసరమైన ప్రచార సామగ్రి కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. షాపుల్లో ముఖ్యంగా పార్టీ గుర్తులతో ముద్రించిన క్యాపులు, బ్యాడ్జీలు, కండువాలు, మాస్క్లు, చిన్న, పెద్ద జెండాలు, చీరలు, టీ-షర్టులు, కుర్తాలు, తలకు చుట్టుకునే రిబ్బన్లు, బ్యానర్లు, ప్ల కార్డులు, కరపత్రాలు ఇలా మొత్తం 25 రకాలకు పైగా ప్రచార సామగ్రి విక్రయానికి ఉంచారు. నగరంలో లాల్బాగ్, దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, నటరాజ్ మార్కెట్ తదితర ప్రాంతాలు ప్రచార సామగ్రి తయారీకి ప్రసిద్ధి చెందాయి. పొత్తు బెడిసికొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో, షాపుల్లో సామగ్రి కొరత ఏర్పడింది. కొందరు నాయకులు అర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమాని అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లకు, ఆఫ్సెట్ ప్రింటింగ్ పనులకు పెద్ద ఎత్తున అర్డర్లు దొరికాయి. అందులో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు తోడు అదనంగా కార్మికులను నియమించాల్సి వస్తోంది. అయినప్పటికీ సమయానికి సామగ్రి అందజేయలేకపోతున్నారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ప్రచార సామగ్రి అందజేయాలని నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు వారు అడిగినంత చెల్లించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్తో వ్యాపారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రింటింగ్ ప్రెస్ రంగంలో రూ.70-80 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఓ వ్యాపారి తెలిపాడు. ఏదేమైనా ఈ ఎన్నికలు నిరుద్యోగులకు ఒక వరంగా పరిణమించాయని చెప్పవచ్చు. -
ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో హెలికాప్టర్ల డిమాండ్ మరింత పెరిగిపోయింది. సాధ్యమైనన్ని ప్రచార సభలు నిర్వహించాలని నాయకుల ప్రణాళికలు రూపొందించుకున్నారు. అందుకు ప్రచార సభలకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను వినియోగించనున్నారు. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రధాన కూటముల మధ్య పొత్తు విషయం ఎటూ తేలకపోవడంతో సమయం వృథా అయింది. చివరకు పోత్తు విచ్ఛిన్నం కావడంతో అన్ని పార్టీలు ఒంటరిగా బరిలో దిగాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక్కో రోజుకు జరిగే నాలుగైదు ప్రచారాల సభలో పాల్గొనేందుకు అన్ని పార్టీల కీలక నాయకులకు తగినంత సమయం దొరకడం లేదు. రోడ్డు, రైలు మార్గం కంటే నాయకులు హెలికాప్టర్లనే ఎంచుకుంటున్నారు. విమానాలు, హెలికాప్టర్లు అద్దెకు ఇచ్చే కంపెనీల దిశగా నాయకులు పరుగులు తీస్తున్నారు. నేడు అన్ని పార్టీల బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీల నాయకుల సోమవారం నుంచి బహిరంగ సభలు, పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజు దాదాపు 40 హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు ఆకాశంలో గిరిగిర తిరగనున్నాయి. అందుకు లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వెనకాడే ప్రసక్తే లేదంటున్నారు నాయకులు. కొన్ని పార్టీలు ముందుగానే వాటిని బుక్ చేసుకున్నాయి. ఎన్సీపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, మాజీ మంత్రులు అజీత్ పవార్, ఆర్.ఆర్.పాటిల్, సునీల్ తట్కరే, కాంగ్రెస్ తరుఫున మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, మాజీ మంత్రులు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మోహన్ ప్రకాశ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ, శివసేనకు చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, తనయుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ తరఫున జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ ఖడ్సే లాంటి దిగ్గజాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రచార సభలకు హెలికాప్టర్లను వినియోగించ డానికి ఆయా పార్టీలు రూపొందించాయి. అందుకు సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్కు గంటకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలు, డబుల్ ఇంజిన్ ెహ లికాప్టర్కు గంటకు రూ.1.75 లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇవి గంటకు 225 కి.మీ. నుంచి 300 కి.మీ. వేగంతో దూసుకెళతాయి. రాజకీయ నాయకులకు ఒక్కో రోజులో కనీసం నాలుగు బహిరంగా సభల్లో పాల్గొనేందుకు వీలుకానుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement