breaking news
Seven projects
-
ఎల్రక్టానిక్స్ విడిభాగాల స్కీము కింద 7 ప్రాజెక్టులు ఓకే..
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ స్కీము (ఈసీఎంఎస్) కింద ఏడు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 5,532 కోట్లని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ప్రాజెక్టుల కింద దేశీయంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను ఉత్పత్తి చేయడం వల్ల రూ. 20,000 కోట్ల మేర దిగుమతి బిల్లుల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇవి సుమారు 5,195 ఉద్యోగావకాశాలు కల్పించగలవని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. స్కీము కోసం మొత్తం 249 ప్రతిపాదనలు వచ్చినట్లు మంత్రి చెప్పారు. పీసీబీ ప్రాజెక్టులు దేశీయంగా 27 శాతం అవసరాలను, కెమెరా మాడ్యూల్స్ 15% డిమాండ్ను తీరుస్తాయన్నారు. ప్రాజెక్టులివీ..గ్రీన్ సిగ్నల్ లభించిన వాటిల్లో మదర్బోర్డ్ బేస్, కెమెరా మాడ్యూల్స్, కాపర్ ల్యామినేట్స్, పాలీప్రొపిలీన్ ఫిలిమ్ ప్రాజెక్టులు మొదలైనవి ఉన్నాయి. కేనెస్ గ్రూప్నకు చెందినవి నాలుగు, సిర్మా గ్రూప్, యాంబర్ గ్రూప్లో భాగమైన ఎసెంట్ సర్క్యూట్స్, ఎస్ఆర్ఎఫ్ సంస్థలకు సంబంధించి తలా ఒక ప్రాజెక్టు ఉన్నాయి. నాలుగు ప్రాజెక్టులపై కేనెస్ రూ. 3,280 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 4,300 కోట్లు విలువ చేసే మల్టీ లేయర్ పీసీబీలు, రూ. 12,630 కోట్ల విలువ చేసే కెమెరా మాడ్యూల్ సబ్–అసెంబ్లీలు, రూ. 6,875 కోట్ల విలువ చేసే హెచ్డీఐ (హై–డెన్సిటీ కనెక్ట్) పీసీబీలను తయారు చేయనుంది. మరోవైపు, రూ. 991 కోట్ల పెట్టుబడులతో ఎసెంట్ సర్క్యూట్స్ రూ. 7,847 కోట్ల మలీ్ట–లేయర్ పీసీబీలను ఉత్పత్తి చేయనుంది. సిర్మా స్ట్రాటెజిక్ ఎల్రక్టానిక్స్ రూ. 765 కోట్లతో రూ. 6,933 కోట్ల విలువ చేసే మలీ్ట–లేయర్ పీసీబీలను, ఎస్ఆర్ఎఫ్ రూ. 496 కోట్ల పెట్టుబడులతో రూ. 1,311 కోట్ల పాలీప్రొపిలీన్ ఫిలింలను ఉత్పత్తి చేయనున్నాయి. -
ఈ ఏడాదికి ‘ఏడు’ ప్రాజెక్టులు!
వందకోట్లు వెచ్చిస్తే చాలు.. సాగులోకి లక్ష ఎకరాలు తెలంగాణ సర్కార్ తక్షణ {పాధాన్యమిదే హైదరాబాద్: ఏడాది కాలంలో ఏడు ప్రాజెక్టులను పూర్తిచేసేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఒక భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తిచేసి సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వీటికి మరో వందకోట్ల నిధులు వెచ్చిస్తే చాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతున్నట్లు తక్షణ ఆయకట్టు అభివృద్ధిలోకి వచ్చే ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యమిచ్చేలా నివేదికలు తయారుచేసింది. దీని ప్రకారం కోయిల్సాగర్ ప్రాజెక్టుతో పాటు గొల్లవాగు, నీల్వాయి, పెద్దవాగు-జగన్నాథ్పూర్, రాళ్లవాగు, మత్తడివాగు, చౌట్పల్లి హన్మంతురెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం చివరిదశలో ఉంది. నిజానికి ఇందులో చాలా ప్రాజెక్టులు 2010-11, 2011-12 నాటికే పూర్తి చేయాలని గత ప్రభుత్వాలు నిర్దేశించుకున్నప్పటికీ భూసేకరణ సమస్య, కాంట్రాక్టర్ల ఆలస్యం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో పనులు పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2014-15లో పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం రూ.915 కోట్లు అవసరమని తేల్చిన ప్రభుత్వం ఇప్పటికే రూ.820 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ.100 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. మరో 16 ప్రాజెక్టులు రెండో దశలో.. పనులు పాక్షికంగా పూర్తిచేసుకున్న మరో 16 ప్రాజెక్టులను రెండోదశలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఉదయ సముద్రం, ఎస్సారెస్సీ స్టేజ్-2, కిన్నెరసాని, దేవాదుల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల కోట్ల మేర కేటాయింపులు జరుపవచ్చని అంచనా వేస్తున్నా, 2015-16 నాటికి ఈ ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి వీటిద్వారా మరో 2 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరందించాలని చూస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లోనే నాగార్జునసాగర్, నిజాంసాగర్ల ఆధునికీకరణ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వరద కట్టల అభివృద్ధికి నిధులను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక భారీ ప్రాజెక్టులైన ప్రాణహిత-చేవెళ్ల, కాంతానపల్లి ప్రాజెక్టుల ప్రాధాన్యతను ప్రభుత్వం పూర్తిగా వెనక్కు నెట్టిన విషయం తెలిసిందే.


