breaking news
Shankar Basu
-
తప్పుకున్న భారత జట్టు ట్రైనర్!
ముంబై: భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న శంకర్ బసు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. చెన్నై టెస్టు ముగిసిన తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బీసీసీఐకి లేఖ పంపించారు. గత ఏడాది శ్రీలంకతో సిరీస్కు ముందు జట్టుతో చేరిన బసు కారణంగానే ఇటీవల ఆటగాళ్ల ఫిట్నెస్ అద్భుతంగా మెరుగుపడింది. తమలో మార్పుకు బసునే కారణమంటూ కెప్టెన్ కోహ్లి కూడా తరచుగా ప్రశంసించాడు. అయితే జట్టులో కొంత మంది ఆటగాళ్లు గాయాలపాలు కావడానికి అదే కారణమని విని పించింది. తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా బసు ట్రైనింగ్ చేయించారంటూ కొందరు ఆటగాళ్లు బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శంకర్ బసు రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదంచలేదు. -
టీమిండియా ఫిట్నెస్ కోచ్ రాజీనామా
ముంబై: భారత క్రికెట్ జట్టు ఫిట్నెస్ కోచ్ శంకర్ బసూ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్టు సిరీస్ తరువాత రాజీనామా చేయడానికి సిద్ధమైన శంకర్ బసూ.. తాజాగా తన రాజీనామా పత్రాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అందజేశారు. గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టులో ఫిట్నెస్ కోచ్ గా చేరిన బసూ.. సుమారు ఏడాది కాలంలోనే జట్టు నుంచి బయటకు వచ్చేశారు. గత కొంతకాలంగా టీమిండియా జట్టును ఫిట్నెస్ పరంగా బాగా బలోపేతం చేసిన బసూ ఆకస్మిక రాజీనామాకు పలువురు ఆటగాళ్లే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా, మొహ్మద్ షమీలు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తమ ట్రైనింగ్ చిట్కాలను మార్చాలంటూ కొంతమంది ఆటగాళ్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రొగ్రామ్ నిర్వహించాలని వారు బసూను కోరడంతోనే అతను రాజీనామా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, బసూ రాజీనామా పునరాలోచించుకోవాలంటూ భారత టీమ్ మేనేజ్మెంట్ కోరినా, బసూ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గతంలో స్వాష్ ప్లేయర్స్ దీపికా పల్లికల్, జోస్నా చిన్నప్పలకు బసూ ఫిట్ నెస్ కోచ్ గా పని చేశారు.దాంతో పాటు ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా బసూ తన సేవలను అందించాడు. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత ఇష్టమైన ఫిట్నెస్ కోచ్ శంకర్ బసూ.