breaking news
separate Rayalaseema
-
ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ర్ట సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఏక్యాంపులోని కార్యాలయంలో ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ వాసి అయిన కోస్తాంధ్రాను అభివృద్ధి చేస్తూ సీమను విస్మరిస్తున్నారని విమర్శించారు. తిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కళాశాల సీట్లను కోస్తా వారికి కేటాయించేందుకు జీవో 120 తెచ్చి సీమ వాసులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తానన్న ముఖ్యమంత్రి దాని గురించి పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుహాన్బాషా, నాయకులు సాయికృష్ణచౌదరి, ఉమామహేశ్వరరెడ్డి, గుర్రప్పయాదవ్ పాల్గొన్నారు. -
'ప్రత్యేక రాయలసీమ.. ఆంధ్ర రాజధానిగా విశాఖను చేయాలి'
రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించారు. అలాకాని పక్షంలో తెలంగాణలో రాయలసీమను కలపాలని కిశోర్ చంద్రదేవ్ సూచించారు. ఇక ఆంధ్ర ప్రాంతానికి విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని నివేదించారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం సోమవారం ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమైంది. తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు జీవోఎంతో భేటి అయ్యారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆ ప్రాంత మంత్రులు కోరగా, సీమాంధ్ర మంత్రులు ప్రత్యేక ప్యాకేజీ, హైదరాబాద్ యూటీ విషయం గురించి మాట్లాడినట్టు తెలిపారు.