breaking news
Sheryln Chopra
-
రాజ్కుంద్రా కేసు: నటికి సమన్లు
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త , శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అశ్లీ చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా, వియాన్ ఇండస్ట్రీస్కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుంద్రాకు పోర్న్ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. రేపు (జూలై 27, ఉదయం 11 గంటలకు) తమ ముందు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చింది. ఈ కేసుకు సంబంధించి షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు సమాచారం కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని అంచనా. కాగా రాజ్ కుంద్రా వ్యవహారంపై సోషల్ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్, జూలై 23 వరకు రిమాండ్కు తరలించిన తరువాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై ఎటాక్ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగు తున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఆస్కార్ బరిలో 'కామసూత్ర 3డీ'
కామసూత్ర అనగానే చాలామంది అదేదో వినకూడని పదం విన్నట్లుగా మొహం పెట్టేస్తారు. అలాగే, ఈ నేపథ్యంలో వచ్చే సినిమా అంటే కొంతమందికి చులకన భావం కూడా ఉంటుంది. కానీ, అలాంటి ఫీలింగులేం పెట్టుకోమాకండి అంటున్నారు షెర్లిన్ చోప్రా. ‘‘మాది నీలి చిత్రం అన్నవాళ్లకి సరైన సమాధానం లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. మరోవైపు ఉద్వేగంగా కూడా ఉంది’’ అని ధీమాగా చెబుతున్నారు షెర్లిన్. ఈవిడగారి ధీమాకి కారణం ఉంది. ఆమె కథానాయికగా రూపొందిన తాజా చిత్రం ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఒకటి కాదు.. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ‘బెస్ట్ మోషన్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’’ విభాగాలకు ఈ చిత్రం ఎంపికైంది. మన భారతదేశం నుంచి దాదాపు ఐదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ విభాగాల్లో ‘కామసూత్ర’ నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడబోతున్నాయి. వీటిలో ‘కామసూత్ర’ లోని ఐదు పాటలూ ఉండటం విశేషం. చెన్నయ్కి చెందిన సచిన్, శ్రీజిత్ ఈ పాటలకు స్వరాలందించారు. రూపేష్ పౌల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా, వచ్చే నెల 16న అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 3న అస్కార్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.