-
‘థ్వాయిట్స్ హిమానీనదం’.. కరిగిపోతే ప్రళయమే!
సాక్షి, నేషనల్ డెస్క్: థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. ఈ గ్లేసియర్తోపాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగి, తీర ప్రాంతాలు చాలావరకు నీట మునిగి నామరూపాల్లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. థ్వాయిట్స్ తాజా స్థితిగతులపై అమెరికా, యూకే, స్వీడన్ సైంటిస్టులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 200 ఏళ్లలో కరిగిన దానికంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువ వేగంగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ జియోసైన్స్’ పత్రికలో ప్రచురించారు. సైంటిస్టులు అత్యాధునిక పరికరాలతో థ్వాయిట్స్ గ్లేసియర్ పరిమాణాన్ని గణించారు. ప్రతిఏటా 1.3 మేళ్లకుపైగా(2.1 కిలోమీటర్ల) కరిగిపోతున్నట్లు తేల్చారు. ‘‘గ్లేసియర్ చివరి దశకు చేరుకుంటోందని చెప్పొచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద మార్పులను మనం అంచనా వేయొచ్చు’’ అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన మెరైన్ జియోఫిజిసిస్ట్ రాబర్ట్ లార్టర్ చెప్పారు. ఐరాస సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం సముద్ర తీరాలకు 60 మైళ్ల పరిధిలోనే నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే సమీపంలోని ఆవాసాలు మునిగిపోతాయి. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ముప్పు తప్పదు. గ్రేట్ బ్రిటన్ అంత పెద్దది! ► పశ్చిమ అంటార్కిటికాలోని థ్వాయిట్స్ గ్లేసియర్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మొత్తం పరిమాణం కంటే కొంత తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంతో దాదాపు సమాన పరిమాణంలో ఉంటుంది. ► గ్లేసియర్ మొత్తం చుట్టుకొలత 74,131 చదరపు మైళ్లు(1,92,000 చదరపు కిలోమీటర్లు). అంటే గ్రేట్ బ్రిటన్ చుట్టుకొలతతో సమానం. ► ఇక దీని మందం ఎంతంటే 4,000 మీటర్లు (13,100 అడుగులు). ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో థ్వాయిట్స్ వాటానే అధికం. ► థ్వాయిట్స్ మొత్తం మందం 4 కిలోమీటర్లు కాగా, ఇందులో రెండు కిలోమీటర్లకు పైగా సముద్ర ఉపరితలం నుంచి దిగువ భాగాన ఉంది. ► థ్వాయిట్స్ హిమానీనదం పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటిమట్టం దాదాపు మూడు మీటర్ల మేర(10 అడుగులు) పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదీ చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం -
2070 నాటికి ఆ ఖండం పరిస్థితి
ఈ భూమి మీద ఏ జీవరాశికి లేని అరుదైన లక్షణం విచాక్షణ శక్తి మానవుని సొంతం. మంచికి, చెడుకు మధ్య తేడా గుర్తించడం మానవునికే సాధ్యం. ఇంత అరుదైన సామార్ధ్యం ఉన్న మనిషి మాత్రం స్వార్ధపూరితంగా తయారయ్యాడు. అతని అత్యాశకు బలవుతున్నది వాతావరణం, జీవరాశి. వీటి గురించి శాస్త్రవేత్తలు గొంతు చించుకుని చెప్తున్న మనం మాత్రం తలకెక్కించుకోవటం లేదు. ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పటికే చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే గతి తప్పిన వాతావరణం, విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు, నిప్పులు చెరుగుతున్న భానుడు వెరసి తీవ్ర క్షామం, ఆకలి, దరిద్రం. వీటన్నింటిని నిత్యం చూస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా మనిషి మేలుకోకపోతే అతి త్వరలోనే మనిషి మనుగడ తుడిచిపెట్టుకుపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆందోళనకరంగా మారిన అంటార్కిటికా వాతావరణ పరిస్ధితులు. భూమి మీద ఉన్న ఏడు ఖండాల్లో అంటార్కిటికాకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం మంచుతో కప్పబడి మానవ నివాసానికి అనుకూలంగా లేని వాతవారణంతో పాటు.. అరుదైన జీవరాశికి ఆవాసంగా ఉన్న ప్రాంతం ఇది. అలాంటిది ఇప్పుడు ఈ ఖండంలోని మంచు ఆందోళనకర రీతిలో కరిగిపోతుంది. కేవలం 1992 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 3 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిందని సాటిలైట్ పరిశీలనలో తెలింది. దక్షణ అంటర్కిటికా ప్రాంతంలో ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తల. గడిచిన శతాబ్ద కాలంలో మంచు మూడు రెట్ల అధికంగా కరుగుతూ ఏకంగా ఏడాదికి 159 బిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేశారు శాస్త్రవేత్తలు. మంచే కదా.. కరగుండా ఉంటుందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరు సముద్రాలలో కలుస్తుంది. ఫలితంగా సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. గత పాతికేళ్ల నుంచి అంటార్కిటికాలో మంచు కరగడం వల్ల సముద్ర జలాల స్థాయి దాదాపు 8 మిల్లి మీటర్లు పెరిగింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే 2070నాటికి అంటార్కిటికా పరిస్థితి ఏంటి..? అంటార్కిటికాలో కలిగే మార్పులు.. ప్రపంచపై ఉండే ప్రభావం వంటి అంశాల గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలు ఆందోళనకర వాస్తవాలను వెల్లడించారు. ఈ అంశాల గురించి ప్రముఖ బ్రిటీష్ జర్నల్ ‘నేచర్’లో వెల్లడించారు. అంతేకాక ప్రంపంచ ముందు రెండు పరిష్కారాలను కూడా ఉంచారు. వీటిలో ఒకటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పట్టించుకోకుండా, మన స్వార్ధ పూరిత చర్యలతో ప్రకృతిని మరింత నాశనం చేయడమా లేక ఇప్పటికైన మేల్కొని గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి, పర్యావరణాన్ని కాపడడమా. ఈ రెండింటిలో మనిషి ఎంచుకునే దాని మీదనే అంటార్కిటిక భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంటర్కిటికాయే ఎందుకు... భూమి మీద ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగిన వాటి ఫలతం మిగితా ప్రాంతాల్లో అంత త్వరగా కనిపించే అవకాశం ఉండదు. కానీ అంటార్కిటికా, దక్షిణ సముద్రంలో వచ్చే మార్పులు మాత్రం మానవాళి మీద చాలా త్వరగా ప్రభావం చూపుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు అధిక మొత్తంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, మంచు శకలాలు కూడా త్వరగా కరుగుతాయి. ఫలితంగా ఇంతకాలం సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడుతున్న దక్షిణ సముద్రం అతి త్వరలోనే విపత్కర పరిస్థితులును ఎదుర్కొనున్నట్లు ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. తక్షణ కర్తవ్యం... భూమి మీద ముఖ్యమైన అంటార్కిటికా, దక్షిణ సముద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ‘అంటార్కిటికా ట్రీటి సిస్టం’ పర్యవేక్షిస్తుంది. ఇన్నాళ్లు అంటార్కిటికా బాధ్యతలను కాపాడిన ఈ సంస్థకు మారుతున్న పర్యావరణ పరిస్ధితుల నుంచి అంటార్కిటకాను కాపాడటం పెద్ద సవాలుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మంచు తిరోగమనం వల్ల సముద్ర జలాల ఆమ్లీకరణ పెరుగుతుంది. ఫలితంగా మహాసముద్రాల పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైత అంత త్వరగా గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడంతో పాటు పర్యావరణానికి హానీ చేసే మానవ కార్యకలపాలను కూడా తగ్గించుకుంటే అంటార్కిటికాను మాత్రమే కాక ప్రపంచాన్ని కూడా కాపాడిన వాళ్లం అవుతాము. -
వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టం!
స్టాక్హోం: సముద్రపు నీటిమట్టం ఆరేళ్ల క్రితం అనుకున్న దానికన్నా వేగంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ మార్పుపై అంతర్జాతీయ కమిటీ (ఐపీసీసీ) నిర్థారణకు వచ్చింది. ప్రపంచ దేశాల ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కూడిన ఐపీసీసీ భూతాపోన్నతి వల్ల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, నివేదికలను వెలువరిస్తూ ఉంటుంది. 2100 నాటికి సముద్రపు నీటిమట్టం 18 నుంచి 59 సెంటీమీటర్ల ఎత్తును పెరిగే అవకాశం ఉందని 2007లో ఐపీసీసీ నాలుగో నివేదికలో అంచనా వేసింది. ఈ నివేదికకు నోబెల్ బహుమతి కూడా దక్కింది. అయితే, అప్పుడు అనుకున్నదానికన్నా అధికంగా 26 నుంచి 81 సెంటీమీటర్ల ఎత్తున సముద్రపు నీటి మట్టం పెరగనున్నదని, ఫలితంగా కోస్తా తీరప్రాంతాలకు ముంపు ముప్పు అనుకున్నదానికన్నా అధికంగా ఉంటుందని ఐపీసీసీ తాజాగా అంచనా వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement