-
పెళ్లైన రెండు నెలలకే భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేసిన మైనర్
జైపూర్: పెళ్లయిన మొదట్లో భార్యభర్తల మధ్య అనుబంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండటం చూస్తే ఎవరికైనా ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతో సరదాగా, సంతోషంగా కాలం ఇట్టే గడిచిపోతుంటుంది. అయితే పెళ్లి చేసుకుని తనతో తీసుకొచ్చిన భార్యను కంటికి రెప్పలా రక్షించుకోవాల్సింది పోయి మరో వ్యక్తికి అమ్మకానికి పెట్టాడు ఓ కీచక భర్త. పెళ్లైన రెండు నెలలకే కట్టుకున్న భార్యను ఓ ముసలోడికి రూ. లక్షా 80 వేలకు అమ్మేశాడు. పైగా ఈ శాడిస్టు భర్త 17 ఏళ్ల మైనర్ అవ్వడం గమనార్హం. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! వివరాలు.. ఒఢిశా రాష్ట్రం బొలంగిర్ జిల్లాకు చెందదిన రాజేష్ రానా అనే వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి సంప్రదాయంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తరువాత గత ఆగస్టులో ఇటుక బట్టీలో పని చేయడానికి భార్యభర్తలిద్దరూ రాజస్థాన్ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఇద్దరు కలిసి పనులు చేసుకుంటూ జీవించారు. అయితే అయితే కొత్త పనిలో చేరిన కొన్నిరోజులకు రాజేష్ తన భార్యను బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి రూ. 1,80,000లకు విక్రయించాడు. భార్యను విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బుతో విపరీతంగా జల్సాలు చేశాడు. చదవండి: రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు.. ఖరీదైన స్మార్ట్ఫోన్ కొని భార్య ఎవరితోనో పారిపోయిందని అమ్మాయి వాళ్ల తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తమ కూతురు ఇలా చేయదని భావించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బొలంగిర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా నుంచి వచ్చిన పోలీసు బృందం బరన్ గ్రామానికి చేరుకొని మహిళ గురించి ఆరా తీశారు. అప్పుడే యువతిని 55 ఏళ్ల వ్యక్తికి భర్త అమ్మేశాడన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. -
'లక్ష రూపాయలకు నా భార్యను అమ్మేస్తా'
- ఫేస్బుక్లో ఓ ప్రబుద్ధుడి నిర్వాకం ఇండోర్: ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంలోనే మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వికృత ఘటన చోటుచేసుకుంది. అప్పుల పాలైన ఓ 30 ఏళ్ల వ్యక్తి.. వాటిని తీర్చుకోవడానికి తన భార్యను అమ్మడానికి సిద్ధమయ్యాడు. లక్ష రూపాయలు ఇస్తే తన భార్యను అమ్మేస్తానంటూ ఏకంగా ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. అతని నిర్వాకంతో నివ్వెరపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త దిలీప్ మాలిపై ఐపీసీ సెక్షన్ 509 (మాటలు, చర్యలు, చేష్టలతో మహిళలను కించపరచడం) ఎరోద్రోమ్ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు దిలీప్ సింగ్ తన భార్య, రెండేళ్ల కూతురు ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆ పోస్టులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. తన భార్యను అమ్మాలనుకుంటున్నాని హిందీలో ఈ పోస్టులో పేర్కొన్నాడు. 'వేర్వేరు వ్యక్తుల వద్ద నేను తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేస్తాను. ఎవరైనా కొనేందుకు ఆసక్తిగా ఉంటే నా ఫోన్ నంబర్కు సంప్రదించండి' అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. తన బంధువుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అతని భార్య షాక్ తింది. తనను, తన కుటుంబసభ్యులను అవమానపరిచేందుకు అతను ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ మాలితో ఆమెకు మూడేళ్ల కిందట పెళ్లయింది. వివాహం అనంతరం ఈ జంట ఇండోర్లో స్థిరపడింది. అక్కడ తెలిసినవారందరి దగ్గరా అప్పులు చేసిన దిలీప్.. వాటిని తీర్చలేక తన పూర్వీకుల ఊరికి పరారయ్యాడు. దీంతో చేసేదేమీ లేక తాముంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి అతని భార్య, రెండేళ్ల కూతురు తమ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement