breaking news
scam 1992
-
రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది
ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు.కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్లో దాగివున్న నిజాలను ఈ సిరీస్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. -
'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
2003లో సంచలనం సృష్టించిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఆధారంగా తుషార్ హీరానందని తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ'. హిట్ సిరీస్ ‘స్కామ్ 1992’ని తెరకెక్కించిన హన్సల్ మెహతా నిర్మించారు. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించారు. గతనెలలో ఓటీటీలో రిలీజైన పార్ట్-1 హిట్ టాక్ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు) ఈ నేపథ్యంలో పార్ట్-2 ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్-2 రిలీజ్పై సోనీలివ్ ట్వీట్ చేసింది. స్కామ్ 2003 పార్ట్-2 నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపింది. తొలిభాగంలో ఈ సిరీస్ను ఐదు ఎపిసోడ్స్లో చూపించారు. రెండో భాగంలో కూడా దాదాపు ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. Sabki zubaan pe tha Telgi ka naam, par Telgi ki zubaan pe kiska? Find out on 3rd November! Scam 2003-The Telgi Story, all episodes, streaming on 3rd November, only on Sony LIV #Scam2003OnSonyLIV #Scam2003 Thanking @BajpayeeManoj for lending his incredible voice ✨ pic.twitter.com/wLz04HZLcW — Sony LIV (@SonyLIV) October 18, 2023 -
రాకేష్ ఝున్ఝున్వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు!
రాజస్తానీ మార్వాడీల కుటుంబానికి చెందిన రాకేశ్ ఝున్ఝున్వాలా.. ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్గా పనిచేసేవారు. స్టాక్మార్కెట్లలో తండ్రి ఇన్వెస్ట్ చేస్తుండటం, వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండటం వంటి వాతావరణంలో పెరగడంతో తనకు చిన్నతనం నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడినట్లు రాకేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వార్తల్లో ఉన్న తీరును బట్టి కంపెనీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని తండ్రి వివరించడంతో 15 ఏళ్ల ప్రాయం నుంచే మార్కెట్ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు. డిగ్రీ తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించారు. ఆయన మాట ప్రకారమే సీఏ చదివిన తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టారు. తొలి పెట్టుబడి బంపర్ హిట్..! 1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి సెసా గోవా, టైటాన్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లారు. మార్కెట్లోకి రాకేశ్ అడుగుపెట్టినప్పుడు సెన్సెక్స్ 150 పాయింట్లుగా ఉండేది. ప్రస్తుతం అది 60,000 పాయింట్ల వద్ద ఉంది. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాకేశ్ సంపద కూడా రాకెట్లా దూసుకెళ్లి సుమారు రూ. 46,000 కోట్ల స్థాయికి చేరింది. 2017లో టైటాన్ షేరు జోరు మీద ఉన్నప్పుడు 1 రోజులోనే ఏకంగా రూ. 900 కోట్లు ఆర్జించారు. రాకేశ్ కొన్న కంపెనీ షేరు పెరుగుతుంది.. అమ్మితే పడిపోతుంది అనే సెంటిమెంటుతో అసంఖ్యాకంగా ఇన్వెస్టర్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు. వైఫల్యాలూ ఉన్నాయి.. రాకేశ్కు నష్టాలు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా ఇన్ఫ్రా విభాగంలో పెట్టుబడులు ఆయనకు కలిసిరాలేదు. రియల్టీ భవిష్యత్ బాగుంటుందనే అంచనాలతో 2013లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్లో రూ. 34 కోట్లు పెట్టి 25 లక్షల షేర్లు కొన్నారు. 2018లో కంపెనీ దెబ్బతిన్నప్పటికీ మరికాస్త కొన్నారు. కానీ చివరికి ఆ కంపెనీ దివాలా తీసింది. మంధన రిటైల్లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. 2016లో సంస్థ షేరు రూ. 247గా ఉన్నప్పుడు 12.7% వాటా కొన్నారు. 2021లో రూ. 16కి అమ్మేశారు. అలాగే డీబీ రియల్టీలోనూ, ప్రైవేట్ ఈక్విటీ కింద చేసిన పెట్టుబడుల్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్లూ నష్టాలు తెచ్చిపెట్టాయి. వివాదాలూ ఉన్నాయి.. బిగ్ బుల్గా పేరొందినప్పటికీ ఆయన బేర్ పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1992 హర్షద్ మెహతా స్కామ్ సందర్భంలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభాలు గడించారు. సాధారణంగా షేర్లంటేనే స్కాములనే దురభిప్రాయం కొంత ఉండే మార్కెట్లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారికి భిన్నంగా రాకేశ్కి కాస్త క్లీన్ ఇమేజే ఉంది. అయినప్పటికీ ఆయనపైనా ఆరోపణలు ఉన్నాయి. ఆప్టెక్లో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును 2021లో ఆయనతో పాటు మరికొందరు రూ. 37 కోట్లతో సెటిల్ చేసుకున్నారు. అలాగే సోనీ పిక్చర్స్లో విలీనం కావాలని జీ ఎంటర్ప్రైజెస్ నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజుల ముందే.. జీ ఎంటర్ప్రైజెస్లో రాకేశ్ ఇన్వెస్ట్ చేయడం, స్వల్ప వ్యవధిలోనే రూ. 70 కోట్లు లాభాలు పొందడం, ఆయన వ్యవహారాలపై సందేహాలు రేకెత్తించాయి. కంపెనీల పోర్ట్ఫోలియో.. రాకేశ్కు 40 పైచిలుకు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్లో భాగమైన టైటాన్ వీటన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనది. వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. టైటాన్లో ఆయనకున్న 5.05% వాటాల విలువే రూ. 11,000 కోట్ల మేర ఉంటుంది. స్టార్ హెల్త్, ర్యాలీస్, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, టాటా మోటర్స్ మొదలైన సంస్థలలోనూ ఆయన ఇన్వెస్ట్ చేశారు. హంగామా మీడియా, ఆప్టెక్ సంస్థలకు చైర్మన్గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలైన వాటిల్లో డైరెక్టరుగా ఉన్నారు. భార్య రేఖ, తన పేరు కలిసి వచ్చేలా రేర్ (RARE) ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసి, కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్లైన్స్లో రాకేశ్, ఆయన భార్య రేఖకు 40% వాటాలు ఉన్నాయి.