breaking news
shirdi flights
-
తప్పతాగి, ఎయిర్హోస్టెస్కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్లైన్స్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్హోస్టెస్ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.రహతా పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
షిరిడీకి వెళ్లడం ఇక ఈజీ
షిరిడీ సాయిబాబా భక్తులకు శుభవార్త. ఇక నుంచి షిరిడీ వెళ్లాలంటే గంటల తరబడి రైలు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. వచ్చే నెల నుంచి నేరుగా షిరిడీకి విమానాలు వెళ్లనున్నాయి. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏడీసీ) సంస్థ అహ్మద్నగర్ జిల్లాలో షిరిడీ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. ఈ విమానాశ్రయానికి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు నగరాల నుంచి విమానాలు వచ్చేందుకు వీలుంది. 2002లో ఏర్పాటైన ఎంఏడీసీ ఇంతవరకు ఒక్క విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయలేదని కాగ్ ఇటీవలే వాతలు పెట్టింది. దాంతో తాము తొలిసారిగా ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ సీఎండీ విశ్వాస్ ఎం పాటిల్ తెలిపారు. విమానాశ్రయం దాదాపుగా సిద్ధమైందని, దీన్ని తామే నిర్వహిస్తామని, వచ్చే నెల నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ఆయన చెప్పారు. తొలుత కేవలం స్వదేశీ విమానాలను మాత్రమే ఇక్కడి నుంచి నడిపిస్తామని, ఆ తర్వాత అంతర్జాతీయ విమానాలు కూడా వస్తాయని అన్నారు. దీని కోసం పౌర విమానయాన మంత్రిత్వశాఖ రూ. 340.54 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని రన్వే 2,500 మీటర్ల పొడవుంటుందని, 3 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన టెర్మినల్ ఉందని, రన్ వేను 700 మీటర్ల మేర విస్తరించేందుకు ఇటీవలే రూ. 40 కోట్లు మంజూరయ్యాయని, దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టామని పాటిల్ వివరించారు. ఇప్పటికే ఏటీసీ టవర్, సిస్టంలు సిద్ధమయ్యాయని, దీనికి అంతర్జాతీయ లుక్ ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దేశంలోని వివిధ నగరాల నుంచి షిరిడీకి రావాలంటే ప్రస్తుతం రైలు, రోడ్డు మార్గాలు మాత్రమే ఉన్నందున ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని పాటిల్ చెప్పారు.