breaking news
sats chairman
-
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశాడు. పాకిస్తాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ అజేయ అర్ధ సెంచరీ సాధించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను, జెర్సీని అందజేశాడు. తిలక్ ఇచ్చిన బ్యాట్తో రేవంత్ రెడ్డి క్రికెట్ షాట్ కొడుతున్న ఫోజు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి, ‘శాట్స్’ ఎండీ సోనీ బాలాదేవి, సీఎం ముఖ్యకార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆశలు వమ్ము చేయకూడదని... శేరిలింగంపల్లి: పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఎంతో ఒత్తిడి ఉన్నా... ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత రెచ్చగొట్టినా... ఎక్కడా సంయమనం కోల్పోలేదని... వారికి తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చానని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. చిన్ననాటి నుంచి తాను ప్రాక్టీస్ చేసిన శేరిలింగంపల్లిలోని లేగలా క్రికెట్ అకాడమీకి మంగళవారం తిలక్ వచ్చాడు. ఈ సందర్భంగా తన కోచ్ సలామ్ బాయష్, అకాడమీ ఎండీ పృథ్వీ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ‘కోట్లాది మంది భారతీయుల ఆశలను వమ్ము చేయకూడదనుకున్నాను. చివర్లో ఒత్తిడి వచ్చినా... దేశం కోసం ఆడాలి, గెలిపించాలన్న లక్ష్యంతో ఓపికగా ఆడాను. హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించారు. నేనీ స్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ సలామ్, పృథ్వీ పాత్ర ఎంతో ఉంది. ఈ ఇద్దరినీ ఎప్పటికి మర్చిపోలేను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ విషయంలో కోహ్లి, రోహిత్ శర్మలు ఆదర్శం’ అని తిలక్ తెలిపాడు. -
‘బంగారు పతకాల తెలంగాణ’ సాధిద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో మేటిగా ఉంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని స్పోర్ట్స అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆటల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణకు కొనసాగింపుగా ‘బంగారు పతకాల తెలంగాణ’ సాధించడమే తమ లక్ష్యమని చైర్మన్ వెల్లడించారు. తాను చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ అంశాలపై తీసుకున్న చర్యలు, సమీక్షా సమావేశాలు తదితర అంశాల గురించి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రోత్సాహకాలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి క్రీడల నిర్వహణతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చైర్మన్ చెప్పారు. 2014 జూన్ 2నుంచి ఇప్పటి వరకు ఇందు కోసం మొత్తం రూ. 15 కోట్ల 8 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన వివరాలు ప్రకటించారు. తాను జరిపిన సమావేశాల్లో ఆటల అభివృద్ధి కోసం క్రీడా ప్రముఖులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలనుంచి పలు విలువైన సూచనలు వచ్చాయని, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంను పూర్తి స్థారుులో క్రీడా కేంద్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాని చైర్మన్ స్పష్టం చేశారు. మరో వైపు కొంత మంది క్రీడాకారులకే భారీ మొత్తం ఇవ్వడంపై స్పందిస్తూ... అది వేర్వేరు కారణాలు, అంశాలపై ఆధారపడి ప్రభుత్వం తీసుకున్న విచక్షణాపరమైన నిర్ణయమని ఎండీ దినకర్ బాబు వివరణ ఇచ్చారు. మరోవైపు యోగాలాంటి గుర్తింపు లేని క్రీడల టోర్నీ నిర్వహణ కోసం పెద్ద మొత్తం కేటారుుంచడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. చాలా కాలంగా తగిన ప్రోత్సాహం లేకుండా ఉన్న కొన్ని రకాల క్రీడలను గుర్తించి వాటిని కూడా తగిన విధంగా సహాయం అందించడంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ప్రతిభ గల యువ ఆటగాళ్లను తగిన విధంగా ఉద్యోగాల ద్వారా, చదువుల్లో రిజర్వేషన్ ద్వారా ప్రోత్సహిస్తామని దినకర్బాబు హామీ ఇచ్చారు. మరో వైపు ‘శాట్స్’లో ఖాళీగా ఉన్న కోచ్ల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, గతంలో కొన్ని అక్రమాలు జరిగినా, ఈసారి దానికి అవకాశం ఇవ్వకుండా సమర్థులైన వారినే ఎంపిక చేస్తామని ఎండీ వెల్లడించారు. తెలం గాణలో క్రీడాభివృద్ధి కోసం ఎవరైనా ముందుకొచ్చి సూచనలు చేయవచ్చని, తాము వాటిని తీసుకొని తగిన విధంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.