breaking news
Security guard harassment
-
లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు..
ఢిల్లీ: మరో షాకింగ్ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో లేడీస్ హాస్టల్లోకి జొరబడి.. ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్కు చెందిన సెక్యూరిటీ గార్డు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకాగా.. విషయం బయలకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ఉన్న ఓ లేడీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ కారిడార్లోంచి వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశారు. ఇంతలో ఓ యువతిని దొరకబుచ్చుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి సైతం పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనపై హాస్టల్ ఓనర్ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ దృష్టికి చేరడంతో ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో డీసీడబ్ల్యూ రంగంలోకి దిగి.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB — Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022 వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేయాలని స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీసులకు కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు. అయితే బాధితురాలు ఫిర్యాదుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటాగా స్వీకరించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ డీసీపీ శ్వేతా చౌహాన్ వెల్లడించారు. Since the complainant is against giving a statement, legal opinion was taken&as per legal opinion & in light of video footage, FIR being registered suo motto by police: DCP Central Dist, Shweta Chauhan on a security guard molesting & manhandling girls at a PG hostel in Karol Bagh pic.twitter.com/GdzvVjnwZQ — ANI (@ANI) August 17, 2022 ఇదీ చదవండి: ఇది రూ. 500 మర్డర్!! తల నరికి.. -
గంగరాజుగారి గెస్ట్హౌస్లో దాష్టీకం!
తాడేపల్లి రూరల్ (గుంటూరు) : అది ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్. కృష్ణా తీరంలో ఉంది. ఆయన బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా సరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. కృష్ణా తీరంలో ఉన్న ఆయన గెస్ట్హౌస్లో వీఐపీలు, వీవీఐపీలు బస చేస్తుంటారు. సదరు పారిశ్రామికవేత్త ఇచ్చే ‘ఆత్మీయ ఆతిథ్యం’తో సంతృప్తిచెంది వెళ్తుంటారు. పోలీసు అధికారుల నుంచి, సినిమా నటుల వరకు పార్టీలతో సంబంధం లేకుండా పొలిటీషియన్లకు అక్కడ రాచమర్యాదలు జరుగుతుంటాయని సమాచారం. సామాన్యులకు లోపలకు ప్రవేశం ఉండదు. కృష్ణా నదిని ఆక్రమించుకుని, నది లోపలకు అద్భుతమైన లాంజ్గా నిర్మించిన ఆ గెస్ట్హౌస్ లోపల జరిగే విషయాలు బయటకు పొక్కవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గెస్ట్హౌస్లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు కాళ్లు, చేతులు విరిగిన స్థితిలో బుధవారం గుంటూరు ప్రభు త్వ ఆస్పత్రి పాలయ్యూడు. ఏప్రిల్ 24న గెస్ట్హౌస్లో ఇనుప రాడ్లతో అత డిని కొందరు చితకబాదినట్టు సమాచా రం. ‘బాధలు భరించలేను.. చచ్చిపోతున్నా.. రక్షించండి...’ అంటూ కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వినిపించుకోకుండా అతణ్ణి రాక్షసంగా చితకబాదినట్లు తెలుస్తోంది. బాధితుడి పేరు పి.సైదా. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన అతను గెస్ట్హౌస్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా డు. అతణ్ణి చితకబాదిన వారిలో గెస్ట్హౌస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న సతీష్తోపాటు మరికొందరు ఉన్నట్లు బాధితుని బంధువులు చెబుతున్నారు. ఈ విషయంపై నోరు మెదిపేందుకు సైతం సైదా భయపడుతున్నాడు. గెస్ట్హౌస్ పనివారు చెబుతున్న దానిప్రకా రం సైదా ఏప్రిల్ 24న ఆలస్యంగా విధులకు హాజరయ్యాడని సమాచా రం. సూపర్వైజర్ అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదని.. ఆ కోపంతోనే కొట్టారని అంటున్నారు. ఇంత చిన్నకారణానికే అంత దారుణంగా కొడతారా అని ప్రశ్నిస్తే మాకేం తెలి యదు, మమ్మల్ని అడగొద్దంటూ సిబ్బంది పారిపోతున్నారు. ఈ దాడికి బలమైన కారణం ఏదో ఉండి ఉంటుం దని, అది బయటకు రాకుండానే సైదాపై దాడిచేసి ఉంటారని, రహస్యం గా చికిత్స చేయించేందుకు విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పిం చారని స్థానికులు అనుమానిస్తున్నారు. కాలు, చెయ్యి విరగడం, కంటిపై భాగంలో తీవ్ర గాయమవడం, బీపీ విపరీతంగా పెరగడంతో అతనికేదైనా జరిగితే తమ పీకల మీదకొస్తుందంటూ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేయడంతో హడావుడిగా ఆరు రోజుల అనంతరం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి నుంచి ప్రభుత్వాస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే విషయం చెప్పేందుకు వారు సైతం నిరాకరించడం గమనార్హం.