breaking news
save electricity
-
విద్యుత్ వినియోగం తెలుసుకో.. బిల్లు భారం తగ్గించుకో..
ఇంటిలో కావలిసినంత వెలుతురు ఉంటుంది... కానీ విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. సహజసిద్ధమైన గాలి చల్లగా శరీరాన్ని తాకుతున్నా ఏసీలు ఆపేందుకు ఇష్టపడం.. కళ్ల ముందే ఫ్యాన్లు తిరుగుతున్నా పట్టించుకోం. జీరో ఓల్ట్ బల్బులతో విద్యుత్ పొదుపు చేయవచ్చని ఆ శాఖాధికారులు పదేపదే చెబుతున్నా వినిపించుకోం.. ప్రతినెలా వచ్చే బిల్లును చూసి భయపడతాం. అందుకే.. వినియోగం తెలుసుకుని.. బిల్లు భారం తగ్గించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారుల్లో చైతన్యం నింపుతున్నారు. వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా.. కాస్త పొదుపు మంత్రం పాటిస్తే.. ఇతర పారిశ్రామిక అవసరాలను తీర్చవచ్చని విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వినియోగదారులపై బిల్లుల భారం కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు. విద్యుత్ను ఆదాచేసే చిన్నచిన్న మెలకువలను తెలియజేస్తున్నారు. విద్యుత్ ఆదాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలిలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 1,65,784 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగం కనెక్షన్లు 1.05 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 22 వేలు, వాణిజ్య పరిశ్రమల కనెక్షన్లు 3033, ఇతర విద్యుత్ కనెక్షన్లు 35,751 ఉన్నాయి. రోజుకు జిల్లాలో 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ పొదుపు పాటిస్తే భవిష్యత్లో మరింత నాణ్యమైన విద్యుత్ను అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. (క్లిక్: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ) ఇదీ లెక్క.. ఒక్కో విద్యుత్ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణ బల్బు వంద వాట్స్ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. ఒక కిలోవాట్. గంట పాటు పది బల్బులు(ఒక కిలోవాట్) ఒకేసారే వేస్తే ఒక యూనిట్ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇలా ప్రతీ విద్యుత్ ఉపకరణానికీ ఓ లెక్క ఉంది. దీనిని తెలుసుకుంటే అవసరం మేరకు విద్యుత్ను వినియోగించవచ్చని, బిల్లు కూడా ఆదా అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో చాలా వరకు విద్యుత్ అనవసరంగా వాడుతున్నారు. అవసరం లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు, ఇన్వర్టెర్లు వినియోగి స్తున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ప్రజలు విద్యుత్ ఆదా చేయాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నాం. – టి.గోపాలకృష్ణ, విద్యుత్శాఖ ఈఈ, పాలకొండ -
విద్యుత్ను పొదుపుగా వాడాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘రోజూ జిల్లాలో 1.50 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కె.విజయ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం నుంచి నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో అరగంట సేపు, గ్రామాల్లో గంటసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. నెల్లూరులో ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు సరఫరా ఉండదన్నారు. కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో కొన్నింట్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు, మరికొన్నింట్లో 12.30 నుంచి ఒంటి గంట వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. రూరల్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 9 నుంచి పది గంటల వరకు, ఇంకొన్ని చోట్ల 12.00 నుంచి ఒంటి గంట వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని పరిశ్రమలకు ప్రతి మంగళవారం పవర్ హాలిడేగా నిర్ణయించామని ఎస్ఈ తెలిపారు. నెల్లూరు రూరల్, గూడూరు ప్రాంతాల్లోని పరిశ్రమలకు బుధవారం పవర్ హాలిడేగా ప్రకటించామన్నారు. వ్యవసాయానికి సంబంధించి రెండు గ్రూపులుగా విభజించి ఏడుగంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. -
కరెంట్ ఆదా చేస్తే కాసులొస్తాయ్!
పథకం ఇదీ.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఆ ఫీడర్ల పరిధిలోని రైతుల పంపుసెట్లకు ఏఎంఆర్ (ఆటోమేటిక్ మీటర్ రీడింగ్) మీటర్లను బిగించింది. పంపుసెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్ పరిమాణాన్ని నిర్ధారించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్ విద్యుత్కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. నిర్దేశించినపరిమాణం కన్నా అధికంగా విద్యుత్ వినియోగించుకున్నా ఎలాంటి చర్యలు ఉండవని రైతులకు భరోసా ఇచ్చింది. రెండేళ్లలో 4 వేల మంది రైతులు 9.68 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదాచేసి.. రూ.38.72 లక్షలు ప్రోత్సాహకంగా పొందారు. సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ ఆదా చేయండి.. భూగర్భ జలాలను సంరక్షించండి.. ఆ మేర డబ్బులు పొందండి’ పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సరికొత్త పథకం ఇది. చాలా మంది రైతులు నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్ను వాడి.. పొదుపు చేసిన విద్యుత్కు సంబంధించిన నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. పంజాబ్లో ఈ పథకం విజయ వంతంగా కొనసాగుతోందని.. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. భూగర్భ జలాల పరిరక్షణతోపాటు విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి దోహదపడుతుందని సూచించింది. చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ వృథా అవుతుండటంతో.. పంజాబ్ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో వరి, గోధుమ పంటల సాగు జరుగుతోంది. నీటి అవసరం అధికంగా ఉండే ఈ పంటల కోసం అక్కడి రైతులు.. పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను, విద్యుత్ను వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో.. రైతులు నిరంతరం మోటార్లు నడిపిస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. అవసరానికి మించి భూగర్భ జలాలను తోడుతుండడంతో.. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. మరోవైపు విద్యుత్ వృధా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా పంజాబ్ ప్రభుత్వం ‘పానీ బచావో.. పైసే కమావో’పథకాన్ని తెరపైకి తెచ్చింది. ప్రపంచబ్యాంక్ భాగస్వామ్యంతో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆధ్వర్యంలోని ‘అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)’ దీనికి రూపకల్పన చేసింది. పైలట్ ప్రాజెక్టుగా.. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్పీసీఎల్) 2018లో ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపట్టింది. ఆయా ఫీడర్ల పరిధిలోని రైతుల పంపుసెట్లకు ఏఎంఆర్ (ఆటోమేటిక్ మీటర్ రీడింగ్) మీటర్లను బిగించింది. పంపుసెట్ల సామర్థ్యం, పంటల సాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్ పరిమాణాన్ని నిర్ధారించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్ విద్యుత్కు రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. నిర్దేశించిన పరిమాణం కన్నా అధికంగా విద్యుత్ వినియోగించుకున్నా ఎలాంటి చర్యలు ఉండవని రైతులకు భరోసా ఇచ్చింది. చదవండి: డేంజర్ డెంగీ 4 వేల మంది రైతులు.. పంజాబ్ ప్రభుత్వం ప్రతి నెలా ఏ రైతు ఎంత విద్యుత్ ఆదా చేశారు, ఎంత సొమ్ము పొందుతున్నారన్న దానిపై ప్రతినెలా వారికి ఎస్ఎంఎస్లు పంపుతోంది. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న 6 ఫీడర్ల పరిధిలో 4వేల మందికిపైగా రైతులు విద్యుత్ ఆదా చేసి ప్రోత్సాహకాలు పొందారు. 2018 నుంచి 2020 వరకు వారు ఏకంగా 9.68 లక్షల యూనిట్లు విద్యుత్ ఆదాచేసి.. రూ.38.72 లక్షలను ప్రోత్సాహకంగా అందుకున్నారు. ప్రోత్సాహకానికి అర్హత సాధించని ఇతర రైతులు కూడా భారీగానే విద్యుత్, భూగర్భ జలాలను పొదుపు చేసి ఉంటారని అధికారులు చెప్తున్నారు. పంజాబ్లో మొత్తం 5,900 గ్రామీణ ఫీడర్ల పరిధిలో 14.16 లక్షల బోరుబావులు ఉన్నాయి. దశలవారీగా అన్ని ఫీడర్ల పరిధిలో పథకాన్ని అమలు చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. దీర్ఘకాలికంగా దీని ఫలితాలు చాలా బాగుంటాయని, త్వరలోనే మరో 250 ఫీడర్ల పరిధిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించాయి. ఈ పథకం అమలుకు ‘ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (టెరీ), పంజాబ్ వ్యవసాయ వర్సిటీ, ఐటీ పవర్ ఇండియా (ఐటీపీఐ)’సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఇక్కడా అమలు చేస్తే ప్రయోజనమే.. తెలంగాణలో 25.34 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో వ్యవసాయానికి రోజుకు రెండు విడతల్లో ఆరేడు గంటల పాటు మాత్రమే సరఫరా ఉండేది. కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇలా 24 గంటల సరఫరాతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ నాలుగు రేట్లు పెరిగిపోయిందని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇటీవలే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి నివేదించాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ తరహాలో మన రాష్ట్రంలోనూ పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని.. ఫలితాలను బట్టి విస్తరించాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం రాష్ట్రానికి సరఫరా చేస్తున్న విద్యుత్లో మూడో వంతు వరకు వ్యవసాయానికే ఖర్చవుతోందని.. ఈ పథకాన్ని అమలు చేస్తే విద్యుత్తోపాటు భూగర్భ జలాలు ఆదా అవుతాయని చెప్తున్నారు. దీనివల్ల అటు కరెంటు సంస్థలు, ఇటు రైతులకు కూడా ప్రయోజనమని పేర్కొంటున్నారు. విద్యుత్, భూగర్భ జల వినియోగం తగ్గించుకోవాలి ‘‘రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్, భూగర్భ జలాల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలాచోట్ల భూగర్భ జల మట్టాలు అడుగంటిపోయి బోరుబావుల్లో నీళ్లు రావడం లేదు. విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు కొత్తసాగు పద్దతులు, విధానాల పట్ల అవగాహన కల్పించాలి. విద్యుత్ పొదుపు కోసం పంజాబ్ అమలు చేస్తున్న పథకాన్ని మనదగ్గర అమలు చేయగలమా పరిశీలించాలి. అయితే ఏ పంట సాగుకు ఎంత నీళ్లు, ఎంత విద్యుత్ అవసరమన్న అంశాలను ఖరారు చేయడంలో సమస్యలు రావచ్చు. భూగర్భ జలాలు ఎక్కువ ఉంటే తక్కువ విద్యుత్తోనే అవసరం తీరుతుంది. కానీ భూగర్భ జలాలు తక్కువగా ఉన్నచోట రైతులు విద్యుత్ పొదుపు చేయడం కుదరకపోవచ్చు. -డి.నరసింహారెడ్డి, విద్యుత్ రంగ నిపుణుడు -
సచివాలయంలో ఏసీల తొలగింపు
-
సచివాలయంలో ఏసీల తొలగింపు
హైదరాబాద్: విద్యుత్ కొరత రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరెంట్ పొదుపు చర్యలపై దృష్టి సారించింది. ప్రధాన పరిపాలన కార్యాలయం సచివాలయం నుంచే విద్యుత్ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. అనుమతి, అర్హతలేని అధికారులకు ఏసీ కనెక్షన్లు తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శి స్థాయి అధికారులు మాత్రమే ఏసీ వాడాలని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ సచివాలయంలోని ఏసీబీడీ బ్లాకుల్లో అక్రమంగా వాడుతున్న ఏసీలను అధికారులు సోమవారం తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలోనూ కరెంట్ ఆదా చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.